Pawan Kalyan Suffering From High Fever: డిప్యూటీ సీఎం పవన్కు తీవ్ర జ్వరం.. గెస్ట్హౌస్లోనే వైద్యసేవలు..
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరం..
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న పవన్..
- మొన్నటి నుంచి తిరుమలలోనే బస..
- ఫీవర్ ఉన్నా వారాహి సభకు వస్తానంటున్న పవన్..
Pawan Kalyan Suffering From Fever: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు.. నడకమార్గంలో మొన్న తిరుమల చేరుకున్న ఆయన.. వెన్నునొప్పి కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.. ఇక, నిన్న తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని.. తన దీక్ష విరమించారు.. ఆ తర్వాత అక్కడే అతిథి గృహంలో బస చేశారు.. అయితే, ఆయన ప్రస్తుతం తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు.. దీంతో.. ఆయన బస చేసిన అతిధి గృహంలోనే వైద్యసేవలందిస్తున్నారు డాక్టర్లు.. మొన్నటి నుంచి అసౌకర్యంగానే ఉంటున్నారు పవన్ కల్యాణ్.. వెన్నునొప్పి కారణంగా నడకమార్గంలోనూ ఇబ్బందిపడ్డారు.. కానీ, తనకు అనారోగ్యంగా వున్నా.. ఈరోజు సాయంత్రం వారాహి సభలో పాల్గొంటానని పవన్ కల్యాణ్ చెప్పినట్టుగా జనసేన శ్రేణులు చెబుతున్నాయి.. ఇక, తిరుపతి వేదికగా జరిగే వారాహి బహిరంగ సభలో.. వారాహి డిక్లరేషన్ పేరుతో సనాతన ధర్మ వ్యవస్థ కోసం డిక్లరేషన్ ప్రకటించబోతున్నారు జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది..
Read Also: Azharuddin: మనీలాండరింగ్ కేసులో విచారణకు క్రికెటర్ అజారుద్దీన్కు సమన్లు!
Also Read
- TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
- Tirumala Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ముగిసిన ఏక సభ్య కమిషన్ విచారణ..
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఇవాళ్టి నుంచే జులై నెల దర్శన టికెట్ల విడుదల
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సర్వదర్శనం టోకెన్ల సమయంలో మార్పులు..
ఇక, ప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మూడోరోజు తిరుపతిలోనే ఉండనున్నారు. ఇవాళ సాయంత్రం వరకు అక్కడే ఉంటారు. నిన్న ప్రాయశ్చిత్త దీక్ష విరమించిన పవన్ కళ్యాణ్, సాయంత్రం తిరుపతిలో వారాహి సభలో పాల్గొంటారు. సా.4 గంటలకు జ్యోతిరావు పూలే సర్కిల్ దగ్గర బహిరంగ సభ జరగనుంది. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల 11 రోజుల పాటు ప్రాయశ్చిత దీక్షను చేపట్టారు. నిన్న తిరుమల స్వామివారిని దర్శించుకున్న ఆయన.. దీక్షను విరమించారు. శ్రీవారి సేవలో పాల్గొన్న ఆయనకు గొల్ల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించారు. జనసేనానికి టీటీడీ అధికారులు స్వామివారి చిత్రపటం, తీర్ధ ప్రసాదాలు అందించారు. పవన్ తన ఇద్దరు కుమార్తెలు ఆద్య, పొలెనా అంజనతో పాటు దర్శకుడు త్రివిక్రమ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి స్వామి వారిని సేవలో పాల్గొన్న విషయం విదితమే.. ఇప్పుడు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నా.. సాయంత్రం వారాహి సభకు మాత్రం హాజరవుతారని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Kyle Jamieson IPL Penalty: బిగ్ వార్నింగ్.. వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసిన బౌలర్కు షాక్ ఇచ్చిన బీసీసీఐ..
-
Axar Patel: ఎందుకు అతడిని లెజెండ్ అంటారో ఇప్పుడు అర్థమైంది.. ఆ ఆనందమే వేరప్ప!
-
Gold Rates: గోల్డ్ లవర్స్కు మళ్లీ షాక్.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా!
-
New LPG Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్.. ఈ పని చేయకపోతే కనెక్షన్ కట్..!
-
Samsung Galaxy F17e 5G: సామ్ సంగ్ 5G ఫోన్ కేవలం రూ.13,774 కే.. 6000 mAh బ్యాటరీ, 50MP కెమెరా
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!