YS Jagan: హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్తాం.. సీతారాంపురం ప్రజలను కాపాడుకుంటాం..
- నంద్యాల జిల్లా సీతారామపురంలో వైఎస్ జగన్ పర్యటన..
- హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబ సభ్యులకు పరామర్శ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు సీతారాంపురం ఘటన తీసుకెళ్తాం.. గ్రామ ప్రజలను కాపాడుకుంటాం అన్నారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్.. నంద్యాల జిల్లా సీతారామపురంలో హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలీసులు రాకుండా ఆపగలిగారు.. అంటే ఏ స్థాయిలో రాజకీయాలు చేస్తున్నారో నిదర్శనం ఇదే అన్నారు.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? అని ప్రశ్నించిన ఆయన.. నడి రోడ్డుపై రఫీ అనే వ్యక్తిని నరికేశారు.. హత్య కేసుల్లో చిన్నచిన్నవాళ్లను ఇరికిస్తున్నారని మండిపడ్డారు.. చేయించిన ఎమ్మెల్యేల పేర్లు ఎందుకు రాయడం లేదు..? సుబ్బారాయుడును చంపిన శ్రీనివాసరెడ్డి కాల్ రికార్డ్ చెక్ చేస్తే ఎవరు చేయించారో తడలుస్తుంది కదా? అని ప్రశ్నించారు..
Also Read
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
- Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
- NIA: నంద్యాలలో ఎన్ఐఏ విచారణ.. కేరళ ఎన్కౌంటర్ తర్వాత మరో ట్విస్ట్.. మవోయిస్టు జయమ్మ జీవించి ఉందా..?
ఇక, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆత్మకూరులో విజయోత్సవసభలో ఏమి మాట్లాడారో చూడండి అంటూ.. బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రసంగం ఆడియో వినిపించారు వైఎస్ జగన్.. మండలానికి ఇద్దరిని చంపండి, పోలీసులను, కేసులను నేను చూసుకుంటానని అంటారా..? అంటూ ఫైర్ అయ్యారు.. ఎమ్మెల్యేలు మీటింగ్ లు పెట్టి దారుణంగా మాట్లాడుతుంటే కేసులు ఎందుకు పెట్టరు? అని నిలదీశారు.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సి ఉంది అన్నారు.. జగన్ ఉంటే విద్య దీవెన, వసతి దీవెన వచ్చేవి.. మహిళలకు సున్నా వడ్డీ ఇవ్వకుండా చంద్రబాబు మోసం చేశాడని విమర్శించారు.. ఎవరు ప్రశ్నించ కూడదని ఏపీలో రెడ్ బుక్ పాలన సాగిస్తున్నాడు.. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మండల, గ్రామాలలో స్థానిక నేతలు ఆధిపత్యం కోసం దారుణంగా ప్రవర్తిస్తున్నారు.. లా అండ్ ఆర్డర్ని నాశనం చేశారని మండిపడ్డారు.. సీతారాంపురంలో ఏజెంట్లుగా కూర్చున్నారని సుబ్బారాయుడు మరి కొందరిని చంపాలని చూసారు.. సుబ్బరాయుడును చంపేశారు.. అసలు సీతారాంపురంలో లా అండ్ ఆర్డర్ ఉందా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు..
Read Also: Shaurya Doval: పాకిస్థాన్ తో భారత్ కు ముప్పు..! బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
బయటి నుంచి వచ్చిన వాళ్లు కూడా రాడ్లు, కర్రలు, కత్తులు, తుపాకులతో ఏకమవుతుంటే నారపరెడ్డి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు అని తెలిపారు వైఎస్ జగన్.. గ్రామంలో ఏదో జరుగబోతుందని, పోలీలనురమ్మని రాత్రి 9కి ఫోన్ చేస్తే ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చారు.. సీఐ, డీఎస్పీలకు ఫోన్లు చేశారు.. అయితే బందోబస్తు మాత్రం తీసుకు రాలేదు. ఎస్ఐ, కానిస్టేబుళ్లు ప్రేక్షకాపాత్ర వహించారని ఆరోపించారు. జిల్లా కేంద్రానికి 10 కి.మీ దూరంలో ఉన్నా, అక్కడ ఎస్పీ వున్నా ఎవరూ రాలేదు.. 10 నిముషాలు ప్రయాణం చేస్తే సీతారాంపురం రావచ్చు.. పోలీసులను పంపి ఉంటే ఈ హత్య జరిగేది కాదు కదా అని ఆవేదన వ్యక్తం చేశారు.. అదనపు బలగాలు రాలేదు.. ఎమ్మెల్యే ప్రోద్బలం, లోకేష్ , చంద్రబాబు అండదండలతో పోలీసులు ఇక్కడి రాకుండా చేశారు.. ఎస్ఐ, కానిస్టేబుళ్ల సమక్షంలో సుబ్బరాయుడును హత్య చేశారు అంటూ మండిపడ్డారు.. హత్య చేశారని చెప్పినా నిందితులను పట్టుకోలేదు.. నారపరెడ్డి అనే వ్యక్తి ఎస్పీకి కూడా ఫోన్ చేసి చెప్పినా పోలీసులను పంపలేదు.. ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించాలని ప్రయత్నిస్తే, ఎస్పీకి ఫోన్ చేస్తే నంద్యాల త్రి టౌన్ పీఎస్ లో అప్పగించాలని చెప్పారు.. సీతారాంపురం కి అదనపు బలగాలు ఎందుకు రాలేదు..? హత్య చేసి కొందరిపై దాడి చేసినా ఎందుకు పోలీసులు రాలేదు.. దీని వెనుక ఎవరి ప్రోద్బలం ఉంది అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైఎస్ జగన్.
తాజావార్తలు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్బై
-
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
-
Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
-
Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
-
SCO Summit: పాక్ ప్రధాని ముందే ఉగ్రవాదంపై మోడీ స్ట్రాంగ్ మెసేజ్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!