Pawan Kalyan: ప్రజాస్వామ్యంలో నియంత పోకడలు చెల్లవు.. రౌడీలు రాజ్యాలు ఏలకూడదు..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో వైసీపీ మంత్రులపై దాడి చేశారన్న ఆరోపణలతో 9 మంది జనసేన నేతలను పోలీసులను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో స్థానిక కోర్టు వారికి బెయిల్ నిరాకరించగా.. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన పార్టీ తమ నేతలకు బెయిల్ వచ్చేలా చర్యలు తీసుకుంది. ఈ మేరకు జైలు నుంచి విడుదలైన తమ పార్టీ నేతలను శనివారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ శాలువాలను కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా అరెస్ట్ అయిన నేతల కుటుంబాలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మానవాళికి ప్రజాస్వామ్యం ఒక వరమని, సామాన్యుల హక్కులకు రక్షణ దక్కితేనే.. ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందన్నారు. రాజ్యాంగంలో హక్కులు, బాధ్యతలు అందరికీ సమానమేనని.. ప్రజాస్వామ్యంలో నియంత పోకడలు చెల్లవని, రౌడీలు రాజ్యాలు ఏలకూడదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read Also: Ysrcp Sketch For Pawankalyan Live: పవన్ కళ్యాణ్ కోసం వైసీపీ స్కెచ్
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
అటు అక్రమ నిర్బంధాలకు జనసేన వెరవదని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు తెలుస్తాయనే జనవాణిని అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ఇది తమ భూమి.. తమ నేల అని.. తాము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నామని.. ఇక్కడే ఉంటామని స్పష్టం చేశారు. రౌడీలు రాజ్యమేలకూడదన్నదే జనసేన లక్ష్యమన్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు ఇచ్చిందని గుర్తుచేశారు. అధికారంలో ఉన్నవారు రౌడీలు మాదిరి ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. కనీసం సంస్కారం పాటించే సంప్రదాయం కూడా ఈ రాష్ట్రంలో లేదని మండిపడ్డారు. నమస్కారం పెడితే ప్రతి నమస్కారానికి బదులుగా ఏం మాట్లాడతారోనన్న భయం ఉందని పవన్ పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో నియంత పోకడలు చెల్లవు
* రౌడీలు రాజ్యాలు ఏలకూడదు
* అక్రమ నిర్భందాలకు జనసేన వెరవదు
* ప్రభుత్వ వైఫల్యాలు తెలుస్తాయనే జనవాణి అడ్డుకున్నారు
* మంగళగిరి పార్టీ కార్యాలయంలో విశాఖ నేతల ఆత్మీయ సమావేశంలో అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు pic.twitter.com/b88WJJ43Gb
— JanaSena Party (@JanaSenaParty) October 29, 2022
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!