Peddireddy: రాసిపెట్టుకోండి.. ఈసారి కుప్పంలో వైసీపీదే గెలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యెం మండలంలో ఆదివారం నాడు ఇంధన, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక పొత్తు లేకుండా ఎన్నికలు వెళ్లిన దాఖలాలే లేవని ఆరోపించారు. గతంలో తెలంగాణలో కేసీఆర్తో కూడా పొత్తు పెట్టుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి గుర్తుచేశారు.
కేవలం 2019 ఎన్నికల్లో మాత్రమే చంద్రబాబు ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి ఘోర పరాజయం పాలయ్యారన్నారు. అవన్నీ గమనించి పొత్తు లేకుంటే డిపాజిట్లు దక్కవని చంద్రబాబు ఆలోచనలో పడ్డారని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే ఎవరితో అయినా పొత్తు పెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే అనైతిక కలయికలో ఉన్నారని.. ఇప్పుడు నైతికంగా కలిసి ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకున్నా.. వైఎస్ జగన్ సారథ్యంలో వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఒంటరిగా పోటీ చేసి గతంలో వచ్చిన ఫలితాల కంటే ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తామన్నారు.
Also Read
- Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
- Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
- National Handloom Day: చేనేత కుటుంబాలకు భారీ ఊరట.. రూ.179 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం!
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
ఎన్నికల్లో గెలవలేం.. ఓడిపోతామని ఏ నాయకుడు చెప్పడని.. అందుకే చంద్రబాబు వాళ్ల కార్యకర్తలకు గెలుపుపై భరోసా ఇస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. అసలు ఏం చేశారని చంద్రబాబుకు ప్రజలు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు. కేవలం సీఎం జగన్, వైసీపీని తిట్టడమే టీడీపీ ఎన్నికల నినాదంగా, అజెండాగా కనిపిస్తోందన్నారు. దానికి పచ్చ మీడియా పూర్తి సహకారం అందిస్తుందన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు కుప్పంలో ఇల్లు కట్టాలని చంద్రబాబు ఆలోచన చేయలేదని.. ఇప్పుడు ఇల్లు కట్టాలని ఆలోచన చేస్తున్నారని.. రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటున్నారని సమాచారం అందుతోందని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో పోటీ చేసినా చేయకపోయినా నైతికంగా ఆయన ఓడినట్లేనని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ చంద్రబాబు పోటీ చేస్తే కచ్చితంగా వైసీపీనే గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. మంత్రి పదవి తీసుకున్నప్పటి నుంచి విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షలు నిర్వహించానని.. సీఎం జగన్ కూడా సమీక్షలు చేపట్టారని.. ఏపీలో మెరుగైన విద్యుత్ సరఫరా చేయడం కోసం తాము చర్యలు తీసుకున్నామని తెలిపారు. గ్రామాల్లో, పట్టణాల్లో విద్యుత్ కోతలు లేవని.. రైతులకు కూడా నిరంతర విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. పరిశ్రమలకు విద్యుత్ కోతలు కొంత తప్పవన్నారు. గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ వినియోగం 30 శాతం పెరిగిందన్నారు. రాబోయే మూడు నాలుగు నెలల్లో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం అవుతుందని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు.
Chandra Babu: జగన్ ప్రభుత్వానికి కూల్చడం తప్ప నిర్మించడం తెలియదా?
తాజావార్తలు
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
-
RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!