Minister Roja: చంద్రబాబూ.. విజన్ సరే, ఏపీకి ఏం చేశావ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Roja Fires On Chandrababu Naidu: ఏపీ మంత్రి రోజా మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విజన్ ఉంది, విస్తరాకుల కట్ట ఉందంటూ చంద్రబాబు మాయమాటలు చెప్తుంటారని విమర్శించారు. సెల్ఫోన్ కనిపెట్టాను, కంప్యూటర్ కనిపెట్టాను, హైదరాబాద్ కనిపెట్టాను అని చెప్పుకునే చంద్రబాబు.. ఏపీకి ఏం చేశావయ్య అంటే మాత్రం చెప్పడానికి ఏమీ ఉండదంటూ ఎద్దేవా చేశారు. గండికోటలో ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు సీఎం వైఎస్ జగన్ ఆదివారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి రోజా మాట్లాడుతూ.. తాము నిజమైన పారిశ్రామికవేత్తలతో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తే.. పని మనుషులు, డ్రైవర్లతో MOUలు చేసుకున్న ఘనుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. బాబు పాలనలో లిక్కర్ ఫ్యాక్టరీలనే పారిశ్రామిక ప్రగతిగా డబ్బా కొట్టుకున్నారని మండిపడ్డారు.
SSMB 29: రాజమౌళి సినిమా కోసం మహేష్కి స్పెషల్ ట్రైనింగ్…ఆ 3 నెలలు మిస్సింగే ఇక!
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
సీఎం జగన్పై ఉన్న నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడా పారిశ్రామిక వేత్తలు క్యూ కడుతున్నారని మంత్రి రోజా అన్నారు. తాము రూ.13 లక్షల కోట్ల మేర MOUలు చేసుకున్నామని.. రాష్ట్ర అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందని చెప్పారు. కానీ.. ఎల్లో మీడియా మాత్రం రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయంటూ తప్పుడు ప్రచార చేస్తోందని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో జగన్ పాలన చూసి.. అందరూ శభాష్ అంటున్నారని అన్నారు. వైఎస్ జగన్ అంటే కేవలం పేరు మాత్రమే కాదని, అదొక బ్రాండ్ అని కొనియాడారు. రికార్డు సృష్టించాలన్నా, బద్ధలు కొట్టాలన్నా జగన్కే సాధ్యమంటూ.. బాలయ్య శైలిలో సింహా సినిమాలోని డైలాగ్ని ఉచ్ఛరించారు. ఏపీలో రాబోయే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో వైసీపీని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జగనన్న వన్స్మోర్ అని ప్రజలు అంటున్నారని, తప్పకుండా మరోసారి వైసీపీ ప్రభుత్వమే వస్తుందని మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు.
MP Mithun Reddy: ముందస్తు ఎన్నికలు ఉండవు.. ఆయన వస్తానంటే స్వాగతిస్తాం
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!