Andhra Pradesh: వాళ్లకు కూడా ఆ పథకం వర్తిస్తుంది.. జగన్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఏపీలోని జగన్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ముస్లిం దూదేకులు, మోహతార్ ముస్లింలకు కూడా వైఎస్ఆర్ షాదీ తోఫా పథకం వర్తిస్తుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. వైఎస్ఆర్ షాదీ తోఫా పథకానికి ముస్లిం దూదేకులు, మెహతార్ ముస్లింలు అర్హులేనని మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఎండీ ఇంతియాజ్ వెల్లడించారు. ఈ మేరకు అన్ని జిల్లాల మైనారిటీ, సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖల అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా అక్టోబర్ 1 నుంచి ఏపీ వ్యాప్తంగా పేదింటి మైనారిటీల వివాహం కోసం ఆర్ధికంగా సహాయం చేసేందుకు వైఎస్ఆర్ షాదీ తోఫా కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా ఈ పథకానికి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ పథకం కింద రూ.లక్ష ఆర్ధిక సహాయం అందిస్తారు. మైనారిటీల ఆడపిల్లల తల్లిదండ్రులకు ఈ పథకం ఎంతో భరోసా ఇస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read
- IMD : నైరుతి రుతుపవనాలు వచ్చేసినట్టేనా..? వాతావరణ శాఖ కీలక అప్డేట్..!
- RK Roja: కూటమి ప్రభుత్వంపై రోజా ఫైర్..
- AP Environment Protection Task Force: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు..నదుల కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
- TDP Mahanaadu 2026: మహానాడు వేదికగా లోకేష్ కీలక ప్రకటన.. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకపోయినా వారికి పెద్దపీట.
Read Also: Wasim Akram: ఆ క్రికెటర్ మనిషి కాదు.. వేరే గ్రహం నుంచి వచ్చిన ఏలియన్
అటు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 లోగోను ఈరోజు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. వచ్చే ఏడాది మార్చి 3, 4 తేదీల్లో విశాఖ కేంద్రంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనుంది. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. కోవిడ్ పరిస్థితులను దాటుకుని తాము అడుగులు ముందుకు వేస్తున్నామని.. గత మూడేళ్లలో ఇన్వెస్టుమెంట్ సమ్మిట్లు నిర్వహించలేకపోయామని.. ఇప్పుడిప్పుడే ఇతర రాష్ట్రాలు సమ్మిట్లు నిర్వహించడం ప్రారంభించాయన్నారు. ఎంఎస్ఎంఈలపైనా తాము దృష్టి పెట్టామని.. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి మౌలిక వసతులు కల్పి్స్తున్నామని మంత్రి అమర్నాథ్ తెలిపారు. మచిలీపట్నం, భావనపాడు పోర్టులను నిర్మిస్తున్నామని.. విశాఖ, కాకినాడ పోర్టులను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
SRH vs RR : ప్లేఆఫ్స్లో రాజస్తాన్ రచ్చ.. ఎస్ఆర్హెచ్ ఔట్.!
-
OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
-
Sun Risers Hyderabad: పెవిలియన్కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. కుప్పకూలిన టాప్ ఆర్డర్స్..
-
CM Vijay: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో విజయ్ భేటీ.. తమిళనాడు అంశాలపై చర్చ
-
Ragi Ponganalu: మహిళలకు అమృతం లాంటిది.. ఐరన్, క్యాల్షియం కావాలంటే వారంలో రెండుసార్లు ఇవి తినండి!
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!