Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయనగరంలో సీనియర్ వైఎస్సార్సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వంపై విమర్శల దాడి చేశారు. రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహణలో తీవ్ర అవకతవకలు జరిగాయని, దీనిపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత మంత్రిని పదవి నుంచి పక్కన పెట్టాలని స్పష్టం చేశారు. యువత, నిరుద్యోగులు తమ సమస్యలపై గత డెబ్బై రోజులకు పైగా పోరాటం చేస్తున్నారని, వారు ర్యాలీలు చేయడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు. వెనక్కి వెళ్తామన్నా ఒప్పుకోకుండా, కనీసం శాంతియుత ర్యాలీలకు కూడా అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలకు, చేతలకు పొంతన ఉండటం లేదని విమర్శించారు. వచ్చే ఆదాయంలో సగం డబ్బులు ఉద్యోగుల జీతాలకే సరిపోతున్నాయని చెబుతున్న చంద్రబాబు, ఎన్నికల ముందు చెప్పిన సంపద సృష్టి ఏమైందో సమాధానం చెప్పాలన్నారు. ఒకవైపు సంపద సృష్టిస్తామని చెప్పి, మరోవైపు రాష్ట్రాన్ని తీవ్ర అప్పుల పాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసలు ఏ రంగంలో అభివృద్ధి సాధించారో చంద్రబాబు స్పష్టత ఇవ్వాలని సవాల్ విసిరారు.
Also Read
- Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
- AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
- Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
- IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
వైద్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని, పేదలకు వరమైన ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పొడిచారని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని పట్టించుకోకుండా కేవలం అమరావతి జపం మాత్రమే చేస్తున్నారన్నారు. మరోవైపు రైతులకు ఏ పంటకూ కనీస మద్దతు ధర లభించడం లేదని వాపోయారు. ఈ ప్రభుత్వం కేవలం వ్యక్తిగత స్వార్థపూరిత ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని, ఇలాంటి ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఆడపిల్లలు బయటకు రావాలంటేనే తీవ్ర భయాందోళనలకు గురయ్యే పరిస్థితి నెలకొందని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
LPG Cylinder: వంటింట్లో గ్యాస్ మంటలు.. సిలిండర్ రేటు ఎంత పెరిగిందంటే?
-
Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
-
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!