అప్పుతెచ్చుకోవడంలో ఏపీ ప్రభుత్వం పీహెచ్డీ చేసింది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో గత రెండున్నరేళ్లలో అభివృద్ది అనేది కనిపించటం లేదు. అప్పులేనిదే పూట గడవని పరిస్తితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. అప్పుతెచ్చుకోవడం, అరువు తెచ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పీహెచ్డీ చేసింది. అప్పుల నుడి బయటపడేందుకు ఏదైనా ఆలోచిస్తుంది అంటే అదేమి లేదు…ప్రజలపై భారం మాత్రమే వేస్తుంది. కేంద్ర ప్రభుత్వ పతకాలను నీరు కర్చే విధంగా ఏవేవో అదేసాలిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. కేంద్రం చెపట్టేవి తప్ప రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టింది లేదు. విజయవాడ – బెంగులూరు హై వే నిర్మాణాన్ని కేంద్రం చేపడుతోంది. నడికుడి శ్రీకాళహస్తి కొత్త లైన్ ప్రారంభమైంది…ఇంకా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితిలో రాష్ట్రం మేము డబ్బులు ఇవ్వలేము మీరే చేపట్టండి అంటోంది. 8లక్షల 16 వేల కోట్ల రూపాయిలతో ఏపీ లో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది అన్నారు.
అభివృద్ది విషయములో రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా డబ్బులు ఇవ్వాలి. అలా కాకుండా ఓటింగ్ కే పరిమితమైతే అదే మిగులుతుంది. రివర్స్ టెండరింగ్ అని మొదలు పెట్టారు కానీ ఇక్కడ రివర్స్ అభివృద్ది జరుగుతుంది. టిక్కెట్లు,మాంసం,చేపల అమ్మకాలను దానిని దురాలోచన అని వారు అనుకుంటున్నారు… మేము దురాలోచన అంటున్నాము. సినిమా టికెట్స్ అమ్మకాలు ప్రభుత్వమే చేపట్టి రాబోయే ఏడాదికి రిలీజ్ కాబోయే సినిమాలు చూపెట్టి దాని నుండి కూడా కొత్తగా రుణాలు తెద్దామనుకుంటున్నారేమో. సినిమా టిక్కెట్లు మేమే అమ్ముతామంటున్నవారు రేపు సినిమాలు కూడా మేమే తీస్తామంటారేమో అని తెలిపారు.
Also Read
- Nara Lokesh: ఇప్పుడు 'మావిగన్'.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్తాహై’ అంటారేమో..!
- Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ఇక సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు సంబందించి DPR సిద్దం చేసాము. కేంద్రంలోని పెద్దలను,రైల్వే బోర్డు ఛైర్మన్ సునీల్ శర్మ కలిసి విశాఖ రైల్వే జోన్ నీ ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని కోరాము. స్టీల్ ప్లాంట్ విషయములో కేంద్ర ప్రభుత్వంది విధాన నిర్ణయం తీసుకుంది. నిధుల సేకరణ మాత్రమే కాదు మాన్యుప్యక్షరింగ్ రంగాన్ని బలోపేతం చేయాలనే చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ విషయములో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం సరైందే అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దేనికి ఖర్చు పెట్టారో తేలియదు. అవి బయటపెడితే మిగతా నిధులను కేంద్రం ఇస్తుంది అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్పార్క్కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
-
Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన బేబీ బాస్.. అరంగేట్రం వాయిదాపై గవాస్కర్ సీరియస్ వార్నింగ్..
-
Celebrity Wedding: 78 ఏళ్ల వయసులో మళ్లీ వరుడైన స్టార్ నటుడు.. భార్యతో మరోసారి పెళ్లి!
-
Stock Market: 27 నిమిషాల్లోనే రూ.2.82 లక్షల కోట్లు లాభం! స్టాక్ మార్కెట్లో ఈ రోజు ఇన్వెస్టర్లకు పండగే!
-
Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?