Simhachalam Tragedy: రూ.కోటి సాయంపై మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు
- విశాఖ కేజీహెచ్లో బాధిత కుటుంబాలకు హోంమంత్రి పరామర్శ
- బాధితులకు అండగా ఉంటామని అనిత హామీ
సింహాచలం అప్పన్న సన్నిధిలో గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పలు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఇక కేజీహెచ్ ఆస్పత్రిలో బాధిత కుటుంబాలను హోంమంత్రి అనిత పరామర్శించారు. ఈ సందర్భంగా రూ.కోటి పరిహారం ప్రకటించాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి.
ఇది కూడా చదవండి: Simhachalam Tragedy: గోడ కూలడానికి ప్రధాన కారణం ఇదేనా?
Also Read
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
- Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
- Botsa Satyanarayana: వైఎస్ జగన్ తెచ్చిన ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థాపన.. బొత్స ఫైర్..
ఈ సందర్భంగా అనిత మీడియాతో మాట్లాడారు. బాధిత కుటుంబాలు రూ.కోటి నష్టపరిహారం అడుగుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా జిల్లాల్లోని ఎమ్మెల్యేలమంతా బాధ్యత తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పిందని తెలిపారు. అంతేకాకుండా పిల్లల్ని ప్రభుత్వపరంగా చదవిస్తామని హామీ ఇచ్చారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బాధిత కుటుంబాలకు అప్పగిస్తామని తెలిపారు. గోడ కూలిన ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసిందని.. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని అనిత హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: CPI Narayana: హైదరాబాద్లో అందాల పోటీతో స్త్రీ జన్మను అపవిత్రం చేయొద్దు
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!