Minister Roja: చంద్రబాబూ.. విజన్ సరే, ఏపీకి ఏం చేశావ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Roja Fires On Chandrababu Naidu: ఏపీ మంత్రి రోజా మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విజన్ ఉంది, విస్తరాకుల కట్ట ఉందంటూ చంద్రబాబు మాయమాటలు చెప్తుంటారని విమర్శించారు. సెల్ఫోన్ కనిపెట్టాను, కంప్యూటర్ కనిపెట్టాను, హైదరాబాద్ కనిపెట్టాను అని చెప్పుకునే చంద్రబాబు.. ఏపీకి ఏం చేశావయ్య అంటే మాత్రం చెప్పడానికి ఏమీ ఉండదంటూ ఎద్దేవా చేశారు. గండికోటలో ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు సీఎం వైఎస్ జగన్ ఆదివారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి రోజా మాట్లాడుతూ.. తాము నిజమైన పారిశ్రామికవేత్తలతో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తే.. పని మనుషులు, డ్రైవర్లతో MOUలు చేసుకున్న ఘనుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. బాబు పాలనలో లిక్కర్ ఫ్యాక్టరీలనే పారిశ్రామిక ప్రగతిగా డబ్బా కొట్టుకున్నారని మండిపడ్డారు.
SSMB 29: రాజమౌళి సినిమా కోసం మహేష్కి స్పెషల్ ట్రైనింగ్…ఆ 3 నెలలు మిస్సింగే ఇక!
Also Read
- Gudivada Temple : గుడివాడలో ఘోరం.. స్వామివారి బంగారు కిరీటాన్ని తాకట్టు.!
- Off The Record : టీడీపీ, జనసేన మధ్య హాట్ హాట్ గా ఏలూరు మేయర్ సీటు
- Hidden Treasure : అడవిలో అర్థరాత్రి తవ్వకాలు.. గుప్తనిధుల కోసం ఫారెస్ట్ ఆఫీసర్లే వేట.?
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
సీఎం జగన్పై ఉన్న నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడా పారిశ్రామిక వేత్తలు క్యూ కడుతున్నారని మంత్రి రోజా అన్నారు. తాము రూ.13 లక్షల కోట్ల మేర MOUలు చేసుకున్నామని.. రాష్ట్ర అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందని చెప్పారు. కానీ.. ఎల్లో మీడియా మాత్రం రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయంటూ తప్పుడు ప్రచార చేస్తోందని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో జగన్ పాలన చూసి.. అందరూ శభాష్ అంటున్నారని అన్నారు. వైఎస్ జగన్ అంటే కేవలం పేరు మాత్రమే కాదని, అదొక బ్రాండ్ అని కొనియాడారు. రికార్డు సృష్టించాలన్నా, బద్ధలు కొట్టాలన్నా జగన్కే సాధ్యమంటూ.. బాలయ్య శైలిలో సింహా సినిమాలోని డైలాగ్ని ఉచ్ఛరించారు. ఏపీలో రాబోయే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో వైసీపీని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జగనన్న వన్స్మోర్ అని ప్రజలు అంటున్నారని, తప్పకుండా మరోసారి వైసీపీ ప్రభుత్వమే వస్తుందని మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు.
MP Mithun Reddy: ముందస్తు ఎన్నికలు ఉండవు.. ఆయన వస్తానంటే స్వాగతిస్తాం
తాజావార్తలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
-
Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
-
Summer Special: మామిడితో ఈ మ్యాజిక్ ట్రై చేశారా..? ఒక్క స్పూన్ తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు!
-
West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!