CM Chandrababu: టీడీపీ ఎప్పుడు పదవుల కోసం పనిచేయలేదు.. విశ్వసనీయత కోసం పనిచేశాం
- శ్రీకాకుళం జిల్లా అధికారులు.. ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం
- జిల్లా అభివృద్ధిపై చర్చ
- ఫ్రంట్ ఏర్పాటు చేసి కేంద్రంలో మంత్రి పదవులు తీసుకోకుండా రాష్ట్రం కోసం పనిచేసిన పార్టీ టీడీపీ
- ఇప్పుడు ఎన్డీఏతో కలిసి పనిచేస్తున్నాం- చంద్రబాబు
- టీడీపీ ఎప్పుడు పదవుల కోసం పనిచేయలేదు విశ్వసనీయత కోసం పనిచేస్తాం అనేది గుర్తించాలి- సీఎం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించారు. జిల్లా అభివృద్ధిపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఫ్రంట్ ఏర్పాటు చేసి కేంద్రంలో మంత్రి పదవులు తీసుకోకుండా రాష్ట్రం కోసం పనిచేసిన పార్టీ టీడీపీ అని అన్నారు. ఇప్పుడు ఎన్డీఏతో కలిసి పనిచేస్తున్నాం.. టీడీపీ ఎప్పుడు పదవుల కోసం పనిచేయలేదు.. విశ్వసనీయత కోసం పని చేస్తాం అనేది గుర్తించాలన్నారు. ప్రజలలో ఉండే ఎక్స్ప్టేకేషన్స్ను మనం ఫుల్ ఫీల్ చేయాలన్నారు. కీలకమైన సమయంలో 21 మంది ఎంపీలు గెలిపించి కేంద్రంలో మన పరపతి పెంచారని సీఎం తెలిపారు. దానివల్లే అమరావతికి, పోలవరానికి నిధులు ఇచ్చారన్నారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయకూడదంటే దానికి నిధులు ఇచ్చారని ముఖ్యమంత్రి పేర్కన్నారు.
Rohit Bal: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ కన్నుమూత
Also Read
- YS Jagan Srikakulam Tour: శ్రీకాకుళంలో జగన్ పర్యటన పూర్తి షెడ్యూల్.. పోలీసుల కఠిన ఆంక్షలు..!
- YS Jagan Srikakulam Visit: వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ.. పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్..
- Dharmana Krishnadas: 'ఈరోజు అప్పలరాజు.. రేపు మేమే'.. కూటమి ప్రభుత్వంపై ధర్మాన సంచలన వ్యాఖ్యలు
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
ఎకానమీ పెరిగినప్పుడు పార్టీ శ్రేణులు కూడా రాజకీయంగా ఎకనామిక్ పరంగా ఏవిధంగా ఎదగాలో ఆలోచించాలని సీఎం చంద్రబాబు అధికారులకు తెలిపారు. జగన్ లాంటి వారు రాజకీయాల్లోనే ఎకానమీ సంపాదించుకోవాలని అనుకుంటారు.. తాత్కాలిక ప్రలోభాలకు కాకుండా శాశ్వత గౌరవాన్ని పెంచుకునేందుకు ఆలోచించండి.. మెంబర్షిప్ కార్యక్రమంలో మీ రిఫరెన్స్తో కొత్తవారిని చేరిస్తే రేపు ఇచ్చే పదవుల్లో మీకు గుర్తింపు ఇస్తామని చంద్రబాబుకు అధికారులకు చెప్పారు. రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని డిస్టబెన్స్లు వస్తున్నాయన్నారు. పాలిటిక్స్లో మిత్ర ధర్మం కూడా ఉంటుంది.. జనసేన, బీజేపీని కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత మీపైన ఆయా పార్టీల నేతలపైన ఉంటుందని వ్యాఖ్యానించారు. అందరం కలిసి ఉండాల్సింది చారిత్రిక అవసరం.. ప్రతిపక్షానికి 11 సీట్లు వచ్చాయి. ఆ పార్టీ లేదు అనుకుంటే మనకు ఇబ్బందులు వస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు.
Indonesia: గూగుల్ పిక్సెల్ ఫోన్లపై నిషేధం విధించిన ఇండోనేషియా
అల్టిమేట్గా మనం గుర్తించాల్సింది పార్టీనీ కాదు.. ప్రజలతో మనం అనుసంధానం కావాలన్నారు. పదవుల్లో ప్రతి సెలక్షన్ తన ఆలోచన లేకుండా చేయటం లేదు.. ఎందుకంటే మీకు న్యాయం చేయాల్సిన అవసరం తనకు ఉందని చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్లు ఉన్నది ఒక రాజకీయ పార్టీ కాదు.. ఐదేళ్లు ఒక నేరస్తుల అడ్డా అది అని దుయ్యబట్టారు. ఆ నేరస్తులు అంత ఈజీగా మారేవారు కాదు రాజకీయ ముసుగులో వాళ్ళు ఉన్నారని అన్నారు. ఈరోజు వీళ్లంతా రాజకీయ నాయకులుగా వచ్చి కొత్తగా సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని క్యారెక్టర్ అనాలిసిస్ను కూడా చేస్తున్నారు.. తాను కక్ష సాధింపులు చేయను కానీ అదే సమయంలో రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తుల్ని మాత్రం వదిలే సమస్య లేదని చంద్రబాబు హెచ్చరించారు. తాను చాలా కఠినంగా ఉంటాను.. తాను ఏ పని చేసిన ప్రజాహితం కోసమే చేస్తానని సీఎం చెప్పారు. ఇక నుండి అన్ని జిల్లాల్లో కూడా పార్టీ క్యాడర్ను కలుస్తా.. నరేగా పనుల్లో బిల్లులు అడ్డుకున్నారు.. వాటిని పరిష్కరించేందుకు జిల్లాకు ఒక ప్రత్యేక సెల్ పెడతామని సీఎం తెలిపారు.
తాజావార్తలు
-
Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్తో అభిమానుల భారీ వేడుకలు!
-
Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
-
Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
-
Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్తో ఇండియా మార్కెట్పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
-
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!