Vishakapatnam: విశాఖ భూముల అంశంపై వైసీపీ-టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishakapatnam: విశాఖ భూముల అంశంపై కొన్నిరోజులుగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రెండు రోజుల కిందట వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. తెలుగు దొంగల పార్టీ కబ్జాకోరులు, భూబకాసురులైన గంజాయి పాత్రుడు, పీలా గోవిందు, బండారు, గీతం భరత్, వెలగపూడి రాము ఆక్రమించిన భూముల్ని కక్కించి ప్రభుత్వానికి అప్పగిస్తుంటే అడ్డగోలు బాగోతాలు, వాదనలకు దిగారని.. ఈ ద్రోహుల నుంచి 5 వేల కోట్ల విలువైన భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
తెలుగు దొంగల పార్టీ కబ్జాకోరులు, భూబకాసురులైన గంజాయి పాత్రుడు, పీలా గోవిందు, బండారు, గీతం భరత్, వెలగపూడి రాము ఆక్రమించిన భూముల్ని కక్కించి ప్రభుత్వానికి అప్పగిస్తుంటే అడ్డగోలు బాగోతాలు, వాదనలకు దిగారు. ఈ ద్రోహుల నుంచి 5 వేల కోట్ల విలువైన భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
Also Read
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 6, 2022
Read Also: Dharmana Prasad Rao: రాజధానిగా ఉండే అర్హత విశాఖకు మాత్రమే ఉంది
తనపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఉత్తరాంధ్రలో టీడీపీ నాయకులు ఐదువేల కోట్ల రూపాయల భూ ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. ఐదువేల కోట్లు కాదు ఐదు కోట్ల రూపాయల భూములు తమ ఆక్రమణల్లో ఉన్నా రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉన్నాని వెలగపూడి రామకృష్ణబాబు సవాల్ చేశారు. విజయసాయిరెడ్డి తన ఆరోపణలను నిరూపిస్తే ఆ భూములను రాసి ఇచ్చేసేందుకు రెడీ అన్నారు. అందుకు సిద్ధం అయితే ఈస్ట్ పాయింట్ కాలనీ సాయిబాబా ఆలయం దగ్గర విజయసాయిరెడ్డి ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. సాయిబాబా గుడికి ఎప్పుడు వచ్చేది సాయిరెడ్డే చెప్పాలని హితవు పలికారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..