Minister Roja: చంద్రబాబూ.. విజన్ సరే, ఏపీకి ఏం చేశావ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Roja Fires On Chandrababu Naidu: ఏపీ మంత్రి రోజా మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విజన్ ఉంది, విస్తరాకుల కట్ట ఉందంటూ చంద్రబాబు మాయమాటలు చెప్తుంటారని విమర్శించారు. సెల్ఫోన్ కనిపెట్టాను, కంప్యూటర్ కనిపెట్టాను, హైదరాబాద్ కనిపెట్టాను అని చెప్పుకునే చంద్రబాబు.. ఏపీకి ఏం చేశావయ్య అంటే మాత్రం చెప్పడానికి ఏమీ ఉండదంటూ ఎద్దేవా చేశారు. గండికోటలో ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు సీఎం వైఎస్ జగన్ ఆదివారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి రోజా మాట్లాడుతూ.. తాము నిజమైన పారిశ్రామికవేత్తలతో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తే.. పని మనుషులు, డ్రైవర్లతో MOUలు చేసుకున్న ఘనుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. బాబు పాలనలో లిక్కర్ ఫ్యాక్టరీలనే పారిశ్రామిక ప్రగతిగా డబ్బా కొట్టుకున్నారని మండిపడ్డారు.
SSMB 29: రాజమౌళి సినిమా కోసం మహేష్కి స్పెషల్ ట్రైనింగ్…ఆ 3 నెలలు మిస్సింగే ఇక!
Also Read
- TG Bharath: రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.!
- Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్.. పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారంటూ అభిమానులు ఆందోళనలు.!
- Andhra Pradesh Ranks No.1: మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఏపీ.. దేశంలోనే అగ్రస్థానం
- Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
సీఎం జగన్పై ఉన్న నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడా పారిశ్రామిక వేత్తలు క్యూ కడుతున్నారని మంత్రి రోజా అన్నారు. తాము రూ.13 లక్షల కోట్ల మేర MOUలు చేసుకున్నామని.. రాష్ట్ర అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందని చెప్పారు. కానీ.. ఎల్లో మీడియా మాత్రం రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయంటూ తప్పుడు ప్రచార చేస్తోందని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో జగన్ పాలన చూసి.. అందరూ శభాష్ అంటున్నారని అన్నారు. వైఎస్ జగన్ అంటే కేవలం పేరు మాత్రమే కాదని, అదొక బ్రాండ్ అని కొనియాడారు. రికార్డు సృష్టించాలన్నా, బద్ధలు కొట్టాలన్నా జగన్కే సాధ్యమంటూ.. బాలయ్య శైలిలో సింహా సినిమాలోని డైలాగ్ని ఉచ్ఛరించారు. ఏపీలో రాబోయే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో వైసీపీని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జగనన్న వన్స్మోర్ అని ప్రజలు అంటున్నారని, తప్పకుండా మరోసారి వైసీపీ ప్రభుత్వమే వస్తుందని మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు.
MP Mithun Reddy: ముందస్తు ఎన్నికలు ఉండవు.. ఆయన వస్తానంటే స్వాగతిస్తాం
తాజావార్తలు
-
Pakistan: పాకిస్థాన్లో హై అలర్ట్.. ఇమ్రాన్ ఖాన్ ఉన్న జైలు నుంచి 14 మంది ఖైదీలు పరార్! అసలేం జరిగిందంటే?
-
TG Bharath: రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.!
-
Rajasthan: పదవీ విరమణకు ఒకరోజు ముందు షాక్.. ఉద్యోగాన్ని కోల్పోయిన టీచర్.. కారణం తెలిస్తే..!
-
ICC T20 Rankings: వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినా తగ్గేదేలే.. అగ్రస్థానంలో తెలుగు బిడ్డ..
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
ట్రెండింగ్
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!