Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
- జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు
- ప్రభుత్వంతో చర్చలు విఫలం
- ఆందోళన కొనసాగిస్తున్న విద్యార్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్లో నియామక పరీక్షల్లో పేపర్ లీక్లు, అవకతవకలు జరిగాయంటూ అభ్యర్థులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం వివిధ విద్యార్థి సంఘాలు, నిరసనకారులతో వరుసగా చర్చలు జరిపింది. అయితే ఈ సమావేశాలతో ప్రతిష్ఠంభనకు తెరపడలేదు. తమ డిమాండ్లన్నింటినీ నెరవేర్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని నిరసనకారులు స్పష్టం చేశారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ తొలుత జార్ఖండ్ లోక్ జనశక్తి మోర్చా నేత దేవేంద్రనాథ్ మహతో నేతృత్వంలోని నిరసనకారుల వర్గంతో సమావేశమైంది. పేపర్ లీక్ వ్యవహారంపై మహతో చేపట్టిన నిరాహార దీక్ష ఏడో రోజుకు చేరుకుంది. అనంతరం కాంగ్రెస్ మద్దతు ఉన్న ఎన్ఎస్యూఏ, ఆదివాసీ ఛాత్ర సంఘ్, జార్ఖండ్ ఛాత్ర మోర్చా ప్రతినిధులతో కమిటీ వేర్వేరుగా చర్చలు జరిపింది. శుక్రవారం రాత్రి కూడా 10 మంది సభ్యుల ప్రతినిధి బృందంతో ప్రభుత్వం చర్చలు నిర్వహించింది.
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
- Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
- Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్పింగ్ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
వరుస సమావేశాల అనంతరం ప్రభుత్వ కమిటీ సభ్యుడు, రాష్ట్ర మంత్రి సంజయ్ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ.. నిరసనకారుల డిమాండ్లు న్యాయమైనవేనని తెలిపారు. వాటిని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అధికార జేఎంఎం విద్యార్థి విభాగమైన జార్ఖండ్ ఛాత్ర మోర్చా (JCM) ప్రభుత్వం ముందు ఐదు డిమాండ్లను ఉంచింది. వీటిలో 14వ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) సివిల్ సర్వీసెస్ పరీక్షను రద్దు చేయాలన్న డిమాండ్ కూడా ఉంది. కాంగ్రెస్కు అనుబంధంగా ఉన్న NSUI ప్రభుత్వం ముందు ఆరు డిమాండ్లను ఉంచింది. అనుమానాస్పదంగా ఉన్న అన్ని JPSC, JSSC పరీక్షలపై 90 రోజుల్లోపు CID దర్యాప్తు చేపట్టాలని కోరింది. అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తరహాలో జార్ఖండ్ టెస్టింగ్ ఏజెన్సీను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.
ఆదివాసీ ఛాత్ర సంఘ్ నేత కార్తిక్ ఓరావ్ మాట్లాడుతూ.. నియామక పరీక్షల్లో గిరిజన, ప్రాంతీయ భాషలను క్వాలిఫైయింగ్ పేపర్లుగా చేర్చాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. అవకతవకలు జరిగినట్లు గుర్తించిన పరీక్షలను రద్దు చేయాలని కూడా కోరినట్లు వెల్లడించారు. ప్రభుత్వ కమిటీ తొలుత దేవేంద్రనాథ్ మహతో వర్గానికి చెందిన విద్యార్థుల సంఘంతో దాదాపు రెండు గంటల పాటు సమావేశమైంది. తమ సమస్యలను పరిష్కరించేందుకు త్వరగా నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఫోరం నేత తెలిపారు. అయితే 14వ JPSC పరీక్ష రద్దుతో పాటు తమ డిమాండ్లన్నింటినీ నెరవేర్చే వరకు నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
- Tags
- Jharkhand
- JPSC exam
- Paper LEak
తాజావార్తలు
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్మెన్గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!