Rajasthan: పోలీసుల కళ్లలో కారం కొట్టి.. గ్యాంగ్స్టర్ హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో ఓ గ్యాంగ్స్టర్ హత్య జరిగింది. హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పోలీసులు భద్రత నడుమ తీసుకెళ్తున్న క్రమంలో కొంతమంది పోలీసులు కళ్లలో కారం కొట్టి గ్యాంగ్స్టర్ ని కాల్చి చంపారు. బుధవారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే హత్య కేసులో నిందితులుగా ఉన్న కల్దీప్ జఘీనా, విజయపాల్ అనే ఇద్దరు నిందితులను ఏడుగురు పోలీసులు బస్సులో జైపూర్ నుంచి భరత పూర్ తీసుకెళ్లుతున్న సమయంలో 8 మంది వ్యక్తులు బస్సును అడ్డగించి, పోలీసుల కళ్లలో కారం చల్లి ఇద్దరిపై కాల్పులు జరిపారు. భరత్పూర్లోని హలేనా పోలీస్ స్టేషన్ పరిధిలోని అమోలి టోల్ ప్లాజా సమీంలో ఈ ఘటన జరిగింది.
కుల్దీప్ జఘీనాపై హత్యానేరం ఉండగా.. విజయపాల్ అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే కేసులో నిందితులుగా ఉన్నారు. కాల్పుల అనంతరం వీరిద్దరిని భరత్పూర్లోని ఆర్బిఎం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, అక్కడ కుల్దీప్ జఘీనా చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారని, విజయపాల్ పరిస్థితి విషమంగా ఉందని ఎస్పి భరత్పూర్ మృదుల్ కచ్చవా చెప్పారు. మరోవైపు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించామని, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
Also Read
- Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- Meerpet Murder : గోనె సంచిలో ఆయా శవం.. మీర్పేట్లో దారుణ హత్య
- Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
Read Also: Bride Cheating: నిత్య పెళ్లికూతురు.. నాలుగు రాష్ట్రాలు, 8 పెళ్లిళ్లు
దౌసా సహా సమీప జిల్లాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితుల కోసం వేట కొనసాగిస్తు్నారు. ఈ సంఘటనపై అడిషనత్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (అడ్మినిస్ట్రేషన్)-జైపూర్ రాహుల్ ప్రకాష్ మాట్లాడుతూ, కుల్దీప్ జఘీనాపై అనేక బుల్లెట్లు కాల్చబడ్డాయని అయితే పోలీసులు విజయపాల్ను దాడి నుండి రక్షించగలిగారని.. బస్సు ప్రయాణికుల భద్రత దృష్ట్యా పోలీసు బృందం కాల్పులు జరపలేదని తెలిపారు.
2022 సెప్టెంబర్ 4న బీజేపీ నేత కృపాల్ జఘీనా హత్య కేసులో కుల్దీప్ జఘీనా నిందితుడిగా ఉన్నాడు. ఈ హత్యలో విజయపాల్ ప్రమేయం కూడా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. భూవివాదంలో కృపాల్ హత్య జరిగింది. ఈ కేసులో ప్రధాని నిందితుడు కుల్దీప్ జఘీనాతో పాటు మరో నలుగురిని గత సెప్టెంబర్ 11న మహారాష్ట్రలో అరెస్ట్ చేశారు. కృపాల్ హత్యకు ప్రతీకారంగానే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్పై పోరాటం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!