Andhra Pradesh: వాళ్లకు కూడా ఆ పథకం వర్తిస్తుంది.. జగన్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఏపీలోని జగన్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ముస్లిం దూదేకులు, మోహతార్ ముస్లింలకు కూడా వైఎస్ఆర్ షాదీ తోఫా పథకం వర్తిస్తుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. వైఎస్ఆర్ షాదీ తోఫా పథకానికి ముస్లిం దూదేకులు, మెహతార్ ముస్లింలు అర్హులేనని మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఎండీ ఇంతియాజ్ వెల్లడించారు. ఈ మేరకు అన్ని జిల్లాల మైనారిటీ, సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖల అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా అక్టోబర్ 1 నుంచి ఏపీ వ్యాప్తంగా పేదింటి మైనారిటీల వివాహం కోసం ఆర్ధికంగా సహాయం చేసేందుకు వైఎస్ఆర్ షాదీ తోఫా కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా ఈ పథకానికి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ పథకం కింద రూ.లక్ష ఆర్ధిక సహాయం అందిస్తారు. మైనారిటీల ఆడపిల్లల తల్లిదండ్రులకు ఈ పథకం ఎంతో భరోసా ఇస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read
- Land Pass Books: ఏపీ రైతులకు శుభవార్త.. రేపు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ..
- AP Govt: విద్యార్థులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డైట్ ఛార్జీలు 10 శాతం పెంపు..
- Promotions: కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఏపీకి చెందిన ఆ ఐదుగురికి IASలుగా పదోన్నతులు..
- TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఈ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Read Also: Wasim Akram: ఆ క్రికెటర్ మనిషి కాదు.. వేరే గ్రహం నుంచి వచ్చిన ఏలియన్
అటు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 లోగోను ఈరోజు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. వచ్చే ఏడాది మార్చి 3, 4 తేదీల్లో విశాఖ కేంద్రంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనుంది. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. కోవిడ్ పరిస్థితులను దాటుకుని తాము అడుగులు ముందుకు వేస్తున్నామని.. గత మూడేళ్లలో ఇన్వెస్టుమెంట్ సమ్మిట్లు నిర్వహించలేకపోయామని.. ఇప్పుడిప్పుడే ఇతర రాష్ట్రాలు సమ్మిట్లు నిర్వహించడం ప్రారంభించాయన్నారు. ఎంఎస్ఎంఈలపైనా తాము దృష్టి పెట్టామని.. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి మౌలిక వసతులు కల్పి్స్తున్నామని మంత్రి అమర్నాథ్ తెలిపారు. మచిలీపట్నం, భావనపాడు పోర్టులను నిర్మిస్తున్నామని.. విశాఖ, కాకినాడ పోర్టులను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Sourav Ganguly: ‘దాదా’కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన ఐసీసీ.. గంగూలీ భావోద్వేగ పోస్ట్..
-
Kotha Cinema: బొగ్గుబావి నుంచి టాలీవుడ్కి వంద మంది
-
Trump–Meloni: టర్కీలో ట్రంప్-మెలోనీ ఎడముఖం.. పెడముఖం.. వీడియో వైరల్
-
Land Pass Books: ఏపీ రైతులకు శుభవార్త.. రేపు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ..
-
Robots for Rent: అద్దెకు రోబోలు.. ప్రపంచాన్ని మార్చేస్తున్న కొత్త ట్రెండ్!
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..