MP Bharat: పెట్టుబడులు రావడం.. రాష్ట్రం అభివృద్ధి చెందడం వైసీపీకీ ఇష్టం లేదు..!
- పెట్టుబడులు సదస్సు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాం..
- 9.8 లక్షలు కోట్లు ఎంఓయూ చేసుకునే ఆవకాశం ఉంది..
- విశాఖలో ఐటి పెట్టబడులు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది..
- రాష్ట్రానికి పెట్టుబడులు రావడం.. అభివృద్ధి చెందడం వైసీపీకీ ఇష్టం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Bharat: ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు రావడం.. రాష్ట్రం అభివృద్ధి చెందడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని ఆరోపించారు విశాఖ ఎంపీ శ్రీభరత్.. విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సుపై ఆయన మాట్లాడుతూ.. విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.. పెట్టుబడుల సదస్సు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాము. సుమారు రూ.9.8 లక్షల కోట్లు విలువైన MoUs చేసుకునే అవకాశం ఉందన్నారు.. విశాఖలో ఐటీ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది అని పేర్కొన్నారు. ఇక, విశాఖ సుందరీకరణపై స్పందించిన ఎంపీ.. “అవి షో కోసం కాకుండా, ప్రతి పైసా విలువైన విధంగా ఖర్చు అవ్వాలని చూస్తున్నాము” అన్నారు.
Read Also: Ande Sri Death: హార్ట్ స్ట్రోక్తో అందెశ్రీ చనిపోయారు.. గాంధీ వైద్యుల డిక్లేర్
Also Read
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
- CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్న్యూస్
- GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
వైసీపీపై విమర్శలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు శ్రీభరత్.. “రాష్ట్రానికి పెట్టుబడులు రావడం వైసీపీకి ఇష్టం లేదన్న ఆయన.. పేదలను పేదగానే ఉంచడం వారి విధానం. అభివృద్ధి అంటే విరగ్గొట్టడమని, అడ్డుకోవడమని భావిస్తున్నారు” అని విమర్శించారు. పరిశ్రమలకు భూములు కావాలంటే అడ్డుకుంటారు.. మెడికల్ కళాశాలల పెట్టుబడులు వస్తున్న సమయంలో ఆందోళనలు చేస్తే ప్రభుత్వం కఠినంగా స్పందిస్తుందని వార్నింగ్ ఇచ్చారు. నిజంగా కళాశాలలపై ప్రేమ ఉంటే రుషికొండపై రూ.500 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు?” అని ప్రశ్నించారు. రాష్ట్రం ఆర్థికంగా చాల కష్ట్నాల్లో ఉంది.. అన్నింటిని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.. గతంలో ముఖ్యమంత్రి పర్యటనకు రూ.7 కోట్లు ఖర్చు అయితే.. ఇప్పుడు ముఖ్యమంత్రి పర్యటన ఖర్చు రూ.25 లక్షలు మాత్రమే అని స్పష్టం చేశారు.. రాష్ట్రం ఎంత తక్కువ ఖర్చులు చేస్తుంది అనేదానికి ఇదే నిదర్శణం అని అభివర్ణించారు.. వైసీపీలో “బండ బూతులు తిడితే నామినేటెడ్ పదవి.. మర్డర్ చేస్తే మంత్రి పదవి ఇస్తారు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్.. అన్నారు.
తాజావార్తలు
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!