Chandra Babu: జగన్ ప్రభుత్వానికి కూల్చడం తప్ప నిర్మించడం తెలియదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంతపురం జిల్లాలో దళితుడి ఇల్లు కూల్చివేతను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితుడి ఇల్లు కూల్చి ప్రభుత్వం ఏం సాధించిందని ప్రశ్నించారు. పేదవాడి ఇల్లు కూల్చివేతకు అంత మంది అధికారులు యుద్ధం చేస్తారా అంటూ నిలదీశారు. ఒక సామాన్య దళిత వ్యక్తి ఇంటిని కూల్చి కుటుంబాన్ని రోడ్డున పడేసేందుకు ఎమ్మెల్యే, ఆర్డీవో, పోలీసులు అధికారుల వరకు అంతా కలిసి యుద్దం చేయడంపై మండిపడ్డారు.
అసలు జగన్ ప్రభుత్వానికి కూల్చడం తప్ప నిర్మించడం తెలియదా అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. దళితుల ఇళ్లను కూడా కూల్చి ఈ ప్రభుత్వం రాక్షసానందం పొందుతున్నారని ఆరోపించారు. పేద కుటుంబం ఇల్లు కూల్చడమే లక్ష్యం అన్నట్లు పని చేసిన అధికారులు తీవ్ర తప్పిదానికి పాల్పడ్డారని. . రాజకీయ కక్షలతో వేధించే విష సంస్కృతి వైసీపీ డీఎన్ఏలోనే ఉందన్నారు. ఇంత మంది ప్రజా ప్రతినిధులు, అధికారులు ఒక ప్రజా సమస్య పరిష్కారం కోసం పని చేసి ఉంటే బాగుండేదన్నారు.
Also Read
ఇల్లు కూల్చివేతపై ఆవేదనతో హనుమంత రాయుడు, అతడి భార్య అనితాలక్ష్మీ దంపతులు ఆత్మహత్యాయత్నం చేయడంపై ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని చంద్రబాబు ప్రశ్నించారు. గళం లేని వారని దళితులను అణగదొక్కే చర్యలను దళిత జాతి క్షమించదని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి వెంటనే ఇంటిని మంజూరు చేయాలని.. వారిని వేదనకు గురిచేసినందుకు నష్టపరిహారం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Common Man is Suffering in Andhra Pradesh…
Dalit couple Hanumantha Rayudu and his wife Anitha Lakshmi live on a small plot of land in Nijavalli village in Kundurpi Tehsil of erstwhile Anantapur district. (1/2) pic.twitter.com/1x2Nxd3Pqy— Telugu Desam Party (@JaiTDP) May 8, 2022
Pawan Kalyan: పవన్ చేతికి కొత్తగా రెండు ఉంగరాలు.. జ్యోతిష్యాన్ని నమ్ముకున్నారా?
తాజావార్తలు
-
Best Parathas for Summer: మీరు పరోటా ప్రేమికులా..? వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ పరోటాలు ఇవే.. రుచితో పాటు శరీరానికి చల్లదనం
-
Kangana Ranaut : సీక్రెట్గా పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన కంగనా
-
RCB vs SRH: ఆర్సీబీ మాస్టర్ ప్లాన్ సక్సెస్.. మ్యాచ్ ఓడినా టేబుల్ టాపర్గా నిలిచిన పాటిదార్ సేన..
-
Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
-
Motorola Edge 70 Pro+: మోటరోలా ఎడ్జ్ 70 ప్రో+ త్వరలో భారత్ లో విడుదల.. 50MP ట్రిపుల్ రియర్ కెమెరా, 16GB RAM
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!