Vijayawada: రౌడీషీటర్ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన సెల్ఫీ వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో మరో రౌడీషీటర్ ఆత్మహత్య వ్యవహారం కలకలం రేపుతోంది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఓ సెల్ఫీ వీడియోలో, రౌడీషీటర్ క్రాంతి కుమార్ తన ఆత్మహత్యకు కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులే కారణమని ఆరోపించినట్లు తెలుస్తోంది. మే 21న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. సమాచారం ప్రకారం, క్రాంతి కుమార్ ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పోరిపోగు వెంకటేశ్వరరావు కుమారుడు. ఆత్మహత్యకు ముందు రికార్డు చేసినట్లు చెబుతున్న సెల్ఫీ వీడియోలో, పోలీసుల వేధింపుల కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.
ఈ ఘటనపై ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు గోప్యంగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం. వీడియోలో చేసిన ఆరోపణలు, ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై వివిధ కోణాల్లో పరిశీలన కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఇప్పటికే కృష్ణలంక సీఐ నాగరాజుపై మరో వివాదం కూడా కొనసాగుతోంది. రౌడీషీటర్ గాదె సాయికృష్ణ మరణంపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తమ కుమారుడిని పోలీసులు తీసుకెళ్లి లాకప్ డెత్కు గురిచేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా ఇంకా స్పష్టత రాలేదు.
Also Read
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
- Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- Meerpet Murder : గోనె సంచిలో ఆయా శవం.. మీర్పేట్లో దారుణ హత్య
అదే సమయంలో, క్రాంతి కుమార్ ఆత్మహత్యకు ముందు విడుదల చేసినట్లు చెబుతున్న వీడియో వెలుగులోకి రావడంతో కృష్ణలంక పోలీసుల వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. గాదె సాయికృష్ణ మరణం కూడా అనుమానాస్పద పరిస్థితుల్లో జరిగి ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, సీఐ నాగరాజుకు మద్దతుగా కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నట్లు సమాచారం. వాట్సాప్ స్టేటస్లలో “We Stand For You” అంటూ మద్దతు సందేశాలు పోస్టు చేస్తున్నట్లు తెలుస్తోంది. కృష్ణలంకలో చోటుచేసుకున్న ఈ వరుస ఘటనలు విజయవాడలో తీవ్ర చర్చకు దారితీయగా, దర్యాప్తు ఫలితాలపై అందరి దృష్టి నిలిచింది.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!