Vallabhaneni Vamsi: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టులో ఊరట దక్కింది.. వల్లభనేని వంశీ మోహన్కి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.. మల్లవల్లి భూముల్లో తమకు రావాల్సిన పరిహారం వల్లభనేని వంశీ తనకు అనుకూలంగా ఉన్న వారికి ఇప్పించారని వంశీపై కేసు నమోదు చేశారు హనుమాన్ జంక్షన్ పోలీసులు.. అయితే, ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశారు వల్లభనేని వంశీ.. ఇక, దీనిపై విచారణ జరిపి ముందస్తు బెయిల్ ఇచ్చింది నూజివీడు కోర్టు..
Read Also: CM Revanth Reddy: హైదరాబాద్ లో భారీ వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..
అయితే, వల్లభనేని వంశీకి ముందస్తు బెయిల్ వచ్చినా.. ఆయన జైలులోనే గడపాల్సిన పరిస్థితి.. మరికొన్ని కేసుల్లో వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు.. ఇక, వంశీ బెయిల్ పిటిషన్ పై రేపు తీర్పు ఇవ్వనుంది విజయవాడలోని జిల్లా కోర్టు.. ఆత్కూరులో 8 ఎకరాలు కబ్జా చేశారని వంశీపై కేసు నమోదు చేశారు పోలీసులు.. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలన్న వంశీ పిటిషన్ పై విచారణ పూర్తి కాగా.. రేపు తీర్పు ఇవ్వనుంది జిల్లా కోర్టు.. మరోవైపు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ1గా ఉన్న వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు రంగా రెండో రోజు కస్టడీ పూర్తి అయ్యింది.. ఉదయం నుంచి సాయంత్రం వరకు రంగాను విచారించారు సీఐడీ అధికారులు.. దాడి వెనుక ఉన్న వారి పాత్రపై సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలకి తనకు గుర్తు లేదని తెలియదనే రంగా సమాధానాలు ఇచ్చినట్టు సమాచారం.. ఇక, రేపటితో రంగా కస్టడీ ముగిసిపోనుంది.