Minister Kollu Ravindra: ఏపీకి ఎన్నో పరిశ్రమలు వస్తాయి.. విశాఖ స్టీల్ ప్లాంట్కు ఇబ్బంది లేదు..!
- ఈ ఐదు ఏళ్లలో అనేక పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తాయి..
- విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి అన్ని సమాకూరుతాయన్న మంత్రి కొల్లు రవీంద్ర..
- సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kollu Ravindra: ఈ ఐదు ఏళ్లలో అనేక పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తాయి.. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి అన్ని సమాకూరుతాయని తెలిపారు మంత్రి కొల్లు రవీంద్ర.. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న రాష్ట్ర గనులు, ఎక్కైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు స్వాగతం పలికారు ఆలయ ఈవో, అధికారులు.. కప్పస్తంభం ఆలింగనం, గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేసిన ఆయనకు వేదాశీర్వచనం చేశారు పండితులు.. ఇక, అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సింహాద్రి అప్పన్న ఎంతో మహిమన్వితం కలిగిన దేవుడు.. రాష్ట్ర ప్రజలంతా సుఖషాంతులతో ఉండాలని కోరుకోవడం జరిగిందన్నారు.. గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో చూశాము.. ప్రజల కోరిక మేరకు సంక్షేమ పథకాలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముందుకొచ్చారని తెలిపారు.. రాష్ట్రంలో ఐదు సంవత్సరాలలో అన్ని వర్గాలు ఇబ్బంది పడ్డారు.. పరిశ్రమలు రాకుండా అడ్డుకున్నారు.. ఉన్న పరిశ్రమల్ని మూసేశారని విమర్శించారు.
Read Also: Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్కు మళ్లీ నోటీసులు..
Also Read
- Vizag : విశాఖ నగరం మీద కాలుష్య మేఘం
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- South Coast Railway Zone: విశాఖ రైల్వే జోన్పై కేంద్రం సర్ప్రైజ్ గెజిట్..
- Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పెద్ద సంస్థలు వస్తున్నాయని తెలిపారు మంత్రి కొల్లు రవీంద్ర.. ఇక, విశాఖ పట్నంలో కొండాలని, ఘనులను, భూములను దోచుకున్నారు.. ఋషికొండలో ప్రజల సొమ్ముతో ప్యాలస్ లు కట్టుకున్నారని ఫైర్ అయ్యారు.. ఈ రోజు మాట ప్రకారం పెన్షన్లను 1వ తేదీన అందిస్తున్నాం అన్నారు.. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం… ఈ ఐదు సంవత్సరాలలో అనేక పరిశ్రమలు వస్తాయన్నారు.. గతంలో వెనక్కి వెళ్లిన పరిశ్రమలు సైతం రాష్ట్రానికి రాబోతున్నాయని వెల్లడించారు మంత్రి కొల్లు రవీంద్ర.
తాజావార్తలు
-
Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
-
Hombale Films : ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి హోంబలే ఫిల్మ్స్
-
Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
-
Virat Kohli Record: రోహిత్ శర్మ రికార్డు సమం చేసిన ‘కింగ్’ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలో టాప్లో ఇద్దరు దిగ్గజాలు!
-
Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!