CM Chandrababu: టీడీపీ ఎప్పుడు పదవుల కోసం పనిచేయలేదు.. విశ్వసనీయత కోసం పనిచేశాం
- శ్రీకాకుళం జిల్లా అధికారులు.. ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం
- జిల్లా అభివృద్ధిపై చర్చ
- ఫ్రంట్ ఏర్పాటు చేసి కేంద్రంలో మంత్రి పదవులు తీసుకోకుండా రాష్ట్రం కోసం పనిచేసిన పార్టీ టీడీపీ
- ఇప్పుడు ఎన్డీఏతో కలిసి పనిచేస్తున్నాం- చంద్రబాబు
- టీడీపీ ఎప్పుడు పదవుల కోసం పనిచేయలేదు విశ్వసనీయత కోసం పనిచేస్తాం అనేది గుర్తించాలి- సీఎం.
శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించారు. జిల్లా అభివృద్ధిపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఫ్రంట్ ఏర్పాటు చేసి కేంద్రంలో మంత్రి పదవులు తీసుకోకుండా రాష్ట్రం కోసం పనిచేసిన పార్టీ టీడీపీ అని అన్నారు. ఇప్పుడు ఎన్డీఏతో కలిసి పనిచేస్తున్నాం.. టీడీపీ ఎప్పుడు పదవుల కోసం పనిచేయలేదు.. విశ్వసనీయత కోసం పని చేస్తాం అనేది గుర్తించాలన్నారు. ప్రజలలో ఉండే ఎక్స్ప్టేకేషన్స్ను మనం ఫుల్ ఫీల్ చేయాలన్నారు. కీలకమైన సమయంలో 21 మంది ఎంపీలు గెలిపించి కేంద్రంలో మన పరపతి పెంచారని సీఎం తెలిపారు. దానివల్లే అమరావతికి, పోలవరానికి నిధులు ఇచ్చారన్నారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయకూడదంటే దానికి నిధులు ఇచ్చారని ముఖ్యమంత్రి పేర్కన్నారు.
Rohit Bal: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ కన్నుమూత
Also Read
- Dharmana Prasada Rao: ఇలా చేస్తే.. ఇంకో రాష్ట్రం కోసం ఉద్యమం..! వాటికి ఆజ్యం పోయకండి..
- Social Boycott: శ్రీకాకుళంలో సామాజిక బహిష్కరణ.. పనులకు, శుభకార్యాలకు పిలవద్దు అంటూ దండోరా..
- Dharmana Prasada Rao: కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదు..
- Gunda Appala Suryanarayana Passes Away: కాలుజారి పడిపోయిన మాజీ మంత్రి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత..
ఎకానమీ పెరిగినప్పుడు పార్టీ శ్రేణులు కూడా రాజకీయంగా ఎకనామిక్ పరంగా ఏవిధంగా ఎదగాలో ఆలోచించాలని సీఎం చంద్రబాబు అధికారులకు తెలిపారు. జగన్ లాంటి వారు రాజకీయాల్లోనే ఎకానమీ సంపాదించుకోవాలని అనుకుంటారు.. తాత్కాలిక ప్రలోభాలకు కాకుండా శాశ్వత గౌరవాన్ని పెంచుకునేందుకు ఆలోచించండి.. మెంబర్షిప్ కార్యక్రమంలో మీ రిఫరెన్స్తో కొత్తవారిని చేరిస్తే రేపు ఇచ్చే పదవుల్లో మీకు గుర్తింపు ఇస్తామని చంద్రబాబుకు అధికారులకు చెప్పారు. రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని డిస్టబెన్స్లు వస్తున్నాయన్నారు. పాలిటిక్స్లో మిత్ర ధర్మం కూడా ఉంటుంది.. జనసేన, బీజేపీని కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత మీపైన ఆయా పార్టీల నేతలపైన ఉంటుందని వ్యాఖ్యానించారు. అందరం కలిసి ఉండాల్సింది చారిత్రిక అవసరం.. ప్రతిపక్షానికి 11 సీట్లు వచ్చాయి. ఆ పార్టీ లేదు అనుకుంటే మనకు ఇబ్బందులు వస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు.
Indonesia: గూగుల్ పిక్సెల్ ఫోన్లపై నిషేధం విధించిన ఇండోనేషియా
అల్టిమేట్గా మనం గుర్తించాల్సింది పార్టీనీ కాదు.. ప్రజలతో మనం అనుసంధానం కావాలన్నారు. పదవుల్లో ప్రతి సెలక్షన్ తన ఆలోచన లేకుండా చేయటం లేదు.. ఎందుకంటే మీకు న్యాయం చేయాల్సిన అవసరం తనకు ఉందని చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్లు ఉన్నది ఒక రాజకీయ పార్టీ కాదు.. ఐదేళ్లు ఒక నేరస్తుల అడ్డా అది అని దుయ్యబట్టారు. ఆ నేరస్తులు అంత ఈజీగా మారేవారు కాదు రాజకీయ ముసుగులో వాళ్ళు ఉన్నారని అన్నారు. ఈరోజు వీళ్లంతా రాజకీయ నాయకులుగా వచ్చి కొత్తగా సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని క్యారెక్టర్ అనాలిసిస్ను కూడా చేస్తున్నారు.. తాను కక్ష సాధింపులు చేయను కానీ అదే సమయంలో రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తుల్ని మాత్రం వదిలే సమస్య లేదని చంద్రబాబు హెచ్చరించారు. తాను చాలా కఠినంగా ఉంటాను.. తాను ఏ పని చేసిన ప్రజాహితం కోసమే చేస్తానని సీఎం చెప్పారు. ఇక నుండి అన్ని జిల్లాల్లో కూడా పార్టీ క్యాడర్ను కలుస్తా.. నరేగా పనుల్లో బిల్లులు అడ్డుకున్నారు.. వాటిని పరిష్కరించేందుకు జిల్లాకు ఒక ప్రత్యేక సెల్ పెడతామని సీఎం తెలిపారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో