Pawan Kalyan: ప్రజాస్వామ్యంలో నియంత పోకడలు చెల్లవు.. రౌడీలు రాజ్యాలు ఏలకూడదు..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో వైసీపీ మంత్రులపై దాడి చేశారన్న ఆరోపణలతో 9 మంది జనసేన నేతలను పోలీసులను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో స్థానిక కోర్టు వారికి బెయిల్ నిరాకరించగా.. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన పార్టీ తమ నేతలకు బెయిల్ వచ్చేలా చర్యలు తీసుకుంది. ఈ మేరకు జైలు నుంచి విడుదలైన తమ పార్టీ నేతలను శనివారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ శాలువాలను కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా అరెస్ట్ అయిన నేతల కుటుంబాలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మానవాళికి ప్రజాస్వామ్యం ఒక వరమని, సామాన్యుల హక్కులకు రక్షణ దక్కితేనే.. ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందన్నారు. రాజ్యాంగంలో హక్కులు, బాధ్యతలు అందరికీ సమానమేనని.. ప్రజాస్వామ్యంలో నియంత పోకడలు చెల్లవని, రౌడీలు రాజ్యాలు ఏలకూడదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read Also: Ysrcp Sketch For Pawankalyan Live: పవన్ కళ్యాణ్ కోసం వైసీపీ స్కెచ్
Also Read
- 108 Ambulances at District Courts: జిల్లా కోర్టుల వద్ద 108 అంబులెన్సులు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- AP Government: భూ కేటాయింపు విధానంలో కీలక సంస్కరణలు.. ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం
- OTR: సాయి కృష్ణ కస్టోడియల్ డె*త్.. హోమ్ మంత్రి ఎందుకు మౌనం?
- OTR: డ్యామేజ్ కంట్రోల్ కోసం ఎమ్మెల్యే పార్ధసారధి ప్రయత్నాలు.. ఎందుకు రివర్స్ అవుతున్నాయి?
అటు అక్రమ నిర్బంధాలకు జనసేన వెరవదని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు తెలుస్తాయనే జనవాణిని అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ఇది తమ భూమి.. తమ నేల అని.. తాము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నామని.. ఇక్కడే ఉంటామని స్పష్టం చేశారు. రౌడీలు రాజ్యమేలకూడదన్నదే జనసేన లక్ష్యమన్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు ఇచ్చిందని గుర్తుచేశారు. అధికారంలో ఉన్నవారు రౌడీలు మాదిరి ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. కనీసం సంస్కారం పాటించే సంప్రదాయం కూడా ఈ రాష్ట్రంలో లేదని మండిపడ్డారు. నమస్కారం పెడితే ప్రతి నమస్కారానికి బదులుగా ఏం మాట్లాడతారోనన్న భయం ఉందని పవన్ పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో నియంత పోకడలు చెల్లవు
* రౌడీలు రాజ్యాలు ఏలకూడదు
* అక్రమ నిర్భందాలకు జనసేన వెరవదు
* ప్రభుత్వ వైఫల్యాలు తెలుస్తాయనే జనవాణి అడ్డుకున్నారు
* మంగళగిరి పార్టీ కార్యాలయంలో విశాఖ నేతల ఆత్మీయ సమావేశంలో అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు pic.twitter.com/b88WJJ43Gb
— JanaSena Party (@JanaSenaParty) October 29, 2022
తాజావార్తలు
-
AAA Cinemas: విశాఖలో అల్లు అర్జున్ ‘AAA’ సినిమాస్.. 8 స్క్రీన్లతో ప్రీమియం మూవీ ఎక్స్పీరియెన్స్కు సిద్ధం!
-
Vaibhav Sooryavanshi: ఏమో ఎవరికి తెలుసు.. వైభవ్ సూర్యవంశీ బలహీనతను అతడు కనిపెట్టామేమో!
-
108 Ambulances at District Courts: జిల్లా కోర్టుల వద్ద 108 అంబులెన్సులు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
-
ZombieReddy2 : బాలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వంలో సైలెంట్ గా స్టార్ట్ అయిన జాంబీరెడ్డి – 2
-
Petrol, Diesel Prices Reduced: ఇది కదా కావాల్సింది.. పెట్రోల్ ధరలు లీటరు రూ. 5, డీజిల్ ధరలు రూ. 3 తగ్గింపు
ట్రెండింగ్
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!