Congress 2nd List: లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను కాంగ్రెస్ అధిష్ఠానం విడుదల చేసింది. ఇందులో 57 మంది పేర్లు ఉండగా.. తెలంగాణ నుంచి ఐదుగురి పేర్లు ఉన్నాయి. ఐదుగురు అభ్యర్థులలో పెద్దపల్లి- గడ్డం వంశీకృష్ణ, మల్కాజ్గిరి-సునీత మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్-దానం నాగేందర్, చేవెళ్ల-రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూల్-మల్లు రవి పేర్లను అధిష్ఠానం వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణ నుంచి నలుగురు ఎంపీ అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంకా 8 స్థానాలు హస్తంపార్టీ అధిష్ఠానం పెండింగ్లో పెట్టింది.
మిగిలిన 8 లోకసభ స్థానాల అభ్యర్దుల ఖరారుపై కసరత్తు కొనసాగనుంది. ఖమ్మం, భువనగిరి, హైదరాబాద్, వరంగల్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లోక్సభ స్థానాలకు అభ్యర్ధులను కాంగ్రెస్ ఖరారు చేయనుంది.
అభ్యర్థుల జాబితా ఇదే..
1. చేవెళ్ల – రంజిత్ రెడ్డి
2. నాగర్ కర్నూల్ – మల్లు రవి
3. మల్కాజ్ గిరి- సునీత మహేందర్ రెడ్డి
4. పెద్దపెల్లి – గడ్డం వంశీ
5. సికింద్రాబాద్ – దానం నాగేందర్.