Malladi Vishnu: భగవద్గీతను కించపరిచిన వ్యక్తిని టీటీడీ సభ్యుడిగా ఎలా కొనసాగిస్తారు..
- టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు భగవద్గీతను అవమానించేలా మాట్లాడారు..
- భగవద్గీతను కించపరిచిన ఎమ్మెల్యేని టీటీడీ పాలకవర్గ సభ్యుడిగా ఎలా కొనసాగిస్తారు..
- రాష్ట్రంలో ఏం జరిగిన తిరిగి వైసీపీపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోం: మల్లాది విష్ణు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malladi Vishnu: టీటీడీ పాలకమండలి సభ్యుడు, మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు భగవద్గీతను అవమానించేలా మాట్లాడారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. భారతదేశంతో పాటు ప్రపంచానికే ఆదర్శంగా ఉన్న భగవద్గీతను చులకనగా మాట్లాడారు.. భగవద్గీతను కించపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్యేని టీటీడీ పాలకవర్గ సభ్యుడిగా ఎలా కొనసాగిస్తారు అని ప్రశ్నించారు. వ్యవస్థలను గౌరవించని వ్యక్తిని అసలు టీడీపీ పాలకవర్గ సభ్యుడిగా ఎలా అవకాశం ఇచ్చారని అడిగారు. తాను అనని మాటలు వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేశారని తిరిగి మాపై అభాండాలు వేస్తున్నారని మల్లాది విష్ణు చెప్పుకొచ్చారు.
Read Also: Indian Railways: ఆంధ్రప్రదేశ్ లో మెగా టెర్మినల్స్.. రైల్వే శాఖ భారీ ప్లాన్
Also Read
- VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
- Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
- Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
- Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
అయితే, ఎంఎస్ రాజు మాట్లాడిన మాటలు ప్రతీ ఒక్కరికి తెలుసని మాజీ ఎమ్మెల్యే విష్ణు తెలిపారు. అయినా ఎమ్మెల్యే రాజు మాపై నిందలు వేశారు.. మేం ప్రచారం చేసింది నిజమైతే తన వ్యాఖ్యలపై ఎందుకు క్షమాపణ చెప్పారు.. సనాతన ధర్మం గురించి పదే పదే మీ పార్టనర్ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడినా స్పందించరు.. గోషాలపై మాట్లాడిన మా పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై కేసులు పెట్టారని గుర్తు చేశారు. మరి టీటీడీ పాలకవర్గ సమావేశంలో గోషాల నిర్వహణ ప్రైవేట్ వాళ్లకు అప్పగించాలనే విషయంలో చర్చ ఎందుకు పెట్టారు.. ఈ ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వం.. హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన టీటీడీ బోర్డు సభ్యులే కించపరిచేలా వ్యవహరిస్తుంటే ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తుందని మల్లాది విష్ణు ప్రశ్నించారు.
Read Also: Upcoming 5G Smartphones: కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకుంటున్నారా?.. నవంబర్లో లాంచ్ అయ్యే లిస్ట్ ఇదే!
తక్షణమే టీటీడీ బోర్డు సభ్యుడిగా ఎంఎస్ రాజును తొలగించాలని వైసీపీ నేత మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. గత కొద్ది రోజులుగా టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేలా అనేక కార్యక్రమాలు చేశారు.. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా అనేక చోట్ల జరుగుతున్నా బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని క్వశ్చన్ చేశారు. ఏం మాట్లాడినా తిరిగి వైసీపీ మీద నెపం వేస్తే సరిపోతుందని అనుకుంటే చూస్తూ ఊరుకోం అని మల్లాది విష్ణు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!