Srisailam Dam: శ్రీశైలం డ్యామ్ వద్ద ట్రాఫిక్ సమస్యలకు చెక్..!
- శ్రీశైలం జలాశయం వద్ద ట్రాఫిక్ సమస్యపై నిఘా..
- డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టిన సున్నిపెంట పోలీసులు..
- శ్రీశైలం - హైదరాబాద్ ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ సమస్యలు..
- నంద్యాల ఎస్పీ ఆదేశాలతో సున్నిపెంట సీఐ పర్యవేక్షణ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam Dam: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలానికి వచ్చే భక్తులతో శ్రీశైలం ఘాట్ రోడ్డు రద్దీగా ఉంటుంది.. ఇక, శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తిన సమయంలో అయితే.. ఓ వైపు పర్యాటకులు, మరోవైపు మల్లికార్జున స్వామి భక్తులతో.. రద్దీ అమాంతం పెరిగిపోతుంది.. కొన్నిసార్లు డ్యామ్కు ఇరువైపులా.. అటు ఏపీ వైపు.. ఇటు.. తెలంగాణ వైపు కూడా కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ నిలిచిపోయిన సందర్భాలు అనేకం.. అయితే, ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు పోలీసులు.. శ్రీశైలాం జలాశయం వద్ద తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలపై సున్నిపెంట పోలీసులు చర్యలు చేపట్టారు..
Read Also: Tragedy : ఇలా చేస్తే గోవాకు ఎవడు రాడు.. హైదరాబాద్ జంటపై దాడి
Also Read
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం
- Bhuma Akhila Priya: హత్య కేసుల్లో జీవిత ఖైదు పడిన 12 మంది దోషులకు భూమా అఖిల ప్రియ పరామర్శ.. సంచలన వ్యాఖ్యలు
ట్రాఫిక్పై సున్నిపెంట సీఐ చంద్రబాబు, పోలీసులు సిబ్బంది డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు.. ఇటీవల కాలంలో హైదరాబాద్ – శ్రీశైలం ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ సమస్యలు అధికం కావడంతో సీఐ చంద్రబాబు డ్రోన్ కెమెరాలతో ట్రాఫిక్ ను పర్యవేక్షించారు.. అసలు, ఈ ట్రాఫిక్కు ఎలా నియంత్రించాలి అనేదానిపై అధ్యయనం చేస్తున్నారు.. నంద్యాల జిల్లా ఎస్పీ, ఆత్మకూరు డీఎస్పీ ఆదేశాలతో డ్రోన్ సహాయంతో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు చర్యలకు పూనుకుంటున్నారు.. ముఖ్యంగా శని, ఆదివారాలలో శ్రీశైలం – హైదరాబాద్ రోడ్డుపై వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది.. దీంతో, ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి.. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ట్రాఫిక్ సమస్యపై దృష్టి పెట్టారు.. డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు పోలీసులు.. ట్రాఫిక్కు నిరంతరాయంగా డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు.. దీంతో, శ్రీశైలం డ్యామ్ వద్ద, ఆంధ్ర-తెలంగాణ బోర్డర్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.. శ్రీశైలం టూటౌన్ సీఐ చంద్రబాబు.. డ్రోన్ కెమెరాలతో వినూత్నంగా ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ.. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చూస్తున్నారు.. దీంతో, భక్తులు ట్రాఫిక్ కష్టాలు లేకుండా సులభంగా శ్రీశైలం రాకపోకలు సాగిస్తున్నారు పోలీసులు చెబుతున్నారు..
తాజావార్తలు
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
-
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
-
Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
-
Lalit Modi: సచిన్, గంగూలీ, ద్రవిడ్లను నేను బ్రతిమాలుకున్నా.. లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..