కరోనా పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్కు 700 కోట్లు లాభాలు వచ్చాయి: సీహెచ్ నరసింగరావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కీలక సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఉక్కు పరిరక్షణ పోరాట సమితి చైర్మన్ సీహెచ్ నరసింగరావు మీడియాతో మాట్లాడారు.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఒక్క రోజు కూడా విరామం ఇవ్వకుండా నిరసన దీక్ష చేసిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. దీంతో భవిష్యత్ కార్యచరణపై ఉక్కు పరిరక్షణ పోరాట సమితి దృష్టి పెట్టింది. కరోనా పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్కు రూ.700 కోట్ల లాభాలు వచ్చాయని తెలిపారు. 150 మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కరోనాతో మృతి చెందారన్నారు. వచ్చే నెల 12 తో నిరసన దీక్షలకు ఏడాది పూర్తవుతుందన్నారు. 365 జెండాలను పట్టుకుని నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. వచ్చే నెల 13న ఉద్యమం ఏడాది పూర్తయిన సందర్భంగా బీజేపీ కార్యాలయ ముట్టడి, ఫిబ్రవరి 23న విశాఖ నగర బంద్తో పాటు రాష్ట్రబంద్కు పిలుపునిస్తామన్నారు. ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపడతామన్నారు.
Read Also:భవిష్యత్ కార్యచరణను ప్రకటించిన ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
స్టీల్ ప్లాంట్ వెనుక 16,500 కుటుంబాల త్యాగం ఉంది: మంత్రి రాజశేఖర్
స్టీల్ ప్లాంట్ వెనుక 16,500 కుటుంబాల త్యాగం ఉందని ఉక్కు పరిరక్షణ పోరాట సమితి మరో చైర్మన్ రాజశేఖర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టిన పెట్టుబడి తప్ప బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఇంత ఉద్యమం జరుగుతుంటే ఐతే స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాం..లేదా తీసేస్తాం అంటున్నారు.ప్రపంచ వ్యాప్తంగా స్టీల్ ప్లాంట్ పోరాట స్ఫూర్తి తెలియాలని ఉధృతంగా ఉద్యమిస్తామన్నారు. కరోనా సమయంలో లిక్విడ్ ఆక్సిజన్ అందించాం. దీపం పేరు పెట్టి ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయాలి అనుకున్నారో ఆ పథకంతోనే బీజేపీ ఆరిపోవడం ఖాయమని మంత్రి రాజశేఖర్ అన్నారు.
Read Also: తెలంగాణకు కేంద్రం శుభవార్త.. మరో 4 జాతీయ రహదారులు మంజూరు
స్టీల్ ప్లాంట్ను రక్షించుకుంటాం: మస్తానప్ప, వై సీఆర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు
స్టీల్ ప్లాంట్ను ఎట్టి పరిస్థితుల్లో రక్షించుకుని తీరుతామని వైసీఆర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు మస్తానప్ప స్పష్టం చేశారు. కేవలం 5వేల కోట్లు పెట్టుబడి పెడితే 3 లక్షల కోట్లుకు కార్మికులు తీసుకుని వెళ్లారు. పెట్టుబడి దారుల పక్షణా బీజేపీ నిలిచినందుకు ఫిబ్రవరి 23, 24 దేశ వ్యాప్త సమ్మె కొనసాగిస్తామన్నారు. ఈ ఉద్యమంతో ప్రభుత్వాలకు బుద్ధి చెప్పి తీరుతామన్నారు.
తాజావార్తలు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
-
Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
-
Dulquer Salman: ‘ఐ యామ్ గేమ్’ కోసం నాగ్ అశ్విన్ ఎడిటింగ్..
-
Nag Ashwin : దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’లో మైండ్ బ్లాంక్ అయ్యే సీక్రెట్ లీక్ చేసిన నాగ్ అశ్విన్!
-
Lionel Messi: ఫుట్బాల్ ప్రపంచంలో శకం సమాప్తం.. అర్జెంటీనా దిగ్గజం మెస్సీ రిటైర్మెంట్..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!