Srisailam Dam Safety: శ్రీశైలంలో ముగిసిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల పరిశీలన.. నవంబర్లో టెండర్లు..
- ముగిసిన శ్రీశైలం జలాశయం పరిశీలన..
- రెండు రోజుల పాటు ప్రపంచ బ్యాంక్.. డ్యామ్ పేఫ్టీ.. సీడబ్ల్యూసీ అధికారుల పరిశీలన..
- నవంబర్ లో టెండర్లకు పిలుస్తామని వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam Dam Safety: శ్రీశైలం జలాశయంపై ప్రపంచ బ్యాంక్, డ్యామ్ పేఫ్టీ, సీడబ్ల్యూసీ అధికారుల పరిశీలన ముగిసింది.. యాంటీ జలాస్కి ప్రపంచ బ్యాంక్ టెక్నికల్ ఎక్స్పర్ట్ వారితో పాటు ముక్కల రమేష్, రాజగోపాల్, సీడబ్ల్యూసీ సేలం ఆధ్వర్యంలో నిన్న.. ఈరోజు రెండు రోజుల పాటు పరిశీలన జరిగాయి.. రెండు రోజులుగా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు జలాశయం అధికారులతో కలిసి సమావేశమై జలాశయానికి సంబంధించిన ప్లాంజ్ ఫుల్, అప్రోచ్ రోడ్డు డ్యామ్ గేట్లు.. కొండ చర్యలకు సంబంధించిన వాటిని అధికారులతో కలిసి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పరిశీలనలో మొదటి పేజ్ కింద 103 కోట్లు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఆమోదం తెలిపినట్లు జలాశయం అధికారులు తెలిపారు. పరిశీలన అనంతరం జలాశయం వ్యూ పాయింట్ వద్ద డ్యామ్ సేఫ్టీ, సీడబ్ల్యూసీ అధికారులతో ముఖాముఖిగా చర్చించి జలాశయానికి సంబంధించిన మరమ్మత్తుల వివరాలను సమర్పించారు.
Read Also: PM Modi: రెండు రోజుల పాటు లావోస్ పర్యటనకు ప్రధాని మోడీ..
Also Read
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం
- Bhuma Akhila Priya: హత్య కేసుల్లో జీవిత ఖైదు పడిన 12 మంది దోషులకు భూమా అఖిల ప్రియ పరామర్శ.. సంచలన వ్యాఖ్యలు
అనంతరం జలాశయం సీఈ కబీర్ డ్యామ్ సేఫ్టీ అధికారి నూతన కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. డ్యామ్ మరమ్మతుల పేజ్ 1 కింద 103 కోట్లకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఆమోదం లభించిందని.. ఈ సంవత్సరం నవంబర్ లో డ్యామ్ మరమ్మత్తులకు టెండర్లు పిలవనున్నట్లు కబీర్ భాష తెలిపారు.. గతంలో వరదల కారణంగా డ్యాం ముందు భాగంలో ఏర్పడిన ప్లాంజ్ ఫుల్ కి.. ముఖ్యంగా 10 కోట్లు కేటాయింపు ఉంటుందన్నారు.. అలానే జలాశయం అప్రోచ్ రోడ్డు, కొండ చరియల మరమ్మత్తులకు మొదటి విడతగా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అంగీకారం తెలిపారు.. అయితే 2011 నుండి 2024 వరకు పూడిక ద్వారా జలాశయం 9 టీఎంసీలు నీరు మాత్రమే తగ్గిందని డ్యామ్ కు ఎటువంటి ఇబ్బంది లేదని డ్యామ్ సేఫ్టీ అధికారి నూతన కుమార్ అన్నారు. ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జలాశయానికి 103 కోట్ల ఆమోదం తెలపడం ఆనందకరమైన విషయమని డ్యామ్ సేఫ్టీ అధికారి నూతన కుమార్ పేర్కొన్నారు.. డ్యాం ముందు భాగంలో ఏర్పడిన ప్లాంజ్ ఫుల్ ప్రస్తుతం సుమారు 46 మీటర్ల లోతు ఉందని.. అలానే మరో మూడు సంవత్సరాల తర్వాత మళ్లీ పూడికపై అధ్యయనం చేస్తామని డ్యామ్ సేఫ్టీ అధికారి నూతన కుమార్ మీడియాకు వెల్లడించారు.
తాజావార్తలు
-
RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
-
Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
-
DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు.. కర్ణాటక కాంగ్రెస్లో లుకలుకలు..
-
CM Revanth Reddy : పాలమూరు వెనుకబాటుతనానికి గత ప్రభుత్వమే కారణం..
-
Accident: ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఘోర ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ కెప్టెన్ ..
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!