Simhachalam Tragedy: ప్రమాదంలో ఇంటీరియర్ డిజైనర్ సహా స్నేహితుడు మృతి
- ప్రమాదంలో ఇంటీరియర్ డిజైనర్ సహా స్నేహితుడు మృతి
- అంబేద్కర్ కోనసీమ జిల్లా కొర్లపాటివారిపాలెంలో విషాదఛాయలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ సింహాచలం అప్పన్న సన్నిధిలో జరిగిన ప్రమాదంలో ఇంటీరియర్ డిజైనర్ పతి దుర్గ స్వామి నాయుడు (32) సహా అతని స్నేహితుడు కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు (29) ప్రాణాలు కోల్పోయారు. దీంతో విశాఖ కేజీహెచ్ దగ్గర బంధువుల రోదనలు మిన్నంటాయి. గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. ఎంత మంది ఓదార్చినా.. ఎవరి తరం కావడం లేదు. అంతగా కన్నీటి పర్యంతం అవుతున్నారు. చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయారంటూ బంధువులు రోదిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Simhachalam Tragedy: పెళ్లై మూడేళ్లైంది.. ప్రమాదంలో సాఫ్ట్వేర్ దంపతుల మృతి
Also Read
- CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
- TV Serial Scam: హీరోయిన్ ఛాన్స్ పేరుతో సైబర్ మోసం.. విశాఖలో రూ.60 లక్షల దోపిడీ!
- TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..
- Vizag Adventure Sports : వైజాగ్ టూరిజంలో సరికొత్త థ్రిల్.. అదరగొడుతున్న సాహస క్రీడలు.!
పతి దుర్గ స్వామి నాయుడు గత మూడేళ్లుగా విశాఖలోని సీతమ్మదారలో నివాసం ఉంటున్నాడు. మృతుడు స్వగ్రామం డాక్టర్ బీఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా కొర్లపాటివారిపాలెం వాసి. ప్రస్తుతం సీతమ్మదారలో ఇంటీరియర్ డిజైన్ షాపు ఉంది. కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు , పత్తి దుర్గా స్వామినాయుడు స్నేహితులు. ఇద్దరూ కలిసి మంగళవారం సింహాచలం సింహాద్రి అప్పన్న చందనోత్సవం కార్యక్రమానికి హాజరయ్యారు. అర్ధరాత్రి కురిసిన వర్షానికి గోడ కూలి ఇద్దరూ కూడా ప్రాణాలు వదిలారు. దీంతో కొర్లపాటివారిపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇక మృతుల కుటంబాలు కేజీహెచ్ దగ్గర ఆందోళన చేపట్టారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తు్న్నారు. లేదంటే పోస్ట్మార్టాన్ని అడ్డుకుంటామని ఆందోళన చేపట్టారు.
ఇది కూడా చదవండి: Mouni Roy : అర్ధరాత్రి నా రూమ్ లోకి రావాలని చూశాడు.. ప్రముఖ నటి కామెంట్స్
మృతులు వివరాలు ఇవే:
1. పత్తి దుర్గా స్వామి నాయుడు (29),
మాచవరం, అంబాజీపేట, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా
2. కుమ్మపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు (28).
మాచవరం, అంబాజీపేట, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా
3. ఎడ్ల వెంకటరావు (60)
అడవివరం, విశాఖ
4 . పిల్లా మహేశ్ (30),
చంద్రమపాలెం, మధురవాడ. విశాఖ
5. పిల్లా శైలజ (29)
చంద్రమపాలెం, మధురవాడ. విశాఖ
6. పైలా వెంకట రత్నం
ఇసుక తోట, విశాఖ
7. గుజ్జార మహాలక్ష్మి (65)
ఇసుక తోట, విశాఖ.
గాయపడిన వారి వివరాలు:
పైలా ప్రవీణ్ కుమార్
బాలాజీ నగర్,ఆరిలోవ, విశాఖ
తాజావార్తలు
-
Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
-
Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
-
Peddi Controversy : హీరోయిన్లను బ్లేమ్ చేయకండి… చేసేదంతా దర్శకులే… ‘పెద్ది’ వివాదంపై నాగ్ హీరోయిన్ రియాక్షన్
-
NTRNEEL : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్.. ఈసారి లంకని తగలబెట్టబోతున్న నీల్
-
Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!