Simhachalam Tragedy: ప్రమాదంలో ఇంటీరియర్ డిజైనర్ సహా స్నేహితుడు మృతి
- ప్రమాదంలో ఇంటీరియర్ డిజైనర్ సహా స్నేహితుడు మృతి
- అంబేద్కర్ కోనసీమ జిల్లా కొర్లపాటివారిపాలెంలో విషాదఛాయలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ సింహాచలం అప్పన్న సన్నిధిలో జరిగిన ప్రమాదంలో ఇంటీరియర్ డిజైనర్ పతి దుర్గ స్వామి నాయుడు (32) సహా అతని స్నేహితుడు కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు (29) ప్రాణాలు కోల్పోయారు. దీంతో విశాఖ కేజీహెచ్ దగ్గర బంధువుల రోదనలు మిన్నంటాయి. గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. ఎంత మంది ఓదార్చినా.. ఎవరి తరం కావడం లేదు. అంతగా కన్నీటి పర్యంతం అవుతున్నారు. చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయారంటూ బంధువులు రోదిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Simhachalam Tragedy: పెళ్లై మూడేళ్లైంది.. ప్రమాదంలో సాఫ్ట్వేర్ దంపతుల మృతి
Also Read
- Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
- Floodlight Collapse: విశాఖ స్టేడియంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కూలిన ఫ్లడ్ లైట్..
- Godavari Floods: గోదావరి వరదలపై ప్రభుత్వం అలర్ట్.. ప్రభావిత జిల్లాలకు హోంమంత్రి కీలక ఆదేశాలు
- Botsa Satyanarayana: జగన్ పర్యటనను విజయవంతం చేశాం.. కూటమి ప్రభుత్వంపై బొత్స తీవ్ర ఆరోపణలు
పతి దుర్గ స్వామి నాయుడు గత మూడేళ్లుగా విశాఖలోని సీతమ్మదారలో నివాసం ఉంటున్నాడు. మృతుడు స్వగ్రామం డాక్టర్ బీఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా కొర్లపాటివారిపాలెం వాసి. ప్రస్తుతం సీతమ్మదారలో ఇంటీరియర్ డిజైన్ షాపు ఉంది. కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు , పత్తి దుర్గా స్వామినాయుడు స్నేహితులు. ఇద్దరూ కలిసి మంగళవారం సింహాచలం సింహాద్రి అప్పన్న చందనోత్సవం కార్యక్రమానికి హాజరయ్యారు. అర్ధరాత్రి కురిసిన వర్షానికి గోడ కూలి ఇద్దరూ కూడా ప్రాణాలు వదిలారు. దీంతో కొర్లపాటివారిపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇక మృతుల కుటంబాలు కేజీహెచ్ దగ్గర ఆందోళన చేపట్టారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తు్న్నారు. లేదంటే పోస్ట్మార్టాన్ని అడ్డుకుంటామని ఆందోళన చేపట్టారు.
ఇది కూడా చదవండి: Mouni Roy : అర్ధరాత్రి నా రూమ్ లోకి రావాలని చూశాడు.. ప్రముఖ నటి కామెంట్స్
మృతులు వివరాలు ఇవే:
1. పత్తి దుర్గా స్వామి నాయుడు (29),
మాచవరం, అంబాజీపేట, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా
2. కుమ్మపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు (28).
మాచవరం, అంబాజీపేట, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా
3. ఎడ్ల వెంకటరావు (60)
అడవివరం, విశాఖ
4 . పిల్లా మహేశ్ (30),
చంద్రమపాలెం, మధురవాడ. విశాఖ
5. పిల్లా శైలజ (29)
చంద్రమపాలెం, మధురవాడ. విశాఖ
6. పైలా వెంకట రత్నం
ఇసుక తోట, విశాఖ
7. గుజ్జార మహాలక్ష్మి (65)
ఇసుక తోట, విశాఖ.
గాయపడిన వారి వివరాలు:
పైలా ప్రవీణ్ కుమార్
బాలాజీ నగర్,ఆరిలోవ, విశాఖ
తాజావార్తలు
-
Bhatti Vikramarka : తెలంగాణకు బ్యాటరీ బూస్ట్.. క్వాంటమ్స్కేప్కు భట్టి ఆహ్వానం..!
-
CRS Portal : హైదరాబాద్లో గుడ్న్యూస్.. ఇక ఇంటి నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
-
JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!