Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
- జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు
- ప్రభుత్వంతో చర్చలు విఫలం
- ఆందోళన కొనసాగిస్తున్న విద్యార్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్లో నియామక పరీక్షల్లో పేపర్ లీక్లు, అవకతవకలు జరిగాయంటూ అభ్యర్థులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం వివిధ విద్యార్థి సంఘాలు, నిరసనకారులతో వరుసగా చర్చలు జరిపింది. అయితే ఈ సమావేశాలతో ప్రతిష్ఠంభనకు తెరపడలేదు. తమ డిమాండ్లన్నింటినీ నెరవేర్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని నిరసనకారులు స్పష్టం చేశారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ తొలుత జార్ఖండ్ లోక్ జనశక్తి మోర్చా నేత దేవేంద్రనాథ్ మహతో నేతృత్వంలోని నిరసనకారుల వర్గంతో సమావేశమైంది. పేపర్ లీక్ వ్యవహారంపై మహతో చేపట్టిన నిరాహార దీక్ష ఏడో రోజుకు చేరుకుంది. అనంతరం కాంగ్రెస్ మద్దతు ఉన్న ఎన్ఎస్యూఏ, ఆదివాసీ ఛాత్ర సంఘ్, జార్ఖండ్ ఛాత్ర మోర్చా ప్రతినిధులతో కమిటీ వేర్వేరుగా చర్చలు జరిపింది. శుక్రవారం రాత్రి కూడా 10 మంది సభ్యుల ప్రతినిధి బృందంతో ప్రభుత్వం చర్చలు నిర్వహించింది.
Also Read
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- NEET PG 2026 Exam: నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి.. కీలక మార్గదర్శకాలు
వరుస సమావేశాల అనంతరం ప్రభుత్వ కమిటీ సభ్యుడు, రాష్ట్ర మంత్రి సంజయ్ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ.. నిరసనకారుల డిమాండ్లు న్యాయమైనవేనని తెలిపారు. వాటిని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అధికార జేఎంఎం విద్యార్థి విభాగమైన జార్ఖండ్ ఛాత్ర మోర్చా (JCM) ప్రభుత్వం ముందు ఐదు డిమాండ్లను ఉంచింది. వీటిలో 14వ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) సివిల్ సర్వీసెస్ పరీక్షను రద్దు చేయాలన్న డిమాండ్ కూడా ఉంది. కాంగ్రెస్కు అనుబంధంగా ఉన్న NSUI ప్రభుత్వం ముందు ఆరు డిమాండ్లను ఉంచింది. అనుమానాస్పదంగా ఉన్న అన్ని JPSC, JSSC పరీక్షలపై 90 రోజుల్లోపు CID దర్యాప్తు చేపట్టాలని కోరింది. అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తరహాలో జార్ఖండ్ టెస్టింగ్ ఏజెన్సీను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.
ఆదివాసీ ఛాత్ర సంఘ్ నేత కార్తిక్ ఓరావ్ మాట్లాడుతూ.. నియామక పరీక్షల్లో గిరిజన, ప్రాంతీయ భాషలను క్వాలిఫైయింగ్ పేపర్లుగా చేర్చాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. అవకతవకలు జరిగినట్లు గుర్తించిన పరీక్షలను రద్దు చేయాలని కూడా కోరినట్లు వెల్లడించారు. ప్రభుత్వ కమిటీ తొలుత దేవేంద్రనాథ్ మహతో వర్గానికి చెందిన విద్యార్థుల సంఘంతో దాదాపు రెండు గంటల పాటు సమావేశమైంది. తమ సమస్యలను పరిష్కరించేందుకు త్వరగా నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఫోరం నేత తెలిపారు. అయితే 14వ JPSC పరీక్ష రద్దుతో పాటు తమ డిమాండ్లన్నింటినీ నెరవేర్చే వరకు నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
- Tags
- Jharkhand
- JPSC exam
- Paper LEak
తాజావార్తలు
-
TVS, Vida, Zelio, Bounce: బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. రూ.36,000కే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్..!
-
APFDC: సినిమా షూటింగ్స్కు సింగిల్ విండో.. విశాఖను ఫిల్మ్ హబ్గా మార్చేందుకు కీలక నిర్ణయాలు
-
Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
-
Mamitha Baiju : రెమ్యునరేషన్ పెంచేసిన మమిత బైజు.. రూ. 3 కోట్లు డిమాండ్?
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!