Nitin Gadkari: బయో ఇథనాల్ అందుబాటులోకి వస్తే.. లీటర్ పెట్రోల్ రూ. 15కి పడిపోతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitin Gadkari: ఎయిర్ పొల్యూషన్ తగ్గించేందుకు కృషి చేస్తున్నామని, కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఇంధన వినియోగమే మేలు అని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ రోజు తిరుపతిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రత్యామ్నాయ ఇంధన వినియోగ ఆవశ్యకతను చెప్పారు. కాలుష్యంతో పాటు నీటి వనరులను కాపాడాల్సిన అవసరం ఉందని, గ్రీన్ ఇండియా కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనాలని సూచించారు. ఈ ఏడాది ఆగస్ట్ నాటికి 56 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఒక్కరోజే దేశంలో మూడు వందల చోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.
40 శాతం పొల్యూషన్ రహదారుల వల్లే వస్తోందని, కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఇంధన వినియోగానికి కృషి చేస్తున్నామని గడ్కరీ తెలిపారు. బెంగుళూరులో త్వరలో డీజిల్ లో ఇథనాల్ కలిపిన వాహనాలు నడవనున్నాయని, ఆగస్టులో ప్రముఖ ట్రాన్స్ పోర్ట్ కంపెనీలు ఇథనాల్ వినియోగ వాహనాలను విడుదల చేయనున్నాయని వెల్లడించారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని అన్నారు.
Also Read
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
- Potti Sriramulu's Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
Read Also: Rajasthan: పోలీసుల కళ్లలో కారం కొట్టి.. గ్యాంగ్స్టర్ హత్య..
పెట్రోల్ వినియోగంతో పెరుగుతున్న వాయు కాలుష్యానికి చెక్ పెట్టేందుకే ఇతర మార్గాలపై అన్వేషణ ముమ్మరం చేసామని, ప్రత్యామ్నాయ ఇంధన వనరులయిన ఇథనాల్, మిథనాల్ వినియోగంపై దృషి గడ్కరీ చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అందుబాటులోకి వస్తే లీటర్ పెట్రోల్ ధర 15 రూపాయలకు పడిపోతుందని, బయో ఇథనాల్ వినియోగాన్ని ప్రోత్సహించనున్నామని, పెట్రోల్ కు ఇది చక్కని ప్రత్యామ్నాయం అని చెప్పారు.
బయో ఇథనాల్ తో నడిచే ద్విచక్ర వాహనాలను కొన్ని ప్రైవేట్ కంపెనీలు త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నాయని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణలో ఇథనాల్ సాయపడుతుందన్నారు. పెట్రోల్ లీటర్ 110 రూపాయలు ఉండగా, ఇథనాల్ 60 రూపాయలకే లభిస్తుందని తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్, బ్లాక్ హైడ్రోజన్ వనరుల వినియోగం మరింత పెరుగుతుందని, భవిష్యత్ గ్రీన్ హైడ్రోజన్ దే అని అన్నారు. కార్బన్ రహిత ఇంధనాలపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయని, భవిష్యత్తులో మనం ఇంధనం ఎగుమతి చేసే స్థాయికి వెళ్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
-
Pawan Kumar Chandana: మ్యాథ్స్లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
-
Jani Master: నిర్మాతల డబ్బులు దోచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!