-
ఏళ్లకు ఏళ్లు ఒకేచోట కొందరు ఐఏఎస్లు..!
ఐఏఎస్ అధికారులకు మూడేళ్లకోసారి బదిలీలు జరుగుతాయి. ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని ట్రాన్స్ఫర్లు ఉంటాయి. తెలంగాణలో కొందరు IASలు మాత్రం ఏళ్ల తరబడి తాము పనిచేస్తున్నచోట కుర్చీలకు అతుక్కుపోయారు. అక్కడి నుంచి కదిలితే ఒట్టు. అధికార వర్గాల్లో ప్రస్తుతం వారి గురించి ఆసక్తికర చర్చ జరుగుతోందట. ఒకే పోస్టులో మూడేళ్లకంటే ఎక్కువ కాలం పనిచేస్తున్న కొందరు ఐఏఎస్లు..! తెలంగాణ కేడర్లో దాదాపు 150 మంది IASలు పనిచేస్తున్నారు. వీరిలో కొందరు కేంద్ర సర్వీసుల్లో ఉంటే.. మరికొందరు రాష్ట్రంలోనే వివిధ […] -
చల్మెడ చేరికతో కరీంనగర్ టీఆర్ఎస్లో రచ్చ..!
కొత్తగా టీఆర్ఎస్లో ఒకరి చేరిక.. ఆ జిల్లాలో ఇద్దరిని టెన్షన్ పెట్టిస్తోందా? ఆ ఇద్దరిలో ఒకరు మంత్రి కావడంతో అధికారపార్టీ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయా? పార్టీ వర్గాలు ఒక అంచనాకు రాలేని పరిస్థితి ఉందా? ఇంతకీ ఎవరి ప్లేస్ రీప్లేస్ కానుంది? టీఆర్ఎస్లో చల్మెడ చేరికతో జిల్లా రాజకీయాల్లో చర్చ..! కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ రాజకీయాలు రోజుకోలా మారుతున్నాయి. మాజీ మంత్రి చల్మెడ ఆనందరావు తనయుడు లక్ష్మీ నరసింహారావు గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో కొత్త సమీకరణాలు.. సరికొత్త […] -
కాంగ్రెస్ లేకుండానే కూటమి ఏర్పాటు చేస్తాం-పీకే
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ .. కాంగ్రెస్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీ వ్యతిరేక ప్రతిపక్ష కూటమి.. కాంగ్రెస్ లేకపోయినా ఏర్పాటు చేయవచ్చని కామెంట్ చేశారు. 1984 తర్వాత కాంగ్రెస్ ఒంటరిగా గెలవలేదని .. గత పదేళ్లల్లో కాంగ్రెస్ 90 శాతం వైఫల్యాల్నే చూసిందన్నారు ప్రశాంత్ కిషోర్. గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి పార్టీ అధ్యక్షుడైతేనే కాంగ్రెస్ పరిస్తితిలో మార్పు వస్తుందని వ్యాఖ్యానించారు . 2019 ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ కనీస పోటీ ఇవ్వలేకపోయిందని […] -
స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీలు మాట్లాడారా..? : నాదెండ్ల మనోహర్
పార్లమెంట్ సమావేశాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీలు ఒక్క మాటైనా మాట్లాడారా..? అని ఫైర్ అయ్యారు పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న ఉద్యమకారులకు సంఘీభావం తెలపడానికే పవన్ కళ్యాణ్ దీక్ష అని పేర్కొన్నారు. ఢిల్లీకి అఖిపక్షాన్ని తీసుకెళ్లాలని సీఎం జగనుకు పవన్ లేఖ రాశారని.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే ఆందోళనలకు సీఎం జగన్ బాధ్యత తీసుకుంటారని భావిస్తున్నామన్నారు. విశాఖ స్టీల్ […] -
కరోనా కట్టడికి బూస్టర్ డోస్ తప్పదా..?
ఇండియాలో కరోనా మహమ్మారి భయం ప్రజలను పట్టి పీడిస్తోంది. కొద్దికాలంపాటు డెల్టా వేరియంట్ విజృంభించగా..ప్రస్తుతం ఒమిక్రాన్ భయపెడుతోంది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో మూడో వేవ్ వచ్చే ప్రమాదం ఉందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐతే…కొత్త కేసులను అరికట్టేందుకు బూస్టర్ డోసులు ఇవ్వాలనే డిమాండ్ సైతం వినిపిస్తోంది. కొవిషీల్డ్ను బూస్టర్ డోసుగా ఇచ్చేందుకు అనుమతించాలని టీకా తయారీ సంస్థ సీరం…డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు కూడా చేసింది. దీనిపై ‘కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ’ […] -
రాజోలు ఎమ్మెల్యే రాపాకకు జనసేన సెగ..!
నాడు ఓట్లు వేయించి గెలిపించిన పార్టీ కార్యకర్తలు నేడు ఈ ఎమ్మెల్యే మాకొద్దు బాబోయ్ అంటున్నారు. పార్టీ మారిపోయానని చెప్పి రెండేళ్లుగా ఎమ్మెల్యే దూరంగా ఉంటున్నారు. గెలిపించిన పార్టీ కార్యకర్తలు మాత్రం ఫ్లెక్సీల మీద ఫ్లెక్సీలు పెట్టి మరీ ఆ ఎమ్మెల్యేను వెంటాడుతునే ఉన్నారట. అవకాశం వచ్చినప్పుడల్లా ఎమ్మెల్యేకు నిద్ర లేకుండా చేస్తున్నారట. ఇదంతా అధికార పార్టీ నేతే వెనకుండి నడిపిస్తున్నారని తెలిసి.. సొంతపార్టీ వాళ్లే తలలు పట్టుకుంటున్నారట. రాపాకను ఇరకాట పెట్టే పనిలో జనసైనికులు? తూర్పుగోదావరి […] -
LIVE : పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్ష
-
ఇండియాలో తగ్గిన కరోనా.. కొత్తగా 7,774 కేసులు
ఇండియాలో కరోనా కేసులు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం… కాస్త తగ్గాయి కరోనా కేసులు. గత 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 7,774 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. మరో 306 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. దీంతో దేశ వ్యాప్తంగా మరణాల సంఖ్య 475434 కు చేరుకుంది. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 92,281 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్లో పేర్కొంది కేంద్రం. ఇక మరో […] -
కిట్టి పార్టీల పేరుతో కోట్లు కొల్లగొట్టిన శిల్ప చౌదరి
పెట్టుబడులు, అధిక వడ్డీల పేరిట ప్రముఖల దగ్గర కోట్ల రూపాయలు కొట్టేసిన శిల్పను కోర్టు అనుమతితో మూడు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు… రెండోరోజు ప్రశ్నించారు. పెట్టుబడుల పేరిట కోట్లాది రూపాయలు వసూలు డబ్బు ఎక్కడికి తరలించారనే కోణంలో విచారణ జరిపారు. ఎంతమంది నుంచి డబ్బు వసూలు చేశారు?..తీసుకున్న సొమ్మును ఏం చేశారనే కోణంలో ఆరా తీశారు. గండిపేట్ సిగ్నేచర్ విల్లాస్లో ఉంటున్న శిల్ప దంపతులు అధిక వడ్డీలు అంటూ వీఐపీలను బురిడీ కొట్టించి కోట్లు వసూలు […] -
జిల్లాల పర్యటనకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు
సభ్యత్వంపై దృష్టి సారించింది టీ కాంగ్రెస్. గాంధీభవన్లోజరిగిన సీనియర్ల సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ముప్పై లక్షల సభ్యత్వం టార్గెట్గా చేయాలని నిర్ణయించారు నేతలు. సభ్యత్వ నమోదుకు 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంచార్జ్లను నియామకం చేశారు. వీరు ఎప్పటికప్పుడు సమన్వయం చేయనున్నారు. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల్లో కో ఆర్డినేటర్లను కూడా నియమించనుంది పార్టీ. ఈ నెల 24 తర్వాత పూర్తి స్థాయిలో సభ్యత్వం మీద సమీక్షలు చేయనున్నారు. సభ్వతం తీసుకున్న వారికి రెండు లక్షల ఇన్సూరెన్స్ చేయనున్నారు. […]
తాజావార్తలు
-
Jananayagan : విజయ్ లాస్ట్ మూవీతో కిరణ్కు తిప్పలు
-
Ashwini Vaishnaw: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటన
-
Pakistan: ‘‘అసిమ్ మునీర్ కండోమ్లు పంచుతాడా.?’’ పాక్ ఆర్మీ చీఫ్ కొత్త బాధ్యతలపై సెటైర్లు..
-
Vietnam Boat Accident: వియత్నాం బోటు ప్రమాదం.. తెలంగాణ అలర్ట్.!
-
Lucky Plants: ధనలక్ష్మిని ఇంట్లోకి లాగేసే ‘లక్కీ ప్లాంట్స్’.. మీ తలరాత మారిపోవడం ఖాయం అంట!
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!