Vijayawada: రౌడీషీటర్ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన సెల్ఫీ వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో మరో రౌడీషీటర్ ఆత్మహత్య వ్యవహారం కలకలం రేపుతోంది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఓ సెల్ఫీ వీడియోలో, రౌడీషీటర్ క్రాంతి కుమార్ తన ఆత్మహత్యకు కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులే కారణమని ఆరోపించినట్లు తెలుస్తోంది. మే 21న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. సమాచారం ప్రకారం, క్రాంతి కుమార్ ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పోరిపోగు వెంకటేశ్వరరావు కుమారుడు. ఆత్మహత్యకు ముందు రికార్డు చేసినట్లు చెబుతున్న సెల్ఫీ వీడియోలో, పోలీసుల వేధింపుల కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.
ఈ ఘటనపై ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు గోప్యంగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం. వీడియోలో చేసిన ఆరోపణలు, ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై వివిధ కోణాల్లో పరిశీలన కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఇప్పటికే కృష్ణలంక సీఐ నాగరాజుపై మరో వివాదం కూడా కొనసాగుతోంది. రౌడీషీటర్ గాదె సాయికృష్ణ మరణంపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తమ కుమారుడిని పోలీసులు తీసుకెళ్లి లాకప్ డెత్కు గురిచేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా ఇంకా స్పష్టత రాలేదు.
Also Read
- AO M*urder Case: ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..
- Shabad Six-Murder Case: షాబాద్ ఆరుగురి హత్య కేసు.. రాజ్కుమార్పై భార్య కుటుంబం సంచలన ఆరోపణలు!
- Faridabad Mystery Death: కారులో నుంచి రక్తం.. కాలువ వద్ద దారుణం.. మహిళ చేతులు కట్టేసి..
- Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్కుమార్ మృతదేహం లభ్యం..
అదే సమయంలో, క్రాంతి కుమార్ ఆత్మహత్యకు ముందు విడుదల చేసినట్లు చెబుతున్న వీడియో వెలుగులోకి రావడంతో కృష్ణలంక పోలీసుల వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. గాదె సాయికృష్ణ మరణం కూడా అనుమానాస్పద పరిస్థితుల్లో జరిగి ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, సీఐ నాగరాజుకు మద్దతుగా కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నట్లు సమాచారం. వాట్సాప్ స్టేటస్లలో “We Stand For You” అంటూ మద్దతు సందేశాలు పోస్టు చేస్తున్నట్లు తెలుస్తోంది. కృష్ణలంకలో చోటుచేసుకున్న ఈ వరుస ఘటనలు విజయవాడలో తీవ్ర చర్చకు దారితీయగా, దర్యాప్తు ఫలితాలపై అందరి దృష్టి నిలిచింది.
తాజావార్తలు
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Dating Rumours: మృణాల్, రిషబ్ పంత్పై డేటింగ్ రూమర్స్!.. ఒక్క ఇన్స్టాగ్రామ్ ఫాలోతో వైరల్
-
Boyfriend for Rent: ఇండియాలో అద్దెకు బాయ్ఫ్రెండ్.. గంటకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు?
-
Mudragada Daughter: కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
ట్రెండింగ్
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!