Pawan Kalyan : ఉత్తర భారత్, దక్షిణ భారత్ గా విడగొట్టద్దుః పవన్ కల్యాణ్
- సనాతన ధర్మం గురించి మాట్లాడొద్దు
- హిందువులను అవమానిస్తే కోపం రావొద్దా
- హిందీ కూడా అవసరమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan : పిఠాపురంలో జనసేన ఆవిర్భావ 12వ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా హిందీ భాష, సనాతన ధర్మం, ఉత్తర భారత్, దక్షిణ భారత్ గా విడగొట్టడంపై మాట్లాడారు. భారత్ దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉత్తర భారత్, దక్షిణ భారత్ గా విడగొట్టొద్దు అంటూ తేల్చి చెప్పారు. మనమంతా ఇండియన్లుగా గర్వించాలన్నారు. ఎప్పటికీ ఉత్తర భారత్, దక్షిణ భారత్ గా విడిపోతాం అని ఎవరికి వారు మాట్లాడితే ఎలా.. అంతా మీ ఇష్టమా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ, ఏపీ విభజన సమయంలో కూడా ఇలాంటి మాటలు చాలా వినిపించాయని గుర్తు చేశారు.
Read Also : Tamannah – Vijay : బ్రేకప్ అనంతరం ఒకే చోట కనిపించిన తమన్నా, విజయ్
Also Read
- Botsa Satyanarayana: పంచదార్లలో వైసీపీ నేత బొత్స సంచలన వ్యాఖ్యలు.. సర్కార్ పై తీవ్ర ఆరోపణలు
- Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో సంచలనం.. డీజీపీ, సీపీ పేర్లు చేర్చాలంటూ..!
- AP COVID-19 Update: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పెరుగుతోన్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కేసులు
హిందీ భాషను వద్దని కొందరు చెప్పడం కరెక్ట్ కాదన్నారు. ఎందుకంటే అఖండ భారత దేశంలో హిందీ మాట్లాడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని.. అది అవసరం అన్నారు. మన సినిమాలను ఉత్తర ప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో విడుదల చేస్తూ అక్కడి డబ్బులు తీసుకుంటున్నప్పుడు.. హిందీ వద్దంటే కుదరదు అంటూ తేల్చి చెప్పారు. మన అభివృద్ధిలో హిందీ కూడా భాగమే అంటూ తెలిపారు.
ఇక సనాతన ధర్మం, సెక్యులరిజం గురించి కూడా మాట్లాడారు. ‘నేను ఇప్పుడేదో కొత్తగా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నానని అనుకుంటున్నారు. కానీ నేను మొదటి నుంచి రామభక్తుడినే. గతంలో రాముడి తల నరికినప్పుడు కూడా నేను మాట్లాడాను. అమ్మవారిని అవమానించినప్పుడు కూడా బయటకు వచ్చి ప్రశ్నించాను. హిందూ దేవుళ్లను తిడుతుంటే కోపం రావొద్దంటే ఎలా. పాతబస్తీలో ఒక వ్యక్తి పోలీసులు 15 నిముషాలు టైమ్ ఇస్తే హిందువులను చంపేస్తాం అంటే కోపం రాదా’ అంటూ ప్రశ్నించారు. తిట్టినా సరే కోపం రావొద్దంటే ఎలా.. ఇదే ఇతర మతాలను తిడితే ఊరుకుంటారా అంటూ అడిగారు. సనాతన ధర్మం జోలికి రావొద్దంటూ హెచ్చరించారు.
తాజావార్తలు
-
NTR : బాలా బాబాయ్ త్వరగా కోలుకోవాలి!
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్కు ఊరట.. మెదాంతకు తరలించాలని హైకోర్టు ఆదేశం..
-
Rahul Gandhi-Om Birla: లోక్సభ స్పీకర్తో రాహుల్ గాంధీ భేటీ.. ఏం డిమాండ్ చేశారంటే..!
-
Kalyan Ram: ‘గెట్ వెల్ సూన్ బాబాయ్’.. బాలయ్య కోసం కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!
-
Gopichand Malineni: ఫ్యాన్స్ టెన్షన్ పడొద్దు.. బాలయ్యకు స్వల్ప గాయమే
ట్రెండింగ్
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!