YCP MLA Roja: ఎనీటైమ్ మందు దొరికేలా చంద్రబాబు పాలన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ అసెంబ్లీలో జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై రగడ జరుగుతోంది. ఈ అంశంపై సభలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. టీడీపీ ప్రభుత్వం ఇంటింటికి నీళ్లు ఇచ్చిందో లేదో కానీ లిక్కర్ మాత్రం ఇచ్చిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో ఎద్దేవా చేశారు. ATM (ఎనీ టైమ్ మందు) అనేలా చంద్రబాబు పాలన సాగిందని ఆరోపించారు.
టీడీపీ హయాంలో ఆరు వేల స్కూళ్లను మూసేసి 40 వేల బెల్ట్ షాపులు తెరిచారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. గుడి, బడి అనే తేడా లేకుండా ప్రతి సందులో మద్యం దుకాణాలు తెరిచారని మండిపడ్డారు. మద్యం కమీషన్లు కోసం రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించారని.. ప్రభుత్వం నుంచి దిగిపోయే వరకు బార్లకు లైసెన్సులు ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని వ్యాఖ్యానించారు. మద్యం సిండికేట్లతో కుమ్మక్కై ఆడవారి పసుపు, కుంకుమతో చెలగాటమాడారని.. అందుకే ప్రతి మహిళ గుర్తు పెట్టుకుని టీడీపీ ప్రభుత్వాన్ని ఛీ కొట్టి తరిమికొట్టిందని ఆరోపించారు. కాగా సభలో ప్రశ్నోత్తరాలు జరగకుండా టీడీపీ అడ్డుకుంటోందని.. వాళ్లే ప్రశ్నలు వేస్తూ.. వాళ్లే సభను అడ్డుకుంటున్నారని మంత్రి బొత్స మండిపడ్డారు.
Also Read
తాజావార్తలు
-
Pakistan: పాకిస్థాన్ డబుల్ గేమ్.. మధ్యవర్తిత్వం పేరుతో ట్రంప్ను ఇలా మోసం చేశారేంట్రా బాబు!
-
Ravi Teja : ‘ఇరుముడి’ తర్వాత రవితేజ డబుల్ ట్రీట్..
-
Shreyas Iyer: పొరపాట్లు చేశా, సరైన ప్లానింగ్ లేదు.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్!
-
NTRNEEL : నందమూరి ఫ్యాన్స్కు మిడ్ నైట్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్
-
Himanta Biswa Sarma: నేడు అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న హిమంత బిస్వా శర్మ
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?