Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
- అభిమానులకు భారీ గుడ్న్యూస్
- ఒకే నాణానికి రెండు వైపులు ఆర్సీబీ-కోహ్లీ
- మరో నాలుగేళ్లు కోహ్లీ ఆడతాడనే నమ్మకం
- ఆర్సీబీకి స్వర్ణయుగాన్ని అందించిన కోహ్లీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Retirement Rumours Dismissed by RCB CEO: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మధ్య ఉన్న అనుబంధం ఐపీఎల్ చరిత్రలో అత్యంత ప్రత్యేకమైనది అనే చెప్పాలి. ఐపీఎల్ ఆరంభం నుంచి ఇప్పటివరకు ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఆర్సీబీ జెర్సీలోనే తన ఐపీఎల్ కెరీర్ను ముగించాలని పలుమార్లు స్పష్టం చేసిన కోహ్లీ భవిష్యత్తుపై ఇటీవల అభిమానుల్లో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆర్సీబీ సీఈవో రాజేష్ మీనన్ చేసిన తాజా వ్యాఖ్యలు అభిమానులకు భారీ ఊరటనిచ్చాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజేష్ మీనన్ మాట్లాడుతూ.. ఆర్సీబీ, విరాట్ కోహ్లీని వేరు చేయడం అసాధ్యమని అన్నారు. ‘ఆర్సీబీ, విరాట్ కోహ్లీ ఒకే నాణానికి రెండు వైపు లాంటివి. జట్టు ప్రయాణంలో కోహ్లీ ఎప్పుడూ కీలక భాగంగా ఉన్నాడు. అతను క్రికెట్కు వీడ్కోలు చెప్పిన తర్వాత కూడా ఆర్సీబీతో ఏదో రూపంలో కొనసాగుతాడని భావిస్తున్నాం. ఆ విషయాన్ని భవిష్యత్తులో పరిశీలిస్తాం’ అని పేర్కొన్నారు. కోహ్లీ రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేస్తూ.. అతడు కనీసం మరో మూడు నుంచి నాలుగేళ్లు ఐపీఎల్లో ఆడతాడని రాజేష్ మీనన్ ధీమా వ్యక్తం చేశారు. ‘కోహ్లీ ఫిట్నెస్ అద్భుతంగా ఉంది. అతనిలోని పరుగుల ఆకలి, గెలవాలనే తపన ఏమాత్రం తగ్గలేదు. ఈ సీజన్లో కూడా అతడు చూపించిన ఎనర్జీ, పరుగులు, ఆటతీరు అందుకు నిదర్శనం. మరో మూడు నుంచి నాలుగేళ్లు ఆడటంలో ఎలాంటి సమస్య లేదు’ అని తెలిపారు.
Also Read
- Hockey World Cup 2026: మహిళల హాకీ ప్రపంచకప్లో భారత్ జోరు.. దక్షిణాఫ్రికాపై 6-1 ఘన విజయం
- Rishabh Pant Record: టెస్టుల్లో 100 సిక్సర్లు.. పంత్ పేరిట ప్రపంచ రికార్డు!
- IND vs SL 1st Test: గాలె టెస్ట్లో భారత్కు షాక్.. రెండో ఇన్నింగ్స్లో 193 పరుగులకే చేతులెత్తేశారు..
- Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
చాలా ఏళ్ల నిరీక్షణ తర్వాత 2025లో ఆర్సీబీ తమ తొలి ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది. విరాట్ కోహ్లీ ఎన్నో సంవత్సరాలుగా కలగన్న ట్రోఫీ చివరకు జట్టుకు దక్కింది. ఆ తర్వాత 2026లో కూడా ఆర్సీబీ ఛాంపియన్గా నిలిచి టైటిల్ను విజయవంతంగా కాపాడుకుంది. దీంతో వరుసగా రెండు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన మూడో జట్టుగా ఆర్సీబీ చరిత్ర సృష్టించింది. ఈ విజయాల్లో కోహ్లీ పాత్ర అత్యంత కీలకంగా నిలిచింది. జట్టుకు నాయకత్వం, అనుభవం, బ్యాటింగ్ పరంగా అతడు నిరంతరం అండగా నిలిచాడు. ఐపీఎల్ 2026 సీజన్లో కూడా కోహ్లీ తన క్లాస్ను మరోసారి నిరూపించుకున్నాడు. 675 పరుగులు సాధించాడు. 165.84 స్ట్రైక్రేట్తో తన ఐపీఎల్ కెరీర్లోనే అత్యుత్తమ స్ట్రైక్రేట్ను నమోదు చేశాడు.
ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో అజేయంగా 75 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. జట్టుకు వరుసగా రెండో టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో కోహ్లీ ఇంకా అత్యున్నత స్థాయిలోనే ఉన్నాడని మరోసారి రుజువైంది. కోహ్లీ త్వరలో ఐపీఎల్కు వీడ్కోలు చెబుతాడేమోనని ఆందోళన చెందుతున్న ఆర్సీబీ అభిమానులకు సీఈవో రాజేష్ మీనన్ వ్యాఖ్యలు భారీ ఊరటనిచ్చాయి. ఫిట్నెస్, ఫామ్, జట్టుపై ఉన్న నిబద్ధతను చూస్తే కోహ్లీ మరో నాలుగేళ్లు ఆర్సీబీ తరఫున ఆడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఆర్సీబీ అభిమానులు తమ అభిమాన ఆటగాడిని మరికొన్ని సీజన్లు మైదానంలో చూడబోతున్నారన్న ఆనందంలో ఉన్నారు.
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!