Vizag Fleet Review 2026: విశాఖ తీరంలో నౌకాదళ విన్యాసాలు.. ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రత్యేక ఆకర్షణ.!
- ఫిబ్రవరి 18 నుంచి అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ
- ప్రధాన ఆకర్షణగా ఐఎన్ఎస్ విక్రాంత్
- పాల్గొననున్న 60కి పైగా దేశాల నౌకాదళాల
- రాష్ట్రపతి సమక్షంలో భారీ సముద్ర విన్యాసాలు
భారత నౌకాదళ చరిత్రలో మరో కీలక ఘట్టానికి విశాఖపట్నం వేదిక కాబోతోంది. ఫిబ్రవరి 18 నుండి ప్రారంభం కానున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (IFR) , ‘మిలాన్ 2026’ విన్యాసాలలో భారత స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ (INS Vikrant) ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ఉత్తర అరేబియా సముద్రంలో మొహరించి, శతృదేశం పాకిస్తాన్ నౌకాదళాన్ని డిఫెన్సివ్ మోడ్లోకి నెట్టడంలో ఈ యుద్ధనౌక కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఈ ఐఎఫ్ఆర్ కోసం అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతంలోకి విక్రాంత్ ప్రవేశించనుంది. ఈ శక్తివంతమైన నౌకను దగ్గర నుండి చూసేందుకు మిత్రదేశాల నౌకాదళాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
Budget 2026-27: కేంద్ర బడ్జెట్.. ధరలు తగ్గనున్న 17 రకాల క్యాన్సర్ మందుల ఇవే..
Also Read
- Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
- Off The Record : టీడీపీ నేతల డబ్బులతో జనసేన సభ్యత్వాలు..?
- Minister Dola Bala Veera Anjaneya Swamy: విజయసాయి రెడ్డికి మంత్రి డోలా కౌంటర్.. పగటి కలలు మానుకో..!
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
ఐఎన్ఎస్ విక్రాంత్ కేవలం ఒక యుద్ధనౌక మాత్రమే కాదు, అది భారత నౌకాదళ సత్తాకు నిదర్శనం. 262.5 మీటర్ల పొడవు, 61.6 మీటర్ల వెడల్పు కలిగిన ఈ నౌక సుమారు 45,000 టన్నుల బరువును మోయగలదు. ఇది గరిష్టంగా 28 నాట్ల వేగంతో ప్రయాణించడమే కాకుండా, సుమారు 1,600 మంది సిబ్బందికి వసతి కల్పిస్తుంది. దీనిపై మిగ్-29కె ఫైటర్ జెట్స్, కామోవ్ 31, , ఎంహెచ్ 60ఆర్ హెలికాప్టర్లతో సహా మొత్తం 30 విమానాలను ఉంచే అవకాశం ఉంది. ఈ నౌకకు 1971 ఇండో-పాక్ యుద్ధంలో వీరోచితంగా పోరాడిన మన మొదటి విమానవాహక నౌక ‘విక్రాంత్’ పేరునే పెట్టడం గమనార్హం.
ఈ అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో భాగంగా ఈస్ట్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో ‘మిలాన్’ (MILAN) బహుళ పక్ష నౌకాదళ వ్యాయామం కూడా జరగనుంది. ఈ వేడుకకు సుమారు 135 దేశాలకు ఆహ్వానం పంపగా, ఇప్పటికే 60కి పైగా స్నేహపూర్వక దేశాలు పాల్గొనడానికి అంగీకరించాయి. గతంలో 2001లో ముంబైలో, 2016లో విశాఖలో నిర్వహించిన ఐఎఫ్ఆర్ వేడుకల కంటే ఇది మరింత భారీ స్థాయిలో జరగబోతోంది. సముద్ర భద్రతలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు, ప్రపంచ దేశాల మధ్య వృత్తిపరమైన బంధాలను బలపరుచుకోవడమే ఈ విన్యాసాల ప్రధాన ఉద్దేశ్యం. భారత రాష్ట్రపతి గారు సుప్రీం కమాండర్ హోదాలో ఈ భారీ నౌకాదళ ప్రదర్శనను సమీక్షించనున్నారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!