Vice MPP Election: దంపతుల మధ్య చిచ్చు పెట్టిన వైస్ ఎంపీపీ ఎన్నిక.. పుట్టింటికి వెళ్లిపోయిన భార్య..!
- భార్య భర్తల మధ్య చిచ్చు పెట్టిన మండలపరిషత్ ఎన్నికలు..
- పుల్లలచెరువు మండల పరిషత్లో వైస్ ఎంపీపీ ఎన్నికలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vice MPP Election: ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల.. జడ్పీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు జరగుతున్నాయి.. అయితే, ప్రకాశం జిల్లాలో మండలపరిషత్ ఎన్నికలు భార్య భర్తల మధ్య చిచ్చు పెట్టింది.. పుల్లలచెరువు మండల పరిషత్లో వైస్ ఎంపీపీ ఎన్నిక జరిగింది.. ఈ ఎన్నికలో టీడీపీ నాయకులు.. వైసీపీ ఎంపీటీసీ నాగేంద్రమ్మ భర్త పొలయ్య మధ్య చిచ్చు పెట్టి అగ్గిరాజేశారట.. పూర్తి వివరాల్లోకి వెళ్లే పుల్లలచెరువు మండలంలో వైసీపీ ఎంపీటీసీగా ఉన్నారు నాగేంద్రమ్మ.. అయితే, ఆమె భర్త పోలయ్య.. ముటుకుల గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్లో కాంట్రాక్టు పద్ధతిలో వాచ్మెన్గా విధులు నిర్వహిస్తున్నాడు.. మండల పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తే.. నీ ఉద్యోగం తీసేస్తామని టీడీపీ నాయకులు బెదిరించినట్టుగా తెలుస్తోంది.. దీంతో, తన భార్యను వైసీపీకి ఓటు వేయవద్దు టీడీపీకి ఓటు వేయాలని భర్త ప్రాధేయపడ్డాడట.. వైసీపీకి ఓటు వేస్తే నా ఉద్యోగం పోతుందని తెలిపాడట.. అయితే మండల పరిషత్ ఎన్నికల్లో భర్త పోలయ్య మాట వినకుండా నాగేంద్రమ్మ వైసీపీకి ఓటు వేయడంతో ఇద్దరి మధ్య వివాదం ప్రారంభమైనట్టు తెలుస్తోంది..
Read Also: Mad Square Review: మ్యాడ్ స్క్వేర్ రివ్యూ
Also Read
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
- CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
- Hidden Treasure : అడవిలో అర్థరాత్రి తవ్వకాలు.. గుప్తనిధుల కోసం ఫారెస్ట్ ఆఫీసర్లే వేట.?
- Earthquake In Ongole: ఒంగోలులో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు
అయితే, వైసీపీ నాయకులు నాగేంద్రమ్మకు బుజ్జగించి వైసీపీకి ఓటు వేయించుకున్నారని తెలుస్తుంది.. మండల పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసిన ఎంపీటీసీ నాగేంద్రమ్మ తనను భర్త పోలయ్య ఏమైనా అంటాడేమోనన్న భయంతో పుట్టింటికి వెళ్లిపోయింది.. మరోవైపు, పోలయ్యను కలిసి వైసీపీ నాయకులు.. ఆయన్ని బుజ్జగించి నీకు ఇబ్బంది లేకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారట.. దీంతో, సమస్య పరిష్కారం అయ్యింద.ఇ. పుట్టింటికి వెళ్లిన ఎంపీటీసీ నాగేంద్రమ్మను ఈ రోజు వెళ్లి భర్త పోలయ్య తీసుకువస్తాడని.. వైసీపీ నేతలు చెబుతున్నారు.. ఏది ఏమైనా మండల పరిషత్ ఎన్నికలు భార్య భర్తల మధ్య అగ్గిరాజేసి ఆగదాన్ని పెంచినట్టు అయ్యింది.. కాగా, పుల్లలలచెరువు మండల పరిషత్ వైస్ ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీకి విజయం వరించింది.. మొత్తం 15 స్థానాల్లో ఒక వ్యక్తి హాజరు కాకపోవడంతో 14 సభ్యులకు సంఖ్య బలం పడిపోయింది.. వైసీపీ 7.. టీడీపీ 7 ఓట్లతో చేరి సమానంగా ఓట్లు రావడంతో ఉత్కంఠగా ఎన్నికల ప్రక్రియ ఏర్పడింది.. అధికారులు డ్రా తీయడంతో వైసీపీ అభ్యర్థి లింగంగుట్ల రాములు విజయం సాధించారు.
తాజావార్తలు
-
Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
-
Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
-
Russia: నాటో కూటమిలో చీలిక తెచ్చేందుకు పుతిన్ బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!