జిల్లాల పేర్లలో స్వల్ప మార్పులు… జిల్లాల విభజనపై పలుచోట్ల నిరసనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను విభజిస్తూ 26 జిల్లాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే జిల్లాల పేర్లలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. మంగళవారం కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టిన మెమోరాండానికి, తర్వాత ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లలో తేడాలు కనిపించాయి. కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టిన మెమోరాండంలో కాకినాడ కేంద్రంగా ఉన్న జిల్లాకు తూర్పుగోదావరి అని… రాజమండ్రి కేంద్రంగా ఏర్పాటు కానున్న జిల్లాకు రాజమండ్రి జిల్లా అని పేరు పెట్టినట్లు ఉంది. అయితే ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో మాత్రం కాకినాడ కేంద్రంగా ఉన్న జిల్లాకు కాకినాడ జిల్లా అని… రాజమండ్రి కేంద్రంగా ఏర్పాటు కానున్న జిల్లాకు తూర్పుగోదావరి అని పేరు పెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.
అలాగే కేబినెట్ భేటీలోని మెమోరాండంలో ఏలూరు కేంద్రంగా ఉన్న జిల్లాకు పశ్చిమగోదావరి అని… భీమవరం కేంద్రంగా ఏర్పాటు కానున్న జిల్లాకు నరసాపురం జిల్లా అని పేరు పెట్టినట్లు ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో మాత్రం ఏలూరు కేంద్రంగా ఉన్న జిల్లాకు ఏలూరు జిల్లా అని, భీమవరం కేంద్రంగా ఏర్పాటు కానున్న జిల్లాకు పశ్చిమగోదావరి అని పేరు పెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. రాజమండ్రి, భీమవరం కేంద్రాలుగా ఏర్పాటు కానున్న జిల్లాలు ఎక్కువ భాగం గోదావరిని ఆనుకుని ఉండటంతో వాటికి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు అని పేర్లు పెట్టాలని కొందరు మంత్రులు చేసిన సూచనల మేరకు మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
Also Read
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
మరోవైపు జిల్లాల విభజనపై రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడకు సమీపంలో ఉండే పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలను విజయవాడ కేంద్రంగా ఉండే జిల్లాలో కాకుండా… మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లాలో కలపడంపై స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. అటు రాయచోటి కేంద్రంగా ఏర్పాటైన అన్నమయ్య జిల్లాకు మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా నంద్యాల లోక్సభ స్థానం పరిధిలోని పాణ్యం శాసనసభ స్థానాన్ని కర్నూలు జిల్లాలో కలపడాన్ని పాణ్యం, గడివేముల మండలాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
తాజావార్తలు
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్బస్టర్!!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!