Simhachalam Tragedy: విశాఖ వెళ్లనున్న వైఎస్.జగన్.. బాధిత కుటుంబాలకు పరామర్శ
- విశాఖ వెళ్లనున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్
- కేజీహెచ్లో సింహాచలం బాధితులకు పరామర్శ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మధ్యాహ్నం 3:30 గంటలకు విశాఖ వెళ్లనున్నారు. కేజీహెచ్ ఆస్పత్రిలో సింహాచలంలో గోడ కూలిన ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలను, కోలుకుంటున్న క్షతగాత్రులను పరామర్శించనున్నారు.
ఇప్పటికే ఈ ఘటనపై జగన్ స్పందించారు. విశాఖ జిల్లా సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో భక్తుల మృతిపై జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా రూ.300 టికెట్ క్యూలైన్పై గోడ కూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. స్వామి వారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం అన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మరణించిన భక్తుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read
ఇది కూడా చదవండి: Simhachalam Tragedy: పెళ్లై మూడేళ్లైంది.. ప్రమాదంలో సాఫ్ట్వేర్ దంపతుల మృతి
సింహాచలం ఘటనలో ఏడుగురు భక్తులు మృతిచెందారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.25లక్షలు, కేంద్రం రూ.2లక్షలు సాయం ప్రకటించింది. క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3లక్షల సాయం ప్రకటించింది. రూ.కోటి సాయం ప్రకటించాలని మృతుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Simhachalam Tragedy: ప్రమాదంలో ఇంటీరియర్ డిజైనర్ సహా స్నేహితుడు మృతి
తాజావార్తలు
-
KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు: టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
-
iQOO 15T: ఐకూ 15T విడుదల.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్
-
RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
-
TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
-
ACB Raids : సస్పెండ్ అయినా తగ్గని లగ్జరీ.. సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో తనిఖీల్లో బయటపడ్డ కోట్లు..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!