Minister Satyakumar Yadav: వైద్యం వ్యాపారంగా మారింది.. రోగులను డాక్టర్లు మానవతా దృష్టితో చూడండి..
- ఏపీఎంసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం..
- పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్..
- వైద్యులకు కీలక సూచనలు చేసిన ఆరోగ్యశాఖ మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Satyakumar Yadav: గతంలో పోలిస్తే.. ఇప్పుడు వైద్యం వ్యాపారంగా మారింది అని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్.. విజయవాడలో జరిగిన ఏపీ మెడికల్ కౌన్సిల్ లో నామినేటెడ్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఆరుగురు సభ్యులను నామినేటెడ్ పోస్టుల్లో ఎన్నుకున్నాం.. వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను… మంచి అనుభవం కలిగిన డాక్టర్లను ప్రభుత్వం ఎన్నుకుందన్నారు.. తరతరాలుగా వైద్యుల్ని దేవుడు పోల్చేవారు.. ఇదివరకు పోలిస్తే ఇప్పుడు వైద్యం వ్యాపారంగా మారిందన్న ఆయన.. డాక్టర్లు రోగులను మానవత దృష్టితో చూడాలని సూచించారు.. వైద్యవృత్తి విలువలు పల్చబడ్డాయి.. అవసరం లేకుండానే ఎక్సరేలు, సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్ లు తీస్తున్నారు.. అలాగే నార్మల్ డెలివరీ చేయడం మానేశారు.. అవసరం లేకపోయినా ఆపరేషన్ చేస్తున్నారు.. ప్రభుత్వ డాక్టర్లు గానీ.. ప్రైవేట్ డాక్టర్లు గానీ నార్మల్ డెలివరీస్ చేస్తే బాగుంటుందన్నారు..
Read Also: AP Weather Update: అలర్ట్.. ఈ జిల్లాల్లో 3 రోజులు పిడుగుల వర్షం.. ఆ జిల్లాల్లో తీవ్ర ఎండలు..!
Also Read
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. సీఎం భరోసాతో సంతృప్తి వ్యక్తం చేసిన తల్లి
- YS Jagan: సాయికృష్ణ కుటుంబాన్ని ఓదార్చిన జగన్.. కృష్ణలంక ఘటనలపై సీరియస్.. సీబీఐ విచారణకు డిమాండ్..
- Vijayawada: రౌడీషీటర్ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన సెల్ఫీ వీడియో
- Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
ప్రజలు కూడా రకరకాల టెస్టులు రాస్తేనే మాకు సరిగ్గా డాక్టర్లు చూశారని అపోహలో ఉన్నారని వ్యాఖ్యానించారు మంత్రి సత్యకుమార్.. అటువంటి వారికి అవగాహన కల్పించాలి.. వచ్చిన పేషెంట్ ను చిరునవ్వుతో డాక్టర్లు స్వాగతం పలకాలని సూచించారు.. డాక్టర్లు సర్టిఫికెట్లను ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి.. కొత్త కౌన్సిల్, ఏపీఎంసీ సర్టిఫికెట్స్ రెన్యువల్ మీద ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు.. ఫారెన్ రిటర్న్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎక్కువగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం లేదు.. నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.. ఏపీ మెడికల్ కౌన్సిల్ ఇప్పుడు ఆరుగురు నామినేటెడ్ మెంబెర్స్ ప్రమాణ స్వీకారం చేశారు.. ఇంకా నలుగురు ఎక్స్ అఫీషియో మెంబర్స్, 13 ఎలక్టెడ్ మెంబర్స్ ను ఇంకా ఎన్నుకోవాల్సి ఉంది.. మొత్తం ఈ కౌన్సి్ల్లో 23 మంది ఉంటాని వెల్లడించారు.. చైర్మన్, వైస్ చైర్మన్ లను కూడా ఇంకా ఎన్నుకోవాల్సిందని తెలిపారు మంత్రి సత్యకుమార్ యాదవ్..
Read Also: Redmi A5: 5200mAh బ్యాటరీతో Redmi కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల.. ధర రూ. 6 వేలు మాత్రమే
కాగా, విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్(ఏపీఎంసీ) సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ పాల్గొన్నాను. ఎపీఎంసీ సభ్యులుగా డాక్టర్ గోగినేని సుజాత, డాక్టర్ కె.వి.సుబ్బానాయుడు, డాక్టర్ డి.శ్రీహరిబాబు, డాక్టర్ స్వర్ణగీత, ఎస్.కేశవరావు బాబు, డాక్టర్ సి.మల్లీశ్వరి ప్రమాణస్వీకారం చేయగా వారికి అభినందనలు తెలిపారు.. రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడానికి, నైతిక ప్రమాణాలను కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పడానికి నిపుణులైన వైద్యులను ఏపీఎంసీ సభ్యులుగా నియమించడమే నిదర్శనం. అందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి కృషి చేయాలని, వైద్య రంగాన్ని ఆదర్శనీయంగా నిలపాలని కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన సభ్యులను ఈ సందర్భంగా కోరారు మంత్రి సత్యకుమార్..
తాజావార్తలు
-
Hyderabad : కేబీఆర్ పార్క్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే.!
-
Ragi Bellam Cake: చిన్న గిన్నెల్లోనే ఎగ్లెస్ రాగి బెల్లం కప్ కేక్స్.. హెల్తీ అండ్ టేస్టీగా ఇలా చేసుకోండి!
-
Meloni-Trump: ఇటలీ ఎప్పుడూ అలా చేయదు.. ట్రంప్పై మెలోని తీవ్ర ఆగ్రహం
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. సీఎం భరోసాతో సంతృప్తి వ్యక్తం చేసిన తల్లి
-
Sunil Gavaskar: గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్పై గవాస్కర్ ప్రశంసలు.. ఆ ‘గట్ ఫీల్’ గురించే అంటూ వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?