Simhachalam Tragedy: గోడ కూలడానికి ప్రధాన కారణం ఇదేనా?
- సింహాచలం ప్రమాదంపై దర్యాప్తు కమిటీ ఏర్పాటు
- 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం
- ఏడుగురు భక్తులు మృతి.. నలుగురికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సింహాచలం అప్పన్న సన్నిధిలో గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు భక్తులు ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఇక సంఘటనాస్థలిని మంత్రులు, అధికారులు, వైసీపీ నేతలు పరిశీలించారు. అయితే ఈ ప్రమాదంపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 10 రోజుల క్రితమే నిర్మించిన గోడ ఎలా కూలిపోయిందంటూ నిలదీస్తున్నారు.
ఇక ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ సమక్షంలో కమిటీ దర్యాప్తు చేయనుంది. కమిటీలో రెవెన్యూ, ఇంజనీరింగ్ నిపుణులు ఉన్నారు. ఇప్పటికే అధికారులు ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. గోడ నిర్మాణంలో లోపాలు ఉన్నట్లుగా గుర్తించారు. బాధ్యులు ఎవరైనా చర్యలు ఉంటాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. గోడలను పరిశీలించి.. నాణ్యతా లోపాలు ఉన్నట్లుగా గుర్తించారు.
Also Read
- Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
ఇది కూడా చదవండి: Simhachalam Tragedy: పెళ్లై మూడేళ్లైంది.. ప్రమాదంలో సాఫ్ట్వేర్ దంపతుల మృతి
గోడ నిర్మాణం చేపట్టినప్పుడే సరైన ప్రమాణాలు పాటించలేదని తెలుస్తోంది. గోడ కూలిపోయినప్పుడు ఇటుకలు వేర్వేరుగా పడిపోయి ఉన్నాయి. అందులో సిమెంట్ లేనట్టుగా కనిపిస్తోంది. స్ట్రాంగ్గా గోడ నిర్మాణం జరగలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వర్షానికి గోడ కూలిపోయిందని అధికారులు అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఇక కూలిపోయిన గోడకు-క్యూలైన్కు దాదాపు మూడు అడుగుల గ్యాప్ ఉంది. వర్షానికి మట్టిపెళ్లలు గోడ మీద పడగానే ఒక్కసారిగా గోడ కూలిపోయింది. దీని బట్టి చూస్తే.. కచ్చితంగా నిర్మాణ లోపమే కారణంగా అధికారులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Simhachalam Tragedy: విశాఖ వెళ్లనున్న వైఎస్.జగన్.. బాధిత కుటుంబాలకు పరామర్శ
మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. అలాగే ఇద్దరు సాప్ట్వేర్ దంపతులు, ఇద్దరు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. ఇక మృతుల కుటుంబాలకు ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, మాజీ సీఎం జగన్ సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.25లక్షలు, కేంద్రం రూ.2లక్షలు సాయం ప్రకటించింది. క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3లక్షల సాయం ప్రకటించింది. రూ.కోటి సాయం ప్రకటించాలని మృతుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
-
Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!