Meloni-Trump: ఇటలీ ఎప్పుడూ అలా చేయదు.. ట్రంప్పై మెలోని తీవ్ర ఆగ్రహం
- మిత్ర దేశాల మధ్య విభేదాలు
- కాకరేపుతోన్న ట్రంప్ వ్యాఖ్యలు
- అదంతా కల్పిత కథ అన్న మెలోని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిపై అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో మిత్రదేశాల మధ్య విభేదాలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ఫ్రాన్స్లో జరిగిన జీ 7 వేదికగా ట్రంప్ మాట్లాడిన వ్యాఖ్యలకు మెలోని ఘాటుగానే స్పందించారు. జీ7 సదస్సు సందర్భంగా తనతో ఫొటో దిగేందుకు మెలోని వేడుకుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఖండించారు. ఆ కథ మొత్తం కల్పితమని.. అలాంటి ఘటనే అసలు జరగలేదని స్పష్టం చేశారు. అదంతా పూర్తి కల్పిత కథ అని కొట్టిపారేశారు. ఎక్స్ వేదికగా సీరియస్గా సమాధానం ఇచ్చారు.
ఫ్రాన్స్లో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా మెలోనీ-ట్రంప్ మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఇద్దరూ ఒకే సోఫాపై కూర్చొని మాట్లాడుతున్న దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే అనంతరం ఓ ఇటాలియన్ టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. “మెలోనీ నాతో ఫొటో దిగేందుకు చాలా ఆసక్తిగా ఎదురుచూసింది. ఆమె నన్ను ఫొటో కోసం వేడుకుంది. నాకు అవసరం లేకపోయినా జాలిపడి ఫొటో దిగాను” అని వ్యాఖ్యానించినట్లు ప్రసారమైంది.
Also Read
- JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
- Afghan: పాక్ గడ్డపై ఆఫ్ఘన్ డ్రోన్ల పంజా.. గురితప్పని దాడి, కుప్పకూలిన ఐసిస్ అడ్డాలు!
- China Caste System: చైనాలో కుల వ్యవస్థ?.. కమ్యూనిజం వెనుక దాగిన చీకటి కోణం బట్టబయలు..
- Explainer: బంగాళాఖాతంలో పాగా వేయడానికి పాక్ కుట్రలు.. హంగోర్ క్లాస్ సబ్ మెరైన్ల కథేంటి?

అయితే ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై మెలోనీ తీవ్రంగా స్పందించారు.. “అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా కల్పితం. వాటిని విని నేను ఆశ్చర్యపోయాను. తన మిత్రదేశాల నాయకుల పట్ల ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇది మొదటిసారి కూడా కాదు” అని పేర్కొన్నారు. అంతేకాకుండా పాశ్చాత్య దేశాల ప్రత్యర్థుల పట్ల ట్రంప్ మరింత సానుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. “పశ్చిమ దేశాల శత్రువుల విషయంలో ఆయన చూపించే సహనాన్ని, గౌరవాన్ని తన మిత్రదేశాల నాయకుల పట్ల చూపడం లేదు. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి.. నేను గానీ, ఇటలీ గానీ ఎప్పుడూ ఎవరి ముందు వేడుకోము” అంటూ ఘాటుగా స్పందించారు.

ఈ వివాదం నేపథ్యంలో ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ అమెరికా పర్యటనను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. “ప్రధాని మెలోనీపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇటలీ మొత్తం దేశాన్ని అవమానించాయి” అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. మెలోనీకి అత్యంత సన్నిహితుడిగా భావించే ప్రధానమంత్రి కార్యాలయ అండర్సెక్రటరీ జియోవాన్బట్టిస్టా ఫజ్జోలారి కూడా ట్రంప్పై తీవ్ర విమర్శలు చేశారు. “ఉద్దేశపూర్వకంగానో.. లేక అసమర్థత వల్లనో ట్రంప్ అమెరికా-యూరప్ మధ్య ఉన్న చారిత్రాత్మక సంబంధాలను దెబ్బతీస్తున్నారు. ఆయన అనుచిత వ్యాఖ్యల వల్ల యూరప్ అంతటా అమెరికాపై వ్యతిరేక భావన పెరుగుతోంది” అని ఆరోపించారు.
గతంలో ట్రంప్కు మద్దతుగా నిలిచిన యూరోపియన్ నాయకుల్లో మెలోనీ ఒకరు. 2025లో ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఏకైక యూరోపియన్ నాయకురాలు కూడా ఆమెనే. అయితే ఇరాన్ యుద్ధంపై పోప్ లియో చేసిన వ్యాఖ్యలను విమర్శించిన ట్రంప్ను మెలోనీ ఇటీవల తప్పుబట్టడంతో ఇరువురి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తాజా మాటల యుద్ధంతో అమెరికా-ఇటలీ సంబంధాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జీ7 సదస్సు తర్వాత మెరుగుపడుతున్నాయని భావించిన ఇరుదేశాల సంబంధాలు మరోసారి సంక్షోభంలోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.
Io e l’Italia non imploriamo mai. pic.twitter.com/sTpKlqWB67
— Giorgia Meloni (@GiorgiaMeloni) June 19, 2026
తాజావార్తలు
-
Meloni-Trump: ఇటలీ ఎప్పుడూ అలా చేయదు.. ట్రంప్పై మెలోని తీవ్ర ఆగ్రహం
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. సీఎం భరోసాతో సంతృప్తి వ్యక్తం చేసిన తల్లి
-
Sunil Gavaskar: గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్పై గవాస్కర్ ప్రశంసలు.. ఆ ‘గట్ ఫీల్’ గురించే అంటూ వ్యాఖ్యలు..
-
Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
-
WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్లో చెల్లింపు సేవల ఆరంభం
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?