దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం పట్టి పీడిస్తోంది. స్వచ్ఛమైన గాలి దొరకకా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే కాలుష్య నివారణ కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మేఘమథనం చేపట్టింది. కానీ ఈ ప్రయత్నం ఫెయిల్ అయింది.
World Most Polluted Cities: ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్య స్థాయిలను పరిశీలించే స్విస్ వాయు నాణ్యత టెక్నాలజీ సంస్థ (IQAir) ఇటీవల విడుదల చేసిన 2024 ప్రపంచ వాయు నాణ్యత నివేదిక ప్రకారం.. అస్సాంలోని బర్నిహాట్ (Byrnihat) నగరం భారత్ లోనే అత్యంత కాలుష్య నగరంగా గుర్తింపు పొందింది. ఈ నివేదిక ప్రకారం.. భారతదేశం ప్రపంచంలో ఐదవ అత్యంత కాలుష్య దేశంగా నిలిచింది. ముఖ్యంగా, భారతదేశంలోని నగరాల్లో సూక్ష్మ ధూళి రేణువుల స్థాయి PM2.5లు చాలా అధికంగా…
Supreme Court: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంతో ప్రజలు నిత్యం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాలుష్య నియంత్రణకు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 నిబంధనలు విధించడంతో.. ప్రస్తుతం సత్ఫలితాలు ఇచ్చింది. దీంతో జీఆర్ఏపీ-4 ఆంక్షల సడలింపుకు అత్యున్నత న్యాయస్థానం పర్మిషన్ ఇచ్చింది.
వాయు కాలుష్యం.. సహజ వాయువులతో నిండిన వాతావరణాన్ని కలుషితం చేసి, మనుషుల ఆరోగ్యంతో పాటు జీవావరణ సమతౌల్యతను, జీవరాశుల ఉనికిని నాశనం చేస్తుంది. శ్వాసక్రియ నుంచి స్ట్రాటో ఆవరణలోని ఓజోన్ పొర వరకు అన్నింటినీ దెబ్బతీస్తుంది. చెట్లను నరికివేయడం, జనాభా పెరగడం వంటి అనేక కారణాల వల్ల వాయు కాలుష్యం విపరీతంగా పెరిగి మానవ ఆరోగ్యం దెబ్బతింటోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే తరాలు స్వచ్ఛమైన గాలి పీల్చేలా పర్యావరణాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.
ప్రస్తుత రోజుల్లో వాయు కాలుష్యం పెద్ద సమస్యగా మారింది. కలుషిత గాలి వల్ల దగ్గు, జలుబు వంటి సాధారణ వ్యాధులు వస్తాయన్నది అందరికీ తెలుసు. అయితే వాయు కాలుష్యం చాలా తీవ్రమైన వ్యాధులకు కూడా కారణమవుతుందని మీకు తెలుసా..? అవును, వాయు కాలుష్యం దగ్గు, గొంతు నొప్పి వంటి చిన్న సమస్యలే కాకుండా అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది.
Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత కొనసాగుతోంది. ఈరోజు (శుక్రవారం) ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 11.3 డిగ్రీల సెల్సియస్గా నమోదు అయింది.
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ రియాక్ట్ అయ్యారు.. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీని దేశ రాజధానిగా కొనసాగాల్సి ఉందా అని క్వశ్చన్ చేశారు.
ఈ రోజు (మంగళవారం) ఏక్యూఐ 500 మార్క్ తాకింది. దీంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) IV ప్రస్తుతం దేశ రాజధానిలో కఠినమైన ఆంక్షలనను అమలు చేస్తుంది.
ఢిల్లీ- ఎన్సీఆర్ పరిధిలో కాలుష్యాన్ని నివారించేందుకు కఠిన చర్యలు అమలు చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Punjab: పంజాబ్ రాష్ట్రంలో ఆదివారం ఒక్కరోజున 400కి పైగా పంట వ్యర్థాలు తగుల బెట్టారు. ఈ సీజన్లో పంజాబ్ లో కేసుల సంఖ్య 8,404కి చేరిపోయింది. రిమోట్ సెన్సింగ్ డేటా సాయంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.