చల్మెడ చేరికతో కరీంనగర్ టీఆర్ఎస్లో రచ్చ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్తగా టీఆర్ఎస్లో ఒకరి చేరిక.. ఆ జిల్లాలో ఇద్దరిని టెన్షన్ పెట్టిస్తోందా? ఆ ఇద్దరిలో ఒకరు మంత్రి కావడంతో అధికారపార్టీ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయా? పార్టీ వర్గాలు ఒక అంచనాకు రాలేని పరిస్థితి ఉందా? ఇంతకీ ఎవరి ప్లేస్ రీప్లేస్ కానుంది?
టీఆర్ఎస్లో చల్మెడ చేరికతో జిల్లా రాజకీయాల్లో చర్చ..!
Also Read
- Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
- OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
- Off The Record: పాలకొల్లు వైసీపీకి ఎందుకు కలిసిరావడం లేదు?
- Off The Record: ఆ 24 మంది ఎవరు? తాడిపత్రిలో జేసీ సంచలన హెచ్చరిక
కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ రాజకీయాలు రోజుకోలా మారుతున్నాయి. మాజీ మంత్రి చల్మెడ ఆనందరావు తనయుడు లక్ష్మీ నరసింహారావు గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో కొత్త సమీకరణాలు.. సరికొత్త చర్చలు ఆసక్తి కలిగిస్తున్నాయి. చల్మెడ లక్ష్మీ నరసింహారావు 20ఏళ్లపాటు కాంగ్రెస్లో ఉన్నారు. 2009, 2014 ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2018లో ఎమ్మెల్సీగా పోటీ చేసినా ఓటమే పలకరించింది. కొంతకాలంగా చల్మెడ పార్టీ మారతారనే చర్చ జరిగింది. గత నెలలో సీఎం కేసీఆర్.. మాజీ మంత్రి ఆనందరావుతో మాట్లాడిన తర్వాత లక్ష్మీనరసింహారావు కారెక్కినట్టుగా టాక్. చేరిక వరకు బాగానే ఉన్నా.. చల్మెడకు గులాబీ బాస్ ఇచ్చిన హామీ ఏంటన్నది ప్రశ్న. ఈ అంశంపైనే రకరకాలుగా ప్రచారం జరుగుతోంది.
వేములవాడకు ఉపఎన్నిక వస్తే బరిలో ఉంటారా?
తండ్రి మంత్రిగా పనిచేసినా.. లక్ష్మీనారసింహారావుకు వారసత్వ రాజకీయాలు కలిసి రాలేదు. ఆర్థిక అంగబలం ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఓటమే. కరీంనగర్లో చల్మెడ కుటుంబం స్థిరపడినా.. వారి స్వస్థలం వేములవాడ నియోజకవర్గంలోని కొనకరావుపేట మండలం మల్కపేట. ప్రస్తుతం వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఒకవేళ తీర్పు ప్రతికూలంగా వచ్చి.. రమేష్పై అనర్హత వేటు పడితే.. వేములవాడలో జరిగే ఉపఎన్నికల్లో చల్మెడ టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారని ప్రచారంలో ఉంది. ఆయన మాత్రం వేములవాడలో పోటీ ఉండేందుకు టీఆర్ఎస్లో చేరలేదని వెల్లడించారు. దీంతో కొత్త ఈక్వేషన్స్ తెరపైకి వస్తున్నాయట.
కరీంనగర్ అసెంబ్లీపై గురిపెట్టారా?
కరీంనగర్ లోక్సభ లేదా కరీంనగర్ అసెంబ్లీపై చల్మెడ ఫోకస్ పెట్టినట్టు గులాబీ శిబిరంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్పైనే రెండుసార్లు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు చల్మెడ లక్ష్మీనరసింహారావు. ఇప్పుడు టీఆర్ఎస్లో చేరడం ద్వారా కరీంనగర్ అసెంబ్లీపై గురిపెట్టారా? లేక ఇంకెవరి ప్లేస్కైనా చల్మెడ ఎర్త్ పెట్టబోతున్నారు అనే ఆసక్తి పార్టీ వర్గాల్లో పెరుగుతోంది. మరి.. కరీంనగర్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాలి.
తాజావార్తలు
-
Nokia 100 (2026): నోకియా 100 విడుదలకు ముందే లీక్.. LED ఫ్లాష్లైట్, 1,020mAh బ్యాటరీతో కొత్త ఫీచర్ ఫోన్!
-
కేవలం 6.5 మిమీ మందం, 12.2 అంగుళాల 2.8K OLED డిస్ప్లే, Dimensity 8300 చిప్తో ASUS Pad (T3201) భారత్లో లాంచ్..!
-
IAM GAME Trailer : దుల్కర్ సల్మాన్ ‘IAM GAME’ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసిన యంగ్ టైగర్
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మ్యాక్స్ రిలీజ్ డేట్ ఫిక్స్.. 50MP సెల్ఫీ కెమెరా, 10,000mAh బ్యాటరీ!
-
KCR: ‘నమ్మకమైన ఉద్యమ సహచరుడిని కోల్పోయా’.. సుదర్శన్రెడ్డి మృతిపై కేసీఆర్ భావోద్వేగం!
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!