Security lapse at Srisailam: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో భద్రతా వైఫల్యం వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. ఉగాది మహోత్సవాల సందర్భంగా గర్భగుడిలో శ్రీస్వామివారిని ఓ భక్తుడు సెల్ఫోన్లో వీడియో తీయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేవాలయంలో మొబైల్ ఫోన్లు, వీడియో కెమెరాలకు అనుమతి లేకపోయినప్పటికీ, ఒక సామాన్య భక్తుడు వాటిని లోనికి తీసుకెళ్లడం భద్రతా లోపాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. వీడియో తీసిన వ్యక్తి కర్ణాటక రాష్ట్రానికి చెందిన భక్తుడిగా గుర్తించినట్లు సమాచారం.…
Nandi Idol Damaged: పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భీమవరం పంచారామంలో అపచారం చోటు చేసుకుంది.. క్షేత్ర పుష్కరిణి వద్ద ఉన్న నంది విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పురాతన నందీశ్వరుడు విగ్రహం తల భాగాన్ని వేరు చేయడంతో పాటు విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయాన్ని స్థానికులు ఆలస్యంగా గుర్తించారు. పుష్కరిణి వద్ద నుంచి విగ్రహాన్ని పూర్తిగా తొలగించేందుకు ప్రయత్నించినట్టుగా ఆనవాళ్లు తెలుస్తున్నాయి. ఘన చరిత్ర ఉన్న పంచారామ క్షేత్ర ఆలయానికి సంబంధించిన…
TTD Laddu Controversy: కల్తీ నెయ్యి కొనుగోళ్ల వ్యవహారంపై ఏకసభ్య కమిషన్ విచారణ నేటి నుంచి ప్రారంభమైంది. అలిపిరి సమీపంలోని భూదేవీ కాంప్లెక్స్ నుంచి ఈ విచారణ స్టార్ట్ కానుంది. ఇవాళ విచారణలో పలు విభాగాలకు సంబంధించిన రికార్డులను కమిషన్ పరిశీలించనుంది.
Srisailam Temple Ghee Controversy: ఇప్పటికే తిరుమల శ్రీవారి ఆలయంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ, ఇప్పుడు శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి కూడా కల్తీ నెయ్యి సరఫరా జరిగిందా? అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ అంశం భక్తుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. సాధారణంగా శ్రీశైలం ఆలయానికి గతంలో విజయ డైరీ నుంచి నెయ్యి సరఫరా జరిగేది. అయితే 2022 మే నెల నుంచి అకస్మాత్తుగా విజయ డైరీని పక్కనపెట్టి, రాజేష్…
Annavaram Temple Prasadam: కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానం కి సంబంధించిన ప్రసాద విక్రయ కేంద్రములో ఎలుకలు తిరుగుతున్నాయి… నేషనల్ హైవే మీద ఏర్పాటుచేసిన ప్రసాదం విక్రయ కేంద్రం లో ఈ ఘటన జరిగింది.. అమ్మడానికి ఉంచిన ప్రసాదం బుట్టలలో నుంచి బయటికి వస్తున్నాయి ఎలుకలు.. ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన భక్తులు.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న దేవస్థానం అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.. ఇదేంటని ప్రసాదం అమ్ముతున్న వారిని ప్రశ్నిస్తే నచ్చితే…
Vadapalli: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. ఆలయంలో టికెట్ కౌంటర్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న రామవరపు రుషేంద్ర భక్తులను మోసం చేస్తూ.. నగదు దోపిడీకి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.
Indrakeeladri: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఇటీవల చోటు చేసుకున్న అపచారం ఘటనపై ఆలయ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు బాధ్యులైన వారికి మెమోలు జారీ చేశారు.
Konaseema District: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంచలనం సృష్టించిన ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కోనేరు వద్ద శివలింగాన్ని ధ్వంసం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. తోటపేట గ్రామానికి చెందిన 38 సంవత్సరాల శీలం శ్రీనివాస్ ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడిని అరెస్టు వివరాలు కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు. ఎస్పీ వివరాల ప్రకారం.. ఇంటివద్ద పంట కాలువ స్థలం విషయంలో ఆలయ పూజారితో నిందితుడికి వివాదం తలెత్తింది.
Srisailam శ్రీశైలం మహాక్షేత్రంలో శివస్వాముల సందడి నెలకొంది.. కార్తీక మాసంలో శివ మాల ధరంచిన శివస్వాములు.. ఇప్పుడు శ్రీమల్లికార్జునస్వామికి ఇరుముడి సమర్పణ కోసం శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తారు.. ఈ నేపథ్యంలో సాధారణ భక్తుల కోసం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్జు చైర్మన్ రమేష్ నాయుడు కీలక నిర్ణయం తీసుకునారు.. ఈ నెల 7వ తేదీ వరకు ఇరుముడితో వచ్చే శివస్వాములకు ప్రత్యేకంగా శ్రీస్వామివారి స్పర్శ దర్శనం ఉచితంగా కల్పించనున్నారు.. 7వ తేదీ వరకు ఇరుముడితో…
Annavaram Temple: సత్య దేవుని భక్తులకు షాక్ ఇచ్చారు అధికారులు.. వసతి గదుల అద్దె భారీగా పెంచారు.. ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో భక్తుల కోసం ఉన్న వసతి గదుల అద్దెలను దేవస్థాన అధికారులు పెంచారు. ఈ కొత్త అద్దెలు డిసెంబర్ 1వ తేదీ నుండి అమల్లోకి రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. భక్తుల రద్దీ పెరగడం, నిర్వహణ ఖర్చులు అధికమవడం, సౌకర్యాల మెరుగుదల వంటి కారణాల వల్ల అద్దెల…