Hindupur: ఫలించిన బాలయ్య మంత్రాగం.. వైసీపీకి బిగ్ షాక్..!
- హిందూపురంలో వైసీపీకి బిగ్ షాక్..!
- ఫలించిన ఎమ్మెల్యే బాలయ్య మంత్రాంగం..
- హిందూపురం మున్సిపాలిటీని కైవసం చేసుకున్న టీడీపీ కూటమి..
- మున్సిపాల్టీలో మొత్తం కౌన్సిలర్ల సంఖ్య 38..
- 20కి చేరిన టీడీపీ కూటమి బలం..
Hindupur: హిందూపురం ఎమ్మెల్యే, నటసింహ నందమూరి బాలకృష్ణ.. తన సొంత నియోజకవర్గం హిందూపురంలో శుక్రవారం బిజీబిజీగా గడిపారు.. అన్న క్యాంటీన్ను ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. మరోవైపు.. హిందూపురం మున్సిపాల్టీని కైవసం చేసుకోవడానికి బాలయ్య చేసిన ప్రయత్నాలు ఫలించాయి.. దీంతో.. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.. బాలయ్య మంత్రాంగం ఫలించడంతో.. హిందూపురం మున్సిపాలిటీని టీడీపీ కూటమి కైవసం చేసుకోనుంది.. మున్సిపాల్టీలో మొత్తం కౌన్సిలర్ల సంఖ్య 38గా ఉండగా.. ఇప్పుడు టీడీపీ కూటమి బలం 20కి చేరింది.. దీంతో.. మున్సిపల్చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు ఇంద్రజ.. రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ కు అందజేశారు..
Read Also: Sabarmati Express: కాన్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్ప్రెస్..
Also Read
- Massive Explosion in Kadiri: కదిరిలో భారీ పేలుడు.. నలుగురు అక్కడికక్కడే మృతి.. 12 మందికి సీరియస్..
- BV Raghavulu: చంద్రబాబు, జగన్పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..
- Minister Satya Kumar Dance: సంక్రాంతి సంబరాల్లో మంత్రి సత్యకుమార్ సూపర్ డ్యాన్స్..
- SBI Bank Robbery Case: ఎస్బిఐ బ్యాంక్ దోపిడీ కేసు ఛేదన.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్.. రూ.5.50 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
మరోవైపు.. ఈ నెల 20న మున్సిపల్ కౌన్సిల్ అత్యవసరంగా సమావేశం కానుంది.. ఈ సమావేశంలో చైర్పర్సన్ ఇంద్రజ రాజీనామా ఆమోదం కోసం మిగిలిన సభ్యుల అభిప్రాయం తీసుకోనున్నారు మున్సిపల్ అధికారులు.. ఇదే సమయంలో.. హిందూపురం మున్సిపల్ కొత్త చైర్మన్గా.. కౌన్సిలర్ డీఈ రమేష్కు అవకాశం ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది.. ఇక, తెలుగుదేశం పార్టీలో చేరిన తమ పార్టీ కౌన్సిలర్లపై వేటు వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులుగా విజయం సాధించి టీడీపీలో చేరిన కౌన్సిలర్లపై సస్పెన్షన్ వేటు వేసింది వైసీపీ అధిష్టానం.. పార్టీ ఫిరాయించిన 11 మంది వైసీపీ కౌన్సిలర్లను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.. కాగా, హిందూపురం మున్సిపల్ ఛైర్పర్సన్ ఇంద్రజతో పాటు 8 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో గురువారం టీడీపీలో చేరారు.. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులమై టీడీపీలో చేరుతున్నట్లు ఈ సందర్భంగా ఇంద్రజ పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. పలు మున్సిపాల్టీలను టీడీపీ నేతృత్వంలోని కూటమి కైవసం చేసుకున్న విషయం విదితమే.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో