Malladi Vishnu: భగవద్గీతను కించపరిచిన వ్యక్తిని టీటీడీ సభ్యుడిగా ఎలా కొనసాగిస్తారు..
- టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు భగవద్గీతను అవమానించేలా మాట్లాడారు..
- భగవద్గీతను కించపరిచిన ఎమ్మెల్యేని టీటీడీ పాలకవర్గ సభ్యుడిగా ఎలా కొనసాగిస్తారు..
- రాష్ట్రంలో ఏం జరిగిన తిరిగి వైసీపీపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోం: మల్లాది విష్ణు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malladi Vishnu: టీటీడీ పాలకమండలి సభ్యుడు, మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు భగవద్గీతను అవమానించేలా మాట్లాడారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. భారతదేశంతో పాటు ప్రపంచానికే ఆదర్శంగా ఉన్న భగవద్గీతను చులకనగా మాట్లాడారు.. భగవద్గీతను కించపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్యేని టీటీడీ పాలకవర్గ సభ్యుడిగా ఎలా కొనసాగిస్తారు అని ప్రశ్నించారు. వ్యవస్థలను గౌరవించని వ్యక్తిని అసలు టీడీపీ పాలకవర్గ సభ్యుడిగా ఎలా అవకాశం ఇచ్చారని అడిగారు. తాను అనని మాటలు వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేశారని తిరిగి మాపై అభాండాలు వేస్తున్నారని మల్లాది విష్ణు చెప్పుకొచ్చారు.
Read Also: Indian Railways: ఆంధ్రప్రదేశ్ లో మెగా టెర్మినల్స్.. రైల్వే శాఖ భారీ ప్లాన్
Also Read
- Tirupati - Vijayawada Flight: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం..
- NTR Health University: విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదు.. జీవో 102పై హెల్త్ యూనివర్సిటీ క్లారిటీ
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో మరో కీలక పరిణామం.. హెడ్ కానిస్టేబుళ్లపై సిట్ ఫోకస్
- Vijay Sai Reddy: కొత్త పార్టీ పెడతా.. నేను సీఎం అభ్యర్థిని కాదు.. విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన
అయితే, ఎంఎస్ రాజు మాట్లాడిన మాటలు ప్రతీ ఒక్కరికి తెలుసని మాజీ ఎమ్మెల్యే విష్ణు తెలిపారు. అయినా ఎమ్మెల్యే రాజు మాపై నిందలు వేశారు.. మేం ప్రచారం చేసింది నిజమైతే తన వ్యాఖ్యలపై ఎందుకు క్షమాపణ చెప్పారు.. సనాతన ధర్మం గురించి పదే పదే మీ పార్టనర్ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడినా స్పందించరు.. గోషాలపై మాట్లాడిన మా పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై కేసులు పెట్టారని గుర్తు చేశారు. మరి టీటీడీ పాలకవర్గ సమావేశంలో గోషాల నిర్వహణ ప్రైవేట్ వాళ్లకు అప్పగించాలనే విషయంలో చర్చ ఎందుకు పెట్టారు.. ఈ ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వం.. హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన టీటీడీ బోర్డు సభ్యులే కించపరిచేలా వ్యవహరిస్తుంటే ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తుందని మల్లాది విష్ణు ప్రశ్నించారు.
Read Also: Upcoming 5G Smartphones: కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకుంటున్నారా?.. నవంబర్లో లాంచ్ అయ్యే లిస్ట్ ఇదే!
తక్షణమే టీటీడీ బోర్డు సభ్యుడిగా ఎంఎస్ రాజును తొలగించాలని వైసీపీ నేత మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. గత కొద్ది రోజులుగా టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేలా అనేక కార్యక్రమాలు చేశారు.. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా అనేక చోట్ల జరుగుతున్నా బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని క్వశ్చన్ చేశారు. ఏం మాట్లాడినా తిరిగి వైసీపీ మీద నెపం వేస్తే సరిపోతుందని అనుకుంటే చూస్తూ ఊరుకోం అని మల్లాది విష్ణు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Botsa Satyanarayana Emotional: బొత్స సత్యనారాయణ కంటతడి.. వైసీపీ సమావేశంలో భావోద్వేగం
-
IND vs AFG: హర్షిత్ రాణా అవుట్.. యువ పేసర్కు లక్కీ ఛాన్స్!
-
UP 2027 Elections: యూపీ 2027 ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు.. సీట్ల పంపకంలో చిక్కుముడి
-
Bhatti Vikramarka: ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి!
-
Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?