స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీలు మాట్లాడారా..? : నాదెండ్ల మనోహర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ సమావేశాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీలు ఒక్క మాటైనా మాట్లాడారా..? అని ఫైర్ అయ్యారు పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న ఉద్యమకారులకు సంఘీభావం తెలపడానికే పవన్ కళ్యాణ్ దీక్ష అని పేర్కొన్నారు. ఢిల్లీకి అఖిపక్షాన్ని తీసుకెళ్లాలని సీఎం జగనుకు పవన్ లేఖ రాశారని.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే ఆందోళనలకు సీఎం జగన్ బాధ్యత తీసుకుంటారని భావిస్తున్నామన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం లాభాల్లో ఉంది.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ అవసరం లేదని కేంద్రానికి ఇప్పటికే చెప్పాం.. ఇంకా ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని కేంద్రం దృష్టికి మేం తీసుకెళ్లామని… అమిత్ షాతో పాటు.. బీజేపీతో జరిపే అనేక సమావేశాల్లో ప్రైవేటీకరణ చేయొద్దనే విషయాన్ని పవన్ స్వయంగా కోరారని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంటును కేంద్రం ప్రైవేటీకరణ చేయదని జనసేన బలంగా నమ్ముతోందని… మోడీ నాయకత్వాన్ని నమ్ముతున్నాం.. చక్కగా దేశాన్ని పాలిస్తున్నారన్నారు నాదెండ్ల మనోహర్.
Also Read
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!