Tirumala Rush: భక్తులతో కిటకిటలాడుతున్న ఏడుకొండలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల భక్త జనసంద్రంగా మారింది. రోజూ లక్షకు తగ్గకుండా భక్తులు తిరుమలకు వస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు భక్తులు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పైగా పడుతోంది. శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు 87,698 మంది భక్తులు. తలనీలాలు సమర్పించారు 48,804 మంది భక్తులు. హుండీ ఆదాయం రూ.3.88 కోట్లు అని టీటీడీ తెలిపింది.
దీంతో ఏడుకొండలపై ఎటూ చూసినా గోవింద నామస్మరణమే. భక్తులతో సందడి సందడిగా మారింది. కోవిడ్ తర్వాత మే నెలలో భారీగా భక్తులు తిరుమలేశుడిని దర్శించుకున్నారు. తిరుమలలో భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ లైన్లు పరిశీలించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి పలు సూచనలు చేశారు. భక్తుల తాకిడి దృష్ట్యా అదనపు క్యూ లైనులు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికార్లకు ఈవో ఆదేశాలు ఇచ్చారు.
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
ఈవో ధర్మారెడ్డి ఆదేశాలతో ఆళ్వార్ ట్యాంక్ చుట్టూ అదనపు క్యూ లైనులు ఏర్పాటు చేస్తున్నారు టీటీడీ అధికారులు. వేసవి సెలవులు అయిపోవస్తున్నాయి. దీంతో భక్తులు తిరుమలకు పయనం అయ్యారు. గతంలో కోవిడ్ భయాల వల్ల దైవదర్శనాలు వాయిదా వేసుకున్నవారు తిరుమలకు ఇప్పుడు చేరుకుని, తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇవాళ్టి నుంచి శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఇవాళ వజ్రకవచధారియై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి. రెండేళ్ళ తరువాత జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలకు భక్తులును అనుమతిస్తుంది టీటీడీ. కరెంట్ బుకింగ్ విధానంలో భక్తులకు జ్యేష్ఠాభిషేకం టిక్కెట్లు విక్రయిస్తుంది టీటీడీ.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!