Sajjala Ramakrishna Reddy: ఇప్పటం విషయంలో పవన్కు ఆవేశం ఎందుకు..?
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై మరోసారి ఫైర్ అయ్యారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇప్పటం విషయంలో పవన్ కళ్యాణ్ కు ఎందుకు అంత ఆవేశం వచ్చిందో అర్థం కాలేదన్న ఎద్దేవా చేసిన ఆయన.. సభకు స్థలం ఇచ్చిన ఒక్కరి ఇల్లు కూడా పోలేదు.. ప్రభావం పడే అవకాశం ఉన్న ఒక వ్యక్తి కూడా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాడన్నారు.. కానీ, దీనికి పవన్ హైవే పై చేసిన డ్రామా అందరూ చూశారు.. తర్వాత చంద్రబాబు నాయుడు కొడుకు కూడా అదే పని.. ఏమీ లేని విషయాన్ని ఒక సినిమా కథలా తయారు చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.. ఇదంతా కుట్రపూరితంగా చేశారని విమర్శించిన ఆయన.. నిజంగా అధికారంలోకి రావాలి అనుకునే రాజకీయ పార్టీలు ఇలా చేస్తాయా? అని ప్రశ్నించారు. 2019లోనూ ఇలానే ప్రజలను రాజధాని పేరుతో గ్రాఫిక్స్ చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు సజ్జల..
Read Also: Governor Tamilisai: రాజ్ భవన్ కి ఆ..అమ్మాయి రావడంతోనే విషయం తెలిసింది
Also Read
- AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
- TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
- AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
- AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..
అయితే, మూడేళ్లలోనే 30 ఏళ్ళలో చేయలేని అభివృద్ధిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేశారని ప్రశంసలు కురిపించారు సజ్జల రామకృష్ణారెడ్డి.. అందుకే చంద్రబాబుకు, ఆయనకు మద్దతు ఇస్తున్న మీడియా సంస్థలకు కడుపు మంట అని ఫైర్ అయ్యారు.. ప్రజలతో కనెక్టివిటీ లేకుండా కేవలం ట్విట్టర్ స్పందనల వల్ల ప్రయోజనం ఉండదని చంద్రబాబుకు ఎందుకు అర్థం కావటం లేదో? అని నిలదీశారు. జగనన్న ఇళ్ల సోషల్ ఆడిట్ చేస్తారట..! 3 లక్షల ఇళ్ల వరకు సీలింగ్ స్టేజ్ లో ఉన్నాయి.. దీని కంటే ముందు 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ను ప్రభుత్వం చేసిందన్నారు. జనసేనది దిక్కు మాలిన ఆలోచన అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. 2014 ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసే కదా పవన్ ప్రచారం చేసింది? అని నిలదీసిన ఆయన.. అర్హులైన అందరికీ మూడు సెంట్ల స్థలం, పక్కా గృహాలు ఇస్తామని హామీ ఇచ్చారు.. ఎన్నికల హామీలో కనీసం ఒక్క సెంటు భూమి అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు.. పవన్ ఎప్పుడైనా ఈ విషయం పై ప్రశ్నించారా? అప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే కదా పోటీ చేసింది..? ఇది ప్రజలను మోసం చేయటం కాదా? అని మండిపడ్డారు. ఇక, మళ్లీ చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడానికి వీరంతా పన్నుతున్న కుట్రలను ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.. గమనించటమే కాదు వీళ్ల మోసాలను ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి.
తాజావార్తలు
-
Gold Rate Today: చల్లబడిన బంగారం ధరల వేడి.. హైదరాబాద్లో నేటి రేట్స్ ఇవే!
-
Oben Rorr EVO: రూ.1 లక్షకే కొత్త ఓబెన్ రోర్ Evo.. 180KM రేంజ్తో అదిరిపోయే బైక్
-
NBK 112 : బాలయ్య-కొరటాల శివ అనౌన్స్మెంట్ వచ్చేసింది.. మాస్ విద్వంసమే
-
Babar Azam: టీ20 క్రికెట్లో నయా హిస్టరీ.. కోహ్లీ, డుప్లెసిస్ను వెనక్కి నెట్టేసిన బాబర్ ఆజామ్..
-
Instagram Star Murder: భర్త చేతితో ఇన్స్టా స్టార్ దారుణ హత్య.. ట్విస్ట్ ఏంటంటే..?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!