క్షయవ్యాధి (TB) అనేది ఒక అంటు వ్యాధి, ఇది టీబీ బాక్టీరియాతో ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇది సాధారణంగా ఊపిరితిత్తులలో సంభవిస్తుంది, దీనిని పల్మనరీ టీబీ అని పిలుస్తారు. అయితే ఇది మూత్రపిండాలు, వెన్నెముక, మెదడు లేదా శరీరంలోని ఏదైనా ఇతర భాగాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు, దీనిని ఎక్స్ట్రాపల్మోనరీ టీబీ అంటారు. కొన్ని సందర్భాల్లో టీబీ బ్యాక్టీరియా పునరుత్పత్తి అవయవాలను కూడా ప్రభావితం చేస్తుంది, దీనిని జననేంద్రియ క్షయవ్యాధి అని పిలుస్తారు.
నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని రాజేంద్రనగర్లో వైసీపీ లోక్ సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి. నెల్లూరు అసెంబ్లీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. రాజేంద్రనగర్ ప్రాంతంలోని స్వర్ణకారులకు అన్ని విధాల అండగా ఉంటామన్నారు.
పాకిస్తాన్ మూడు వైపుల నుంచి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ తన పశ్చిమ సరిహద్దులో భారతదేశంతో శత్రుత్వంతో ఉండగా.. ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించిన తాలిబాన్ ఉత్తర సరిహద్దులో ఆయుధాలతో నిలబడి ఉంది. ఈశాన్య సరిహద్దులో ఇరాన్తో పాకిస్థాన్ శత్రుత్వం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
రాజకీయ హింసాత్మక ఘటనలపై మూడు జిల్లాల ఎస్పీలను వివరణ కోరానని ఏపీ సీఈఓ ఎంకే మీనా పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరిగిన హత్య రాజకీయ హింసేనని జిల్లా ఎస్పీ చెప్పారన్నారు.
నంద్యాల జిల్లా బనగానపల్లె రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల రేసులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి దూసుకుపోతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైన బీసీ జనార్థన్ రెడ్డి ఈసారి ఎలాగైనా బనగానపల్లెలో టీడీపీ జెండా ఎగురవేయాలని పట్టుదలగా ఉన్నారు.
ఆపరేషన్ గరుడ'లో భాగంగా డ్రై ఈస్ట్తో మిక్స్ చేసిన దాదాపు 25వేల కేజీల డ్రగ్స్ను సీబీఐ స్వాధీనం చేసుకుంది. డ్రగ్స్ను కలిగి ఉన్న షిప్పింగ్ కంటైనర్ను అదుపులోకి తీసుకుని.. మొత్తం సరుకును సీజ్ చేసి, కేసు నమోదు చేశారు.
నారా భువనేశ్వరి చేపడుతోన్న నిజం గెలవాలి కార్యక్రమంపై ఏపీ సీఈఓకు వైసీపీ ఫిర్యాదు చేసింది. ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు దాడికి దిగారంటూ వైసీపీ ఫిర్యాదు చేసింది. ఏపీ సీఈఓ ఎంకే మీనాను ప్రత్తిపాడు వైసీపీ అభ్యర్థి బాలసాని కిరణ్, నవరత్నాలు వైస్ ఛైర్మన్ నారాయణ మూర్తి కలిశారు.
చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం వెదురుకుప్పంలో పురుగుల మందు తాగి చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అన్నదమ్ముల భూమి పరిష్కార విషయంలో పోలీసుల జోక్యం చేసుకుని.. చంద్రశేఖర్ను పోలీసులు కొట్టడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి చంద్రశేఖర్ (50) ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.
న్నికలు ముందు చెప్పే మాటలు అధికారంలోకి రావడం కోసం కాదని, గెలిచాక ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేయాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా.. కనీస సౌకర్యాలకు నోచుకోని వారికి ఉపశమనం కలిగించే పనులు చేశారన్నారు.