Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Krishna Incident: విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న గాదె సాయికృష్ణ ఘటనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత సీరియస్గా తీసుకుంది. ఈ ఘటనపై సమగ్రంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గాదె సాయికృష్ణను పోలీస్ లాకప్లో కొట్టి చంపారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, ఈ కేసుపై ఉన్నతస్థాయి విచారణ నిర్వహించాలని ముఖ్యమంత్రి డీజీపీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలించి నిజానిజాలు తేల్చాలని సూచించారు.
ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర పాటు కొనసాగిన ఈ భేటీలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఘటనతో పాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించినట్లు సమాచారం. సాయికృష్ణ ఘటనపై చర్చ సందర్భంగా డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్, ఇంటెలిజెన్స్ అదనపు డీజీతో పాటు ఇతర ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి తన కార్యాలయానికి పిలిపించి వివరణ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే కృష్ణలంక సీఐ నాగరాజును వీఆర్కు పంపిన విషయాన్ని డీజీపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిసింది.
Also Read
- Extra Marital Affair : మియాపూర్ లో దారుణం.. భర్తను హత్య చేసి పూడ్చిపెట్టిన భార్య.!
- Dowry harassment: ప్రేమ పెళ్లి చేసుకున్న కట్నం వేధింపులు తప్పలేదు.. 2 నెలలకే నవవధువు మృతి..
- Gurugram: పెళ్లైన మూడు నెలలకే.. భార్యను ప్రియురాలి గదికి తీసుకెళ్లి..
- Delhi: పెళ్లైన రెండు నెలలకే నవవధువు మృతి.. మిస్టరీగా ఆకృతి మరణం..
అనంతరం ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని డీజీపీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రజల్లో ఎలాంటి అనుమానాలకు తావులేకుండా పారదర్శకంగా విచారణ నిర్వహించాలని సూచించినట్లు సమాచారం. సాయికృష్ణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. విచారణ అనంతరం వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
మొత్తంగా.. గాదె సాయి కృష్ణ విషయంలో కుటుంబ సభ్యులు లాకప్ డెత్ చేశారని కుటుంబ సభ్యుల ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ నాగరాజుపై సస్పెన్షన్ వేటు వేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.. సీనియర్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈ ఘటనపై పూర్తిస్థాయి సమగ్ర విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 9 బృందాలను ఈ కేసు కోసం ఏర్పాటు చేస్తున్నారు. గాదే సాయి కృష్ణ ను పోలీసులు తీసుకెళ్లి హింసించి లాకప్ డెత్ పోలీసులు చేశారని 38 రోజులుగా సాయికృష్ణ ఆచూకీ తెలియటం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆందోళనలు చేస్తున్నారు.. ఈ ఘటనపై వైసీపీ నేతలు కూడా పోలీసులను కలిసి వినతిపత్రం ఇవ్వటంతో పాటు ఆందోళన కూడా నిర్వహించారు.. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు తాజా ఆదేశాలు ఇవ్వటంతో సాయి కృష్ణ వ్యవహారం కీలక మలుపు తీసుకున్నట్లుగా అయింది.. ఇవాళ ఉదయం కూడా సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి మేనమామ నాగేశ్వరరావు ఇతరులు ప్రెస్ మీట్ పెట్టి తమకు ఏ పార్టీతో సంబంధం లేదని ఎన్నికల్లో మాత్రం లోకేష్, పవన్ కోసం పనిచేశామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ గతంలో తమకు న్యాయం చేయాలని బాధ్యత చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు..
తాజావార్తలు
-
ICC Rankings: భారత్ ఓడినా తగ్గని కాటేరమ్మకొడుకు జోరు.. టీ20ల్లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ హవా!
-
Supreme Court: విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు టాస్క్ఫోర్స్ కీలక నివేదిక.. ఇకపై ఒత్తిడి తగ్గనుందా?
-
Microsoft: ‘‘ఇది ఆరంభం మాత్రమే’’.. ఉద్యోగుల తొలగింపుపై మైక్రోసాఫ్ట్ బాంబ్..
-
Promotions: కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఏపీకి చెందిన ఆ ఐదుగురికి IASలుగా పదోన్నతులు..
-
Bhatti Vikramarka: సింగరేణి బొగ్గు గనుల వివాదం.. కేంద్ర ప్రకటనలపై డిప్యూటీ సీఎం ఫైర్
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..