Vice MPP Election: దంపతుల మధ్య చిచ్చు పెట్టిన వైస్ ఎంపీపీ ఎన్నిక.. పుట్టింటికి వెళ్లిపోయిన భార్య..!
- భార్య భర్తల మధ్య చిచ్చు పెట్టిన మండలపరిషత్ ఎన్నికలు..
- పుల్లలచెరువు మండల పరిషత్లో వైస్ ఎంపీపీ ఎన్నికలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vice MPP Election: ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల.. జడ్పీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు జరగుతున్నాయి.. అయితే, ప్రకాశం జిల్లాలో మండలపరిషత్ ఎన్నికలు భార్య భర్తల మధ్య చిచ్చు పెట్టింది.. పుల్లలచెరువు మండల పరిషత్లో వైస్ ఎంపీపీ ఎన్నిక జరిగింది.. ఈ ఎన్నికలో టీడీపీ నాయకులు.. వైసీపీ ఎంపీటీసీ నాగేంద్రమ్మ భర్త పొలయ్య మధ్య చిచ్చు పెట్టి అగ్గిరాజేశారట.. పూర్తి వివరాల్లోకి వెళ్లే పుల్లలచెరువు మండలంలో వైసీపీ ఎంపీటీసీగా ఉన్నారు నాగేంద్రమ్మ.. అయితే, ఆమె భర్త పోలయ్య.. ముటుకుల గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్లో కాంట్రాక్టు పద్ధతిలో వాచ్మెన్గా విధులు నిర్వహిస్తున్నాడు.. మండల పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తే.. నీ ఉద్యోగం తీసేస్తామని టీడీపీ నాయకులు బెదిరించినట్టుగా తెలుస్తోంది.. దీంతో, తన భార్యను వైసీపీకి ఓటు వేయవద్దు టీడీపీకి ఓటు వేయాలని భర్త ప్రాధేయపడ్డాడట.. వైసీపీకి ఓటు వేస్తే నా ఉద్యోగం పోతుందని తెలిపాడట.. అయితే మండల పరిషత్ ఎన్నికల్లో భర్త పోలయ్య మాట వినకుండా నాగేంద్రమ్మ వైసీపీకి ఓటు వేయడంతో ఇద్దరి మధ్య వివాదం ప్రారంభమైనట్టు తెలుస్తోంది..
Read Also: Mad Square Review: మ్యాడ్ స్క్వేర్ రివ్యూ
Also Read
- Hidden Treasure : అడవిలో అర్థరాత్రి తవ్వకాలు.. గుప్తనిధుల కోసం ఫారెస్ట్ ఆఫీసర్లే వేట.?
- Earthquake In Ongole: ఒంగోలులో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు
- Ambati Rambabu: రాజధానిని నిర్మించే స్థాయిలో ఏపీ ఉందా..? అమరావతిపై అంబటి సంచలన వ్యాఖ్యలు
- Markapuram Bus Fire Accident: మార్కాపురం బస్సు దగ్ధం.. బస్సు ఓనర్ కమ్ డ్రైవర్ హరికృష్ణ అరెస్ట్..!
అయితే, వైసీపీ నాయకులు నాగేంద్రమ్మకు బుజ్జగించి వైసీపీకి ఓటు వేయించుకున్నారని తెలుస్తుంది.. మండల పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసిన ఎంపీటీసీ నాగేంద్రమ్మ తనను భర్త పోలయ్య ఏమైనా అంటాడేమోనన్న భయంతో పుట్టింటికి వెళ్లిపోయింది.. మరోవైపు, పోలయ్యను కలిసి వైసీపీ నాయకులు.. ఆయన్ని బుజ్జగించి నీకు ఇబ్బంది లేకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారట.. దీంతో, సమస్య పరిష్కారం అయ్యింద.ఇ. పుట్టింటికి వెళ్లిన ఎంపీటీసీ నాగేంద్రమ్మను ఈ రోజు వెళ్లి భర్త పోలయ్య తీసుకువస్తాడని.. వైసీపీ నేతలు చెబుతున్నారు.. ఏది ఏమైనా మండల పరిషత్ ఎన్నికలు భార్య భర్తల మధ్య అగ్గిరాజేసి ఆగదాన్ని పెంచినట్టు అయ్యింది.. కాగా, పుల్లలలచెరువు మండల పరిషత్ వైస్ ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీకి విజయం వరించింది.. మొత్తం 15 స్థానాల్లో ఒక వ్యక్తి హాజరు కాకపోవడంతో 14 సభ్యులకు సంఖ్య బలం పడిపోయింది.. వైసీపీ 7.. టీడీపీ 7 ఓట్లతో చేరి సమానంగా ఓట్లు రావడంతో ఉత్కంఠగా ఎన్నికల ప్రక్రియ ఏర్పడింది.. అధికారులు డ్రా తీయడంతో వైసీపీ అభ్యర్థి లింగంగుట్ల రాములు విజయం సాధించారు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!