YS Jagan Srikakulam Visit: వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ.. పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan Srikakulam Visit: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (గురువారం రోజు) శ్రీకాకుళం జిల్లాలో పర్యటించున్నారు.. ఈ నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. జైలు వద్ద ములాఖాత్ కార్యక్రమం వరకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి తెలిపారు. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ర్యాలీలు, భారీ జనసమీకరణలకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని ఎస్పీ స్పష్టం చేశారు. గతంలో జరిగిన క్రౌడ్ గేదరింగ్ ఘటనలు, ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో భద్రతా పరమైన అంశాలు, శాంతిభద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
పోలీసులు విధించిన నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. ప్రజలు, పార్టీ శ్రేణులు పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్కు ఉన్న జడ్ ప్లస్ (Z+) భద్రతా కేటగిరీ ప్రకారం పూర్తి భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే ఆయన కాన్వాయ్లో ఎనిమిది వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
Also Read
- Chintada Ravi Kumar Arrest: పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవికుమార్.. సర్కార్పై సంచలన వ్యాఖ్యలు
- YS Jagan Srikakulam Tour: శ్రీకాకుళంలో జగన్ పర్యటన పూర్తి షెడ్యూల్.. పోలీసుల కఠిన ఆంక్షలు..!
- Dharmana Krishnadas: 'ఈరోజు అప్పలరాజు.. రేపు మేమే'.. కూటమి ప్రభుత్వంపై ధర్మాన సంచలన వ్యాఖ్యలు
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
శ్రీకాకుళం జిల్లా పలాసలో సంచలనం రేపిన హిట్ అండ్ రన్ కేసులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మకు ఊరట లభించింది. సోంపేట కోర్టు విధించిన షరతులతో కూడిన బెయిల్పై ఆరవ్ వర్మతో పాటు A2 సిద్ధార్థ్ త్యాడి అంపోలు జిల్లా జైలు నుంచి బుధవారం విడుదలయ్యారు. జైలు వద్దకు చేరుకున్న ఆరవ్ తల్లి శ్రీదేవి భావోద్వేగానికి గురై కుమారుడిని ముద్దాడుతూ ఆలింగనం చేసుకున్నారు. సిద్ధార్థ్ త్యాడిని కూడా ఆప్యాయంగా పలకరించారు. అనంతరం ఇద్దరినీ తన వాహనంలో ఎక్కించుకుని పలాసకు తీసుకెళ్లారు. ఇదే హిట్ అండ్ రన్ కేసులో మాజీమంత్రి సీదిరి అప్పలరాజు ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా అంపోలు జైలులో ఉన్నారు. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు గురువారం శ్రీకాకుళం వెళ్లనున్నారు వైఎస్ జగన్.. ఈ నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించడంతో.. జగన్ పర్యటన ఎలా సాగనుంది అనేది ఉత్కంఠగా మారింది..
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!