Sai Krishna Missing Case: సాయి కృష్ణ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. సీఎం భరోసాతో సంతృప్తి వ్యక్తం చేసిన తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Krishna Missing Case: విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయి కృష్ణ అదృశ్యం ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. సాయి కృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి తన కుమారుడి అదృశ్యం కేసులో సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మికి ముఖ్యమంత్రి ధైర్యం చెప్పారు. ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహించి వాస్తవాలను వెలికితీస్తామని హామీ ఇచ్చారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆమె నుంచి తెలుసుకున్న సీఎం, కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన అనంతరం గాదె విజయలక్ష్మి మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచిందని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీతో తమకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం కలిగిందని తెలిపారు. సాయి కృష్ణ కేసులో అవసరమైన అన్ని విధాలా సహాయం అందిస్తామని సీఎం చెప్పారని వెల్లడించారు. సాయి కృష్ణ మేనమామ నవరంగ్ మాట్లాడుతూ.. కుటుంబం ఎదుర్కొంటున్న బాధలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఈ తరహా ఘటనలు మరెవరికీ జరగకూడదని ఆకాంక్షించారు. ప్రస్తుతం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారని, దర్యాప్తులో ఎవరికైనా తప్పు నిర్ధారణ అయితే చట్టపరమైన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి స్పష్టం చేశారని తెలిపారు.
Also Read
- Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్ను హీరో చేశారు..
- NIA Raids: విజయవాడలో ఎన్ఐఏ విస్తృత సోదాలు.. టెర్రర్ లింక్స్ కేసులో మూడు ప్రాంతాల్లో తనిఖీలు
- Chinta Mohan: అయోధ్య అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి.. కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Saikrishna Mother Vijayalakshmi: "నా కొడుకు పవన్ కళ్యాణ్ అభిమాని.. క్రిమినల్ అని ఎలా అంటారు?".. సాయికృష్ణ తల్లి ఆగ్రహం..
తమ కుటుంబానికి రాజకీయ పార్టీలతో గానీ, కులాలతో గానీ ఎలాంటి సంబంధం లేదని నవరంగ్ పేర్కొన్నారు. అన్యాయం జరిగిన చోట న్యాయం కోసం పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని చెప్పారు.. ఇప్పటికే ప్రభుత్వం స్పందించి తమకు భరోసా కల్పించిందని, ఇకపై తమ కుటుంబాన్ని వివాదాల్లోకి లాగకుండా ప్రశాంతంగా ఉండనివ్వాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Wedding Fight: మటన్ పెడతామని ఒప్పుకొని.. చికెన్ పెడతారా?.. పెళ్లి విందులో పొట్టు పొట్టు తన్నుకున్న వైనం
-
Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
-
Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జోడీగా ‘శ్రీశ్రీ’.. క్లాసిక్ లవ్ స్టోరీతో వస్తోన్న పాన్ ఇండియా మూవీ
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
Lenin Day 1 Collections : అయ్యగారు అదిరిపోయే స్టార్ట్.. లెనిన్ డే-1 ఎంతంటే?
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!