Minister Roja: చంద్రబాబూ.. విజన్ సరే, ఏపీకి ఏం చేశావ్?
Minister Roja Fires On Chandrababu Naidu: ఏపీ మంత్రి రోజా మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విజన్ ఉంది, విస్తరాకుల కట్ట ఉందంటూ చంద్రబాబు మాయమాటలు చెప్తుంటారని విమర్శించారు. సెల్ఫోన్ కనిపెట్టాను, కంప్యూటర్ కనిపెట్టాను, హైదరాబాద్ కనిపెట్టాను అని చెప్పుకునే చంద్రబాబు.. ఏపీకి ఏం చేశావయ్య అంటే మాత్రం చెప్పడానికి ఏమీ ఉండదంటూ ఎద్దేవా చేశారు. గండికోటలో ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు సీఎం వైఎస్ జగన్ ఆదివారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి రోజా మాట్లాడుతూ.. తాము నిజమైన పారిశ్రామికవేత్తలతో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తే.. పని మనుషులు, డ్రైవర్లతో MOUలు చేసుకున్న ఘనుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. బాబు పాలనలో లిక్కర్ ఫ్యాక్టరీలనే పారిశ్రామిక ప్రగతిగా డబ్బా కొట్టుకున్నారని మండిపడ్డారు.
SSMB 29: రాజమౌళి సినిమా కోసం మహేష్కి స్పెషల్ ట్రైనింగ్…ఆ 3 నెలలు మిస్సింగే ఇక!
Also Read
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. సమావేశంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదాలు.!
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
సీఎం జగన్పై ఉన్న నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడా పారిశ్రామిక వేత్తలు క్యూ కడుతున్నారని మంత్రి రోజా అన్నారు. తాము రూ.13 లక్షల కోట్ల మేర MOUలు చేసుకున్నామని.. రాష్ట్ర అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందని చెప్పారు. కానీ.. ఎల్లో మీడియా మాత్రం రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయంటూ తప్పుడు ప్రచార చేస్తోందని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో జగన్ పాలన చూసి.. అందరూ శభాష్ అంటున్నారని అన్నారు. వైఎస్ జగన్ అంటే కేవలం పేరు మాత్రమే కాదని, అదొక బ్రాండ్ అని కొనియాడారు. రికార్డు సృష్టించాలన్నా, బద్ధలు కొట్టాలన్నా జగన్కే సాధ్యమంటూ.. బాలయ్య శైలిలో సింహా సినిమాలోని డైలాగ్ని ఉచ్ఛరించారు. ఏపీలో రాబోయే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో వైసీపీని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జగనన్న వన్స్మోర్ అని ప్రజలు అంటున్నారని, తప్పకుండా మరోసారి వైసీపీ ప్రభుత్వమే వస్తుందని మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు.
MP Mithun Reddy: ముందస్తు ఎన్నికలు ఉండవు.. ఆయన వస్తానంటే స్వాగతిస్తాం
తాజావార్తలు
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
-
TRS: టీఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక.. ఎక్కడంటే..
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?