Simhachalam Tragedy: గోడ కూలడానికి ప్రధాన కారణం ఇదేనా?
- సింహాచలం ప్రమాదంపై దర్యాప్తు కమిటీ ఏర్పాటు
- 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం
- ఏడుగురు భక్తులు మృతి.. నలుగురికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సింహాచలం అప్పన్న సన్నిధిలో గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు భక్తులు ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఇక సంఘటనాస్థలిని మంత్రులు, అధికారులు, వైసీపీ నేతలు పరిశీలించారు. అయితే ఈ ప్రమాదంపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 10 రోజుల క్రితమే నిర్మించిన గోడ ఎలా కూలిపోయిందంటూ నిలదీస్తున్నారు.
ఇక ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ సమక్షంలో కమిటీ దర్యాప్తు చేయనుంది. కమిటీలో రెవెన్యూ, ఇంజనీరింగ్ నిపుణులు ఉన్నారు. ఇప్పటికే అధికారులు ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. గోడ నిర్మాణంలో లోపాలు ఉన్నట్లుగా గుర్తించారు. బాధ్యులు ఎవరైనా చర్యలు ఉంటాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. గోడలను పరిశీలించి.. నాణ్యతా లోపాలు ఉన్నట్లుగా గుర్తించారు.
Also Read
- Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
- Floodlight Collapse: విశాఖ స్టేడియంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కూలిన ఫ్లడ్ లైట్..
- Godavari Floods: గోదావరి వరదలపై ప్రభుత్వం అలర్ట్.. ప్రభావిత జిల్లాలకు హోంమంత్రి కీలక ఆదేశాలు
- Botsa Satyanarayana: జగన్ పర్యటనను విజయవంతం చేశాం.. కూటమి ప్రభుత్వంపై బొత్స తీవ్ర ఆరోపణలు
ఇది కూడా చదవండి: Simhachalam Tragedy: పెళ్లై మూడేళ్లైంది.. ప్రమాదంలో సాఫ్ట్వేర్ దంపతుల మృతి
గోడ నిర్మాణం చేపట్టినప్పుడే సరైన ప్రమాణాలు పాటించలేదని తెలుస్తోంది. గోడ కూలిపోయినప్పుడు ఇటుకలు వేర్వేరుగా పడిపోయి ఉన్నాయి. అందులో సిమెంట్ లేనట్టుగా కనిపిస్తోంది. స్ట్రాంగ్గా గోడ నిర్మాణం జరగలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వర్షానికి గోడ కూలిపోయిందని అధికారులు అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఇక కూలిపోయిన గోడకు-క్యూలైన్కు దాదాపు మూడు అడుగుల గ్యాప్ ఉంది. వర్షానికి మట్టిపెళ్లలు గోడ మీద పడగానే ఒక్కసారిగా గోడ కూలిపోయింది. దీని బట్టి చూస్తే.. కచ్చితంగా నిర్మాణ లోపమే కారణంగా అధికారులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Simhachalam Tragedy: విశాఖ వెళ్లనున్న వైఎస్.జగన్.. బాధిత కుటుంబాలకు పరామర్శ
మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. అలాగే ఇద్దరు సాప్ట్వేర్ దంపతులు, ఇద్దరు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. ఇక మృతుల కుటుంబాలకు ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, మాజీ సీఎం జగన్ సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.25లక్షలు, కేంద్రం రూ.2లక్షలు సాయం ప్రకటించింది. క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3లక్షల సాయం ప్రకటించింది. రూ.కోటి సాయం ప్రకటించాలని మృతుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Mohsen Rezaee: ఇరాన్ టాప్ సెక్యూరిటీ బాడీకి మాజీ IRGC చీఫ్.. మొహ్సెన్ రెజాయీ నియామకం ఎందుకంత కీలకం?
-
Main Wapas Aaunga OTT: ఓటీటీలో నంబర్ వన్గా దూసుకెళ్తున్న పాకిస్తానీ లవ్ స్టోరీ.. ఐయండిబిలో 8.2 రేటింగ్
-
AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
-
SpiderMan Brand New Day : అవతార్-2 రికార్డు బద్దలు.. ఇండియా నం:1 గ్రాసర్గా ‘బ్రాండ్ న్యూ డే’
-
Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!