Srisailam Dam Gates Lifted: కృష్ణమ్మ పరవళ్లు.. ఈ ఏడాదిలో రెండోసారి శ్రీశైలం గేట్లు ఎత్తిన అధికారులు
- కృష్ణమ్మ మరోసారి పరవళ్లు తొక్కుతుంది..
- శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు..
- ఈ సంవత్సరంలో రెండోవసారి రేడియల్ క్రెస్టు గేట్లు ఎత్తివేత..
- జలాశయంలోని రెండు గేట్లు 10 అడుగులు మేర ఎత్తి దిగువకు నీటి విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam Dam Gates Lifted: కృష్ణమ్మ మరోసారి పరవళ్లు తొక్కుతుంది.. శ్రీశైలం జలాశయానికి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది.. దీంతో.. ఈ సంవత్సరంలో రెండోవసారి రేడియల్ క్రెస్టు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు.. శ్రీశైలం జలాశయంలోని రెండు రేడియల్ క్రెస్టు గేట్లు 10 అడుగులు మేర ఎత్తి దిగువ నాగార్జునసాగర్ కు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు.. ప్రస్తుతం డ్యామ్కు ఇన్ ఫ్లో 2,13,624 క్యూసెక్కులుగా ఉండగా.. ఓవైపు రెండు గేట్లు ఎత్తివేత.. మరోవైపు.. విద్యుత్ ఉత్పత్తి నేపథ్యంలో.. డ్యామ్ నుంచి ఔట్ ఫ్లో 1,22,876 క్యూసెక్కులుగా ఉంది.. ఇక, శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నిండుకుండలా అంటే.. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు చేరింది నీటిమట్టం.. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 215.8070 టీఎంసీలుగా నీటినిల్వ ఉంది.. కుడి గట్టు జలవిద్యుత్ కేంద్రంతో పాటు.. ఎడమ గట్టు జల విద్యుత్ కేందంలోనూ విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది..
Read Also: Devara 3rd SOng : ‘దేవర’ మూడో పాట.. అడగకండి.. ఎప్పుడొచ్చినా భీభత్సమే!
Also Read
- Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
- NIA: నంద్యాలలో ఎన్ఐఏ విచారణ.. కేరళ ఎన్కౌంటర్ తర్వాత మరో ట్విస్ట్.. మవోయిస్టు జయమ్మ జీవించి ఉందా..?
- Bhuma Akhila Priya: అహోబిలం అంశంపై స్పందించిన భూమా అఖిలప్రియ.. ‘వాస్తవాలు వెలుగులోకి రావాలి’
- CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ.. భువివాదాలు లేకుండా చేస్తాం..
మరోవైపు.. నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్లు పది అడుగుల మేర ఎత్తి 30,026 క్యూసెక్కుల నీటిని మంగళవారం నుంచి దిగవకు విడుదల చేస్తు్న్నారు అధికారులు.. శ్రీశైలం నుంచి భారీగా ఇన్ ఫ్లో సాగర్ కు రావడంతో మరికొద్ది సేపట్లో ఇంకో నాలుగు గేట్లను కూడా ఎత్తనున్నారు అధికారులు.. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ యొక్క పూర్తి స్థాయినీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 590 అడుగులకు చెరుకుంది.. నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీల గాను ప్రస్తుతం 312 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నుండి కుడి, ఎడమ కాలువలకు, జంట నగరాల తాగునీటి అవసరాల కొరకు, మొత్తం 78,854 క్యూసెక్కుల నీటిని ఔట్ ఫ్లో రూపంలో వదుతున్నారు అధికారులు.. విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది..
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!