Vishakapatnam: విశాఖ భూముల అంశంపై వైసీపీ-టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం
Vishakapatnam: విశాఖ భూముల అంశంపై కొన్నిరోజులుగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రెండు రోజుల కిందట వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. తెలుగు దొంగల పార్టీ కబ్జాకోరులు, భూబకాసురులైన గంజాయి పాత్రుడు, పీలా గోవిందు, బండారు, గీతం భరత్, వెలగపూడి రాము ఆక్రమించిన భూముల్ని కక్కించి ప్రభుత్వానికి అప్పగిస్తుంటే అడ్డగోలు బాగోతాలు, వాదనలకు దిగారని.. ఈ ద్రోహుల నుంచి 5 వేల కోట్ల విలువైన భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
తెలుగు దొంగల పార్టీ కబ్జాకోరులు, భూబకాసురులైన గంజాయి పాత్రుడు, పీలా గోవిందు, బండారు, గీతం భరత్, వెలగపూడి రాము ఆక్రమించిన భూముల్ని కక్కించి ప్రభుత్వానికి అప్పగిస్తుంటే అడ్డగోలు బాగోతాలు, వాదనలకు దిగారు. ఈ ద్రోహుల నుంచి 5 వేల కోట్ల విలువైన భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 6, 2022
Read Also: Dharmana Prasad Rao: రాజధానిగా ఉండే అర్హత విశాఖకు మాత్రమే ఉంది
తనపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఉత్తరాంధ్రలో టీడీపీ నాయకులు ఐదువేల కోట్ల రూపాయల భూ ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. ఐదువేల కోట్లు కాదు ఐదు కోట్ల రూపాయల భూములు తమ ఆక్రమణల్లో ఉన్నా రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉన్నాని వెలగపూడి రామకృష్ణబాబు సవాల్ చేశారు. విజయసాయిరెడ్డి తన ఆరోపణలను నిరూపిస్తే ఆ భూములను రాసి ఇచ్చేసేందుకు రెడీ అన్నారు. అందుకు సిద్ధం అయితే ఈస్ట్ పాయింట్ కాలనీ సాయిబాబా ఆలయం దగ్గర విజయసాయిరెడ్డి ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. సాయిబాబా గుడికి ఎప్పుడు వచ్చేది సాయిరెడ్డే చెప్పాలని హితవు పలికారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
-
Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
-
Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
-
Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో