Simhachalam Tragedy: ప్రమాదంలో ఇంటీరియర్ డిజైనర్ సహా స్నేహితుడు మృతి
- ప్రమాదంలో ఇంటీరియర్ డిజైనర్ సహా స్నేహితుడు మృతి
- అంబేద్కర్ కోనసీమ జిల్లా కొర్లపాటివారిపాలెంలో విషాదఛాయలు
విశాఖ సింహాచలం అప్పన్న సన్నిధిలో జరిగిన ప్రమాదంలో ఇంటీరియర్ డిజైనర్ పతి దుర్గ స్వామి నాయుడు (32) సహా అతని స్నేహితుడు కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు (29) ప్రాణాలు కోల్పోయారు. దీంతో విశాఖ కేజీహెచ్ దగ్గర బంధువుల రోదనలు మిన్నంటాయి. గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. ఎంత మంది ఓదార్చినా.. ఎవరి తరం కావడం లేదు. అంతగా కన్నీటి పర్యంతం అవుతున్నారు. చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయారంటూ బంధువులు రోదిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Simhachalam Tragedy: పెళ్లై మూడేళ్లైంది.. ప్రమాదంలో సాఫ్ట్వేర్ దంపతుల మృతి
Also Read
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
- Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
- Botsa Satyanarayana: వైఎస్ జగన్ తెచ్చిన ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థాపన.. బొత్స ఫైర్..
పతి దుర్గ స్వామి నాయుడు గత మూడేళ్లుగా విశాఖలోని సీతమ్మదారలో నివాసం ఉంటున్నాడు. మృతుడు స్వగ్రామం డాక్టర్ బీఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా కొర్లపాటివారిపాలెం వాసి. ప్రస్తుతం సీతమ్మదారలో ఇంటీరియర్ డిజైన్ షాపు ఉంది. కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు , పత్తి దుర్గా స్వామినాయుడు స్నేహితులు. ఇద్దరూ కలిసి మంగళవారం సింహాచలం సింహాద్రి అప్పన్న చందనోత్సవం కార్యక్రమానికి హాజరయ్యారు. అర్ధరాత్రి కురిసిన వర్షానికి గోడ కూలి ఇద్దరూ కూడా ప్రాణాలు వదిలారు. దీంతో కొర్లపాటివారిపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇక మృతుల కుటంబాలు కేజీహెచ్ దగ్గర ఆందోళన చేపట్టారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తు్న్నారు. లేదంటే పోస్ట్మార్టాన్ని అడ్డుకుంటామని ఆందోళన చేపట్టారు.
ఇది కూడా చదవండి: Mouni Roy : అర్ధరాత్రి నా రూమ్ లోకి రావాలని చూశాడు.. ప్రముఖ నటి కామెంట్స్
మృతులు వివరాలు ఇవే:
1. పత్తి దుర్గా స్వామి నాయుడు (29),
మాచవరం, అంబాజీపేట, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా
2. కుమ్మపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు (28).
మాచవరం, అంబాజీపేట, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా
3. ఎడ్ల వెంకటరావు (60)
అడవివరం, విశాఖ
4 . పిల్లా మహేశ్ (30),
చంద్రమపాలెం, మధురవాడ. విశాఖ
5. పిల్లా శైలజ (29)
చంద్రమపాలెం, మధురవాడ. విశాఖ
6. పైలా వెంకట రత్నం
ఇసుక తోట, విశాఖ
7. గుజ్జార మహాలక్ష్మి (65)
ఇసుక తోట, విశాఖ.
గాయపడిన వారి వివరాలు:
పైలా ప్రవీణ్ కుమార్
బాలాజీ నగర్,ఆరిలోవ, విశాఖ
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!