YCP MLA Roja: ఎనీటైమ్ మందు దొరికేలా చంద్రబాబు పాలన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ అసెంబ్లీలో జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై రగడ జరుగుతోంది. ఈ అంశంపై సభలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. టీడీపీ ప్రభుత్వం ఇంటింటికి నీళ్లు ఇచ్చిందో లేదో కానీ లిక్కర్ మాత్రం ఇచ్చిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో ఎద్దేవా చేశారు. ATM (ఎనీ టైమ్ మందు) అనేలా చంద్రబాబు పాలన సాగిందని ఆరోపించారు.
టీడీపీ హయాంలో ఆరు వేల స్కూళ్లను మూసేసి 40 వేల బెల్ట్ షాపులు తెరిచారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. గుడి, బడి అనే తేడా లేకుండా ప్రతి సందులో మద్యం దుకాణాలు తెరిచారని మండిపడ్డారు. మద్యం కమీషన్లు కోసం రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించారని.. ప్రభుత్వం నుంచి దిగిపోయే వరకు బార్లకు లైసెన్సులు ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని వ్యాఖ్యానించారు. మద్యం సిండికేట్లతో కుమ్మక్కై ఆడవారి పసుపు, కుంకుమతో చెలగాటమాడారని.. అందుకే ప్రతి మహిళ గుర్తు పెట్టుకుని టీడీపీ ప్రభుత్వాన్ని ఛీ కొట్టి తరిమికొట్టిందని ఆరోపించారు. కాగా సభలో ప్రశ్నోత్తరాలు జరగకుండా టీడీపీ అడ్డుకుంటోందని.. వాళ్లే ప్రశ్నలు వేస్తూ.. వాళ్లే సభను అడ్డుకుంటున్నారని మంత్రి బొత్స మండిపడ్డారు.
Also Read
- Annadata Sukhibhava: అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు
- AP Women's Commission Notice: గుడివాడ అమర్నాథ్కు మహిళా కమిషన్ షాక్.. విచారణకు రావాలంటూ నోటీసులు..
- Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
- Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
తాజావార్తలు
-
WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్లో చెల్లింపు సేవల ఆరంభం
-
KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
-
Thaman S: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తమన్.. ఆ పిల్లల స్కూల్ ఫీజులు కట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్!
-
IPL 2027: గంగూలీ మాస్టర్ ప్లాన్.. ఐపీఎల్ 2027లో ఆ జట్టుకు కోచ్గా యువరాజ్ సింగ్..
-
Supreme Court: ఫుట్పాత్పై నడవడం ప్రాథమిక హక్కు.. ప్రత్యేక చట్టం తేవాలని కేంద్రానికి సూచన
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?