Pawan Kalyan: ప్రజాస్వామ్యంలో నియంత పోకడలు చెల్లవు.. రౌడీలు రాజ్యాలు ఏలకూడదు..!!
Pawan Kalyan: ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో వైసీపీ మంత్రులపై దాడి చేశారన్న ఆరోపణలతో 9 మంది జనసేన నేతలను పోలీసులను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో స్థానిక కోర్టు వారికి బెయిల్ నిరాకరించగా.. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన పార్టీ తమ నేతలకు బెయిల్ వచ్చేలా చర్యలు తీసుకుంది. ఈ మేరకు జైలు నుంచి విడుదలైన తమ పార్టీ నేతలను శనివారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ శాలువాలను కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా అరెస్ట్ అయిన నేతల కుటుంబాలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మానవాళికి ప్రజాస్వామ్యం ఒక వరమని, సామాన్యుల హక్కులకు రక్షణ దక్కితేనే.. ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందన్నారు. రాజ్యాంగంలో హక్కులు, బాధ్యతలు అందరికీ సమానమేనని.. ప్రజాస్వామ్యంలో నియంత పోకడలు చెల్లవని, రౌడీలు రాజ్యాలు ఏలకూడదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read Also: Ysrcp Sketch For Pawankalyan Live: పవన్ కళ్యాణ్ కోసం వైసీపీ స్కెచ్
Also Read
- AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
- TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
- AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
- AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..
అటు అక్రమ నిర్బంధాలకు జనసేన వెరవదని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు తెలుస్తాయనే జనవాణిని అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ఇది తమ భూమి.. తమ నేల అని.. తాము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నామని.. ఇక్కడే ఉంటామని స్పష్టం చేశారు. రౌడీలు రాజ్యమేలకూడదన్నదే జనసేన లక్ష్యమన్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు ఇచ్చిందని గుర్తుచేశారు. అధికారంలో ఉన్నవారు రౌడీలు మాదిరి ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. కనీసం సంస్కారం పాటించే సంప్రదాయం కూడా ఈ రాష్ట్రంలో లేదని మండిపడ్డారు. నమస్కారం పెడితే ప్రతి నమస్కారానికి బదులుగా ఏం మాట్లాడతారోనన్న భయం ఉందని పవన్ పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో నియంత పోకడలు చెల్లవు
* రౌడీలు రాజ్యాలు ఏలకూడదు
* అక్రమ నిర్భందాలకు జనసేన వెరవదు
* ప్రభుత్వ వైఫల్యాలు తెలుస్తాయనే జనవాణి అడ్డుకున్నారు
* మంగళగిరి పార్టీ కార్యాలయంలో విశాఖ నేతల ఆత్మీయ సమావేశంలో అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు pic.twitter.com/b88WJJ43Gb
— JanaSena Party (@JanaSenaParty) October 29, 2022
తాజావార్తలు
-
TGSRTC: రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసిన టికెట్ ఇన్ స్పెక్టర్.. చెప్పుతో దాడి చేసిన కండక్టర్, ప్రయాణికులు
-
Bhuvneshwar Kumar Record: దూసుకెళ్తున్న స్వింగ్ మాస్టర్ భువనేశ్వర్.. జస్ప్రీత్ బుమ్రా రికార్డు బ్రేక్!
-
AC Health Risks: గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా..? ఈ వ్యాధులకు కారణం కావచ్చు..! ఏం చేయాలి..
-
Top Selling CNG Cars: భారత్లో అత్యధికంగా సేల్ అయిన CNG కార్లు ఇవే..
-
IPL 2026 Playoffs Chances: రసవత్తరంగా ప్లేఆఫ్స్ రేస్.. గుజరాత్కు చిగురించిన ఆశలు, ఆ 5 టీమ్స్ ఇక ఇంటికేనా?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!