Meloni-Trump: ఇటలీ ఎప్పుడూ అలా చేయదు.. ట్రంప్పై మెలోని తీవ్ర ఆగ్రహం
- మిత్ర దేశాల మధ్య విభేదాలు
- కాకరేపుతోన్న ట్రంప్ వ్యాఖ్యలు
- అదంతా కల్పిత కథ అన్న మెలోని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిపై అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో మిత్రదేశాల మధ్య విభేదాలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ఫ్రాన్స్లో జరిగిన జీ 7 వేదికగా ట్రంప్ మాట్లాడిన వ్యాఖ్యలకు మెలోని ఘాటుగానే స్పందించారు. జీ7 సదస్సు సందర్భంగా తనతో ఫొటో దిగేందుకు మెలోని వేడుకుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఖండించారు. ఆ కథ మొత్తం కల్పితమని.. అలాంటి ఘటనే అసలు జరగలేదని స్పష్టం చేశారు. అదంతా పూర్తి కల్పిత కథ అని కొట్టిపారేశారు. ఎక్స్ వేదికగా సీరియస్గా సమాధానం ఇచ్చారు.
ఫ్రాన్స్లో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా మెలోనీ-ట్రంప్ మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఇద్దరూ ఒకే సోఫాపై కూర్చొని మాట్లాడుతున్న దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే అనంతరం ఓ ఇటాలియన్ టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. “మెలోనీ నాతో ఫొటో దిగేందుకు చాలా ఆసక్తిగా ఎదురుచూసింది. ఆమె నన్ను ఫొటో కోసం వేడుకుంది. నాకు అవసరం లేకపోయినా జాలిపడి ఫొటో దిగాను” అని వ్యాఖ్యానించినట్లు ప్రసారమైంది.
Also Read

అయితే ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై మెలోనీ తీవ్రంగా స్పందించారు.. “అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా కల్పితం. వాటిని విని నేను ఆశ్చర్యపోయాను. తన మిత్రదేశాల నాయకుల పట్ల ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇది మొదటిసారి కూడా కాదు” అని పేర్కొన్నారు. అంతేకాకుండా పాశ్చాత్య దేశాల ప్రత్యర్థుల పట్ల ట్రంప్ మరింత సానుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. “పశ్చిమ దేశాల శత్రువుల విషయంలో ఆయన చూపించే సహనాన్ని, గౌరవాన్ని తన మిత్రదేశాల నాయకుల పట్ల చూపడం లేదు. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి.. నేను గానీ, ఇటలీ గానీ ఎప్పుడూ ఎవరి ముందు వేడుకోము” అంటూ ఘాటుగా స్పందించారు.

ఈ వివాదం నేపథ్యంలో ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ అమెరికా పర్యటనను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. “ప్రధాని మెలోనీపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇటలీ మొత్తం దేశాన్ని అవమానించాయి” అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. మెలోనీకి అత్యంత సన్నిహితుడిగా భావించే ప్రధానమంత్రి కార్యాలయ అండర్సెక్రటరీ జియోవాన్బట్టిస్టా ఫజ్జోలారి కూడా ట్రంప్పై తీవ్ర విమర్శలు చేశారు. “ఉద్దేశపూర్వకంగానో.. లేక అసమర్థత వల్లనో ట్రంప్ అమెరికా-యూరప్ మధ్య ఉన్న చారిత్రాత్మక సంబంధాలను దెబ్బతీస్తున్నారు. ఆయన అనుచిత వ్యాఖ్యల వల్ల యూరప్ అంతటా అమెరికాపై వ్యతిరేక భావన పెరుగుతోంది” అని ఆరోపించారు.
గతంలో ట్రంప్కు మద్దతుగా నిలిచిన యూరోపియన్ నాయకుల్లో మెలోనీ ఒకరు. 2025లో ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఏకైక యూరోపియన్ నాయకురాలు కూడా ఆమెనే. అయితే ఇరాన్ యుద్ధంపై పోప్ లియో చేసిన వ్యాఖ్యలను విమర్శించిన ట్రంప్ను మెలోనీ ఇటీవల తప్పుబట్టడంతో ఇరువురి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తాజా మాటల యుద్ధంతో అమెరికా-ఇటలీ సంబంధాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జీ7 సదస్సు తర్వాత మెరుగుపడుతున్నాయని భావించిన ఇరుదేశాల సంబంధాలు మరోసారి సంక్షోభంలోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.
Io e l’Italia non imploriamo mai. pic.twitter.com/sTpKlqWB67
— Giorgia Meloni (@GiorgiaMeloni) June 19, 2026
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!