Merugu Nagarjuna: జగన్ ప్రభుత్వంలో సామాజిక విప్లవం వచ్చింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Merugu Nagarjuna: విశాఖ జిల్లా ఉత్తర నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరుగుతుంది. అందులో భాగంగానే అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వంలో సామాజిక విప్లవం వచ్చిందని తెలిపారు. సామాజిక సాధికారత సాధించామన్నారు. కాగా.. బీసీ, ఎస్సీ, ఎస్టీలను అవమానించిన నాయకుడు చంద్రబాబు అని మంత్రి మేరుగ మండిపడ్డారు. పేదవాడు ఉన్నత శిఖరాలకు వెళ్ళడమే సామాజిక న్యాయమని మంత్రి పేర్కొన్నారు.
Read Also: Tammineni Sitaram: నాకు వ్యాధి, జబ్బు వచ్చిందని అసత్య ప్రచారం చేస్తున్నారు
Also Read
- President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
- Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. 'నా వ్యాఖ్యల్లో తప్పు లేదు'..!
- Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
- President Murmu AP Visit: విశాఖ పర్యటనకు రాష్ట్రపతి.. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవానికి ముర్ము..
చంద్రబాబు కోర్టులకు వెళ్ళి అభివృద్ధిని అడ్డుకున్నారని మేరుగ విమర్శలు చేశారు. చంద్రబాబు అంతు చూడాల్సిన సమయం వచ్చిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో పేదరికం తగ్గిందని తెలిపారు. చంద్రబాబు చంద్రగిరిలో పుట్టి.. కుప్పంలో పోటీ చేస్తున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో జగన్ బొమ్మతో గెలవబోతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. లోకేశ్ యువగళంలో సగం దూరం నచిడి పారిపోయాడని దుయ్యబట్టారు. నీ ఎర్రపుస్తకం మడిచి మీ బాబుకు ఇవ్వని విమర్శించారు. నారా భువనేశ్వరి రెండే రెండు చెక్కులు ఇచ్చిందని మంత్రి మేరుగ నాగార్జున కామెంట్స్ చేశారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: షర్మిల కాంగ్రెస్లో చేరిక వెనుక అతని కుట్ర ఉంది..
అనంతరం ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ.. బీసీ అయిన తనను ఉప ముఖ్యమంత్రిగా సీఎం జగన్ పక్కన కూర్చోబెట్టుకున్నారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు 3 వేలకు పెంచారన్నారు. అంతేకాకుండా.. వైఎస్సార్ చేయూత, ఆసరా ద్వారా మహిళలను ఆదుకుంటున్నారని అన్నారు.
రైతులు, మహిళలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా.. పిల్లలు కోసం ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టారని అన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా పేదలను ఆదుకుంటున్నారు.. పేదలకు 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారని బూడి ముత్యాల నాయుడు తెలిపారు.
తాజావార్తలు
-
Acer TravelLite TL24-54M: భారత్ లో ఏసర్ ట్రావెల్ లైట్ TL24-54M ల్యాప్టాప్ విడుదల.. DDR5 RAM సపోర్ట్, AI ఫీచర్లు
-
Tridha: బాబీ డియోల్తో బోల్డ్ సీన్లే బ్రేకప్కు కారణమా? మాజీ ప్రియుడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన త్రిధా!
-
Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ ‘మావిగన్ వర్సెస్ అమరావతి’.. వైఎస్ జగన్ సవాల్..
-
Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
-
Explainer: బంగారం మనది.. బిజినెస్ వాళ్లది.. ఆసియాలో గోల్డ్ హబ్గా సింగపూర్ ఎలా మారింది?
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..