Srisailam Dam Safety: శ్రీశైలంలో ముగిసిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల పరిశీలన.. నవంబర్లో టెండర్లు..
- ముగిసిన శ్రీశైలం జలాశయం పరిశీలన..
- రెండు రోజుల పాటు ప్రపంచ బ్యాంక్.. డ్యామ్ పేఫ్టీ.. సీడబ్ల్యూసీ అధికారుల పరిశీలన..
- నవంబర్ లో టెండర్లకు పిలుస్తామని వెల్లడి..
Srisailam Dam Safety: శ్రీశైలం జలాశయంపై ప్రపంచ బ్యాంక్, డ్యామ్ పేఫ్టీ, సీడబ్ల్యూసీ అధికారుల పరిశీలన ముగిసింది.. యాంటీ జలాస్కి ప్రపంచ బ్యాంక్ టెక్నికల్ ఎక్స్పర్ట్ వారితో పాటు ముక్కల రమేష్, రాజగోపాల్, సీడబ్ల్యూసీ సేలం ఆధ్వర్యంలో నిన్న.. ఈరోజు రెండు రోజుల పాటు పరిశీలన జరిగాయి.. రెండు రోజులుగా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు జలాశయం అధికారులతో కలిసి సమావేశమై జలాశయానికి సంబంధించిన ప్లాంజ్ ఫుల్, అప్రోచ్ రోడ్డు డ్యామ్ గేట్లు.. కొండ చర్యలకు సంబంధించిన వాటిని అధికారులతో కలిసి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పరిశీలనలో మొదటి పేజ్ కింద 103 కోట్లు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఆమోదం తెలిపినట్లు జలాశయం అధికారులు తెలిపారు. పరిశీలన అనంతరం జలాశయం వ్యూ పాయింట్ వద్ద డ్యామ్ సేఫ్టీ, సీడబ్ల్యూసీ అధికారులతో ముఖాముఖిగా చర్చించి జలాశయానికి సంబంధించిన మరమ్మత్తుల వివరాలను సమర్పించారు.
Read Also: PM Modi: రెండు రోజుల పాటు లావోస్ పర్యటనకు ప్రధాని మోడీ..
Also Read
- Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం
- Bhuma Akhila Priya: హత్య కేసుల్లో జీవిత ఖైదు పడిన 12 మంది దోషులకు భూమా అఖిల ప్రియ పరామర్శ.. సంచలన వ్యాఖ్యలు
- Nandyala: వివాహ బంధానికి మాయని మచ్చ.. ప్రియుడి మోజులో పడి ఇల్లాలు ఎంత పని చేసిందంటే..!
- Wife Kills Husband: ప్రియుడి కోసం మెడకు బెల్ట్ బిగించి, బండరాళ్లతో తలపై దాడి చేసి భర్తను హతమార్చిన భార్య..!
అనంతరం జలాశయం సీఈ కబీర్ డ్యామ్ సేఫ్టీ అధికారి నూతన కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. డ్యామ్ మరమ్మతుల పేజ్ 1 కింద 103 కోట్లకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఆమోదం లభించిందని.. ఈ సంవత్సరం నవంబర్ లో డ్యామ్ మరమ్మత్తులకు టెండర్లు పిలవనున్నట్లు కబీర్ భాష తెలిపారు.. గతంలో వరదల కారణంగా డ్యాం ముందు భాగంలో ఏర్పడిన ప్లాంజ్ ఫుల్ కి.. ముఖ్యంగా 10 కోట్లు కేటాయింపు ఉంటుందన్నారు.. అలానే జలాశయం అప్రోచ్ రోడ్డు, కొండ చరియల మరమ్మత్తులకు మొదటి విడతగా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అంగీకారం తెలిపారు.. అయితే 2011 నుండి 2024 వరకు పూడిక ద్వారా జలాశయం 9 టీఎంసీలు నీరు మాత్రమే తగ్గిందని డ్యామ్ కు ఎటువంటి ఇబ్బంది లేదని డ్యామ్ సేఫ్టీ అధికారి నూతన కుమార్ అన్నారు. ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జలాశయానికి 103 కోట్ల ఆమోదం తెలపడం ఆనందకరమైన విషయమని డ్యామ్ సేఫ్టీ అధికారి నూతన కుమార్ పేర్కొన్నారు.. డ్యాం ముందు భాగంలో ఏర్పడిన ప్లాంజ్ ఫుల్ ప్రస్తుతం సుమారు 46 మీటర్ల లోతు ఉందని.. అలానే మరో మూడు సంవత్సరాల తర్వాత మళ్లీ పూడికపై అధ్యయనం చేస్తామని డ్యామ్ సేఫ్టీ అధికారి నూతన కుమార్ మీడియాకు వెల్లడించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!
-
UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
-
Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
-
Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
-
Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో