MLA Prasanna Kumar: చంద్రబాబు లాంటి మోసగాడు.. దేశ చరిత్రలోనే ఉండరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Prasanna Kumar Shocking Comments On Chandrababu Naidu: వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. నెల్లూరు జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అంత అబద్దాలకోరు, పచ్చి మోసగాడు, నరరూప రాక్షసుడు ఈ దేశ చరిత్రలో ఉండదరని ఆరోపించారు. 2014లో 600కు వాగ్ధానాలు చేసి, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాడని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసగించారని దుయ్యబట్టారు. మూడు రోజుల పాటు రాజమహేంద్రవరం (రాజమండ్రి)లో అబద్ధపు వరాలు కురిపించాడని విమర్శించారు. మహానాడు వేదిక మీద పెద్ద నాటకాల రాయుడుగా డ్రామాలాడాడని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాను సీఎం జగన్ తాకట్టు పెట్టారని విమర్శించే చంద్రబాబు.. కేంద్రంతో అధికారం పంచుకున్నపుడు ఆ హోదాను ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు.
Odisha train tragedy: గూడ్స్ రైలులో ఇనుప ఖనిజం.. అందుకే ప్రమాద తీవ్రత పెరిగింది..
Also Read
- Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
- AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
- BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
- RK Roja: మంత్రి లోకేష్పై రోజా సంచలన ఆరోపణలు..
రెండు ఎకరాల ఆస్తి ఉన్న చంద్రబాబుకు.. ఈరోజు నాలుగు లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ నిలదీశారు. చంద్రబాబు ఎన్ని వేషాలు వేసినా, ప్రజలు ఆయన్ను నమ్మరని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి అవుతానని చంద్రబాబు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. దత్తపుత్రుడు వస్తున్నాడు, వారాహి తీసుకొస్తున్నాడు, అందరం కలుస్తున్నామమని చంద్రబాబు చెప్తున్నాడని పేర్కొన్నారు. ఎంతమంది కలిసొచ్చినా.. ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి 25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. ఇది ప్రజల ఆశీర్వాదమని, దీన్ని ఎవరూ ఆపలేరని ఉద్ఘాటించారు. బాబు చుట్టూ ఉండే కమ్మ సామ్రాజ్యం తప్ప.. తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తల్ని బాగుపరిచారా? అని అడిగారు. నీ దత్తపుత్రుడుతో కలిసి వారాహి ఎక్కినా.. సీఎం జగన్ వెంట్రుక కూడా పీకలేరని ఛాలెంజ్ చేశారు.
Kurnool Pregnancy Case: యువతి గర్భవతి.. డీఎన్ఏ టెస్ట్ కోరిన యువకుడు.. చివరికి షాక్
అంతకుముందు ప్రసన్నకుమార్ వైసీపీ పార్టీని వీడుతున్నారని ప్రచారాలు వచ్చినప్పుడు.. దీని వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఆయన ధ్వజమెత్తారు. తాను వైసీపీని వదిలే ప్రసక్తే లేదని, చనిపోయే వరకు వైఎస్ జగన్తోనే ఉంటానని స్పష్టం చేశారు. కావాలనే ఏదో విధంగా గందరగోళం సృష్టించి.. ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తున్నారని ప్రచారం చేస్తున్నారని, అదంతా అవాస్తవమని అన్నారు. ఒకవేళ తాను చనిపోయినా.. తన కుమారుడు రజత్ కుమార్ రెడ్డి కూడా జగన్తోనే ఉంటారన్నారు.
తాజావార్తలు
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
-
M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
-
M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
-
Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..